Jaishankar-Rubio: హార్ముజ్లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్కు రూబియో సూచన
- హార్ముజ్లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే
- జైశంకర్కు రూబియో సూచన
- నిశితంగా పరిశీలిస్తున్న ప్రపంచ దేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల హార్ముజ్ జలసంధిలో భారత్ నౌకలపై అమెరికా దాడులు చేసింది. దీంతో నౌకలు ధ్వంసంతో పాటు పలువురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా దౌత్యవేత్తను పిలిచి భారత్ నిరసన వ్యక్తం చేసింది. అయితే ఇదే వ్యవహారంపై ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. భారత్ నౌకలపై ఇరాన్ దాడులు చేసిందని రాసుకొచ్చారు. ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే తాజాగా ఇదే వ్యవహారంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక సందేశం ఇచ్చారు. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ప్రయాణించే అన్ని వాణిజ్య నౌకలు అమెరికా జారీ చేసే భద్రతా ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు స్పష్టం చేసినట్లు సమాచారం.
Also Read
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
ఇదే వ్యవహారంపై జైశంకర్ స్పందించారు. ‘‘ఈ సాయంత్రం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడాను. గల్ఫ్లో అమెరికా నౌకాదళం జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించడాన్ని భారతదేశం తీవ్రంగా నిరసిస్తున్నట్లు పునరుద్ఘాటించాను. వాణిజ్య నౌకలపై ఇటువంటి ప్రాణాంతక చర్యలు సమర్థనీయం కావు.’’ అని జైశంకర్ ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, హార్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న భద్రతా ఆందోళనల నేపథ్యంలో రూబియో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గంగా ఉన్న హార్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతను నిర్ధారించేందుకు అమెరికా చేపడుతున్న చర్యలకు అన్ని వాణిజ్య నౌకలు సహకరించాలని సూచించారు.
ఇటీవల హార్ముజ్ జలసంధి సమీపంలో పలు వాణిజ్య నౌకలపై దాడులు, డ్రోన్ ముప్పులు వెలుగులోకి రావడంతో అంతర్జాతీయ సమాజం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో భారత నౌకలు, భారతీయ సిబ్బంది భద్రతపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. భారత్-అమెరికా మధ్య జరిగిన ఈ చర్చల్లో ప్రాంతీయ భద్రత, సముద్ర మార్గాల రక్షణ, ఇంధన సరఫరా భద్రత వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు దౌత్య వర్గాలు పేర్కొన్నాయి. హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం రవాణా అవుతుండటంతో అక్కడి పరిస్థితులపై ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.
Spoke to US Secretary of State Marco Rubio this evening. I reiterated India’s strong protest at the attacks by the US Navy in the Gulf that killed three Indian mariners. Such lethal actions against commercial shipping are not justified.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 12, 2026
Tommy Pigott, Principal Deputy Spokesperson for the US Department of State, says, "US Secretary of State Marco Rubio spoke yesterday with Indian External Affairs Minister Subrahmanyam Jaishankar. The two officials discussed recent events in the Strait of Hormuz. The Secretary… pic.twitter.com/OvsjGBLh0a
— ANI (@ANI) June 13, 2026
- Tags
- india
- Jaishankar
- Marco Rubio
- Rubio
- us
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!