Malaysia Landslide: కొండచరియలు విరిగిన ఘటనలో 21కి చేరిన మృతుల సంఖ్య.. 12 మంది గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malaysia Landslide: మలేసియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరుకోగా.. మరో 12 మంది గల్లంతయ్యారు. ఈ మేరకు అక్కడి అధికారులు సమాచారం ఇచ్చారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని వారు పేర్కొన్నారు. రోడ్డు పక్కనున్న ఫార్మ్హౌస్ను క్యాంప్ సౌకర్యాల కోసం ఏర్పాటు చేశారని.. క్యాంప్ వెనకాల ఉన్న కొండ సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి విరిగిపడిందని.. విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ నరోజమ్ ఖామిస్ తెలిపారు. ఏడాది క్రితం ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయని, దాంతో సుమారు 21 వేల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు.
Fire Accident: మంచిర్యాలలో ఘోర అగ్నిప్రమాదం.. 6మంది సజీవదహనం
Also Read
- Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్లో సంచలనం.. ఏం జరిగిందంటే?
- China halts J10CE Delivery: భారత్ రఫేల్పై ఏడ్చి.. చైనా ముందు నవ్వుల పాలైన పాక్! 16 యుద్ధ విమానాల డెలివరీని ఆపేసిన చైనా..
- Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
కాగా.. శుక్రవారం తెల్లవారుజామున సెలంగోర్ రాష్ట్రం బటంగ్ కలి పట్టణ సమీపంలోని ఓ ఫార్మ్హౌస్లో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. 100 అడుగుల ఎత్తు నుంచి బురద, రాళ్లతో కూడిన మట్టి.. ఫార్మ్హౌస్లోని మూడెకరాల్లో 90 మంది పర్యాటకులు ఉన్న క్యాంప్ సైట్ను ఒక్కసారిగా ముంచెత్తింది. ఈ ఘటనలో 21 మంది బురద మట్టి కింద సజీవ సమాధి అయ్యారు. మరో 12 మంది జాడ తెలియకుండా పోయారు. అయితే.. ఇక్కడ క్యాంప్గ్రౌండ్ నిర్వహించడానికి యజమానుల వద్ద లైసెన్స్ లేదని అధికారులు స్థానిక మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన నుంచి డజన్లకొద్ది మంది సురక్షితంగా బయటపడ్డారని, ఏడుగురిని ఆసుపత్రిలో చేర్పించామని జిల్లా పోలీస్ చీఫ్ సుఫియాన్ అబ్దుల్లా చెప్పారు.
Army Commander RP Kalita: భారత్-చైనా సరిహద్దుపై ఆర్మీ కమాండర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఘటన నుంచి సురక్షితంగా బయటపడిన ఓ వ్యక్తి (57) మాట్లాడుతూ.. “మా గుడారాన్ని మట్టి కప్పడంతో నా కుటుంబం, నేను చిక్కుకున్నాము. అయితే.. మేము ఎలాగోలా తప్పించుకొని, కార్ పార్క్ ప్రాంతానికి చేరుకోగలిగాం. ఇంతలోనే రెండోసారి కొండచరియలు విరిగిపడటాన్ని విన్నాం’’ అని చెప్పాడు. మరోవైపు.. ప్రస్తుతం మలేసియాలో మాన్సూన్ సీజన్ కావడంతో దేశవ్యాప్తంగా నదులు, జలపాతాలు, కొండప్రాంతాలకు దగ్గరలో ఉన్న క్యాంప్సైట్లను వారం రోజుల పాటు మూసివేయనున్నట్టు ఆ దేశ డెవలప్మెంట్ మంత్రి కోర్ మింగ్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!