Jaishankar-Rubio: హార్ముజ్లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్కు రూబియో సూచన
- హార్ముజ్లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే
- జైశంకర్కు రూబియో సూచన
- నిశితంగా పరిశీలిస్తున్న ప్రపంచ దేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల హార్ముజ్ జలసంధిలో భారత్ నౌకలపై అమెరికా దాడులు చేసింది. దీంతో నౌకలు ధ్వంసంతో పాటు పలువురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా దౌత్యవేత్తను పిలిచి భారత్ నిరసన వ్యక్తం చేసింది. అయితే ఇదే వ్యవహారంపై ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. భారత్ నౌకలపై ఇరాన్ దాడులు చేసిందని రాసుకొచ్చారు. ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే తాజాగా ఇదే వ్యవహారంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక సందేశం ఇచ్చారు. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ప్రయాణించే అన్ని వాణిజ్య నౌకలు అమెరికా జారీ చేసే భద్రతా ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు స్పష్టం చేసినట్లు సమాచారం.
Also Read
ఇదే వ్యవహారంపై జైశంకర్ స్పందించారు. ‘‘ఈ సాయంత్రం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడాను. గల్ఫ్లో అమెరికా నౌకాదళం జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించడాన్ని భారతదేశం తీవ్రంగా నిరసిస్తున్నట్లు పునరుద్ఘాటించాను. వాణిజ్య నౌకలపై ఇటువంటి ప్రాణాంతక చర్యలు సమర్థనీయం కావు.’’ అని జైశంకర్ ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, హార్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న భద్రతా ఆందోళనల నేపథ్యంలో రూబియో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గంగా ఉన్న హార్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతను నిర్ధారించేందుకు అమెరికా చేపడుతున్న చర్యలకు అన్ని వాణిజ్య నౌకలు సహకరించాలని సూచించారు.
ఇటీవల హార్ముజ్ జలసంధి సమీపంలో పలు వాణిజ్య నౌకలపై దాడులు, డ్రోన్ ముప్పులు వెలుగులోకి రావడంతో అంతర్జాతీయ సమాజం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో భారత నౌకలు, భారతీయ సిబ్బంది భద్రతపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. భారత్-అమెరికా మధ్య జరిగిన ఈ చర్చల్లో ప్రాంతీయ భద్రత, సముద్ర మార్గాల రక్షణ, ఇంధన సరఫరా భద్రత వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు దౌత్య వర్గాలు పేర్కొన్నాయి. హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం రవాణా అవుతుండటంతో అక్కడి పరిస్థితులపై ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.
Spoke to US Secretary of State Marco Rubio this evening. I reiterated India’s strong protest at the attacks by the US Navy in the Gulf that killed three Indian mariners. Such lethal actions against commercial shipping are not justified.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 12, 2026
Tommy Pigott, Principal Deputy Spokesperson for the US Department of State, says, "US Secretary of State Marco Rubio spoke yesterday with Indian External Affairs Minister Subrahmanyam Jaishankar. The two officials discussed recent events in the Strait of Hormuz. The Secretary… pic.twitter.com/OvsjGBLh0a
— ANI (@ANI) June 13, 2026
- Tags
- india
- Jaishankar
- Marco Rubio
- Rubio
- us
తాజావార్తలు
-
Iran: పాక్ ప్రధానికి ఇరాన్ షాక్.. 24 గంటల్లో ఒప్పందం ప్రకటనపై ఖండన
-
Ragi Halwa: ముప్పై దాటిన మహిళల హెల్త్ కోసం బెస్ట్ స్వీట్.. రాగి పిండితో నోరూరించే హెల్దీ హల్వా!
-
IND vs AFG: ధర్మశాలలో గుర్బాజ్ సెంచరీతో విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్తో భారత్పై బద్దలైన రికార్డులు…
-
Jaishankar-Rubio: హార్ముజ్లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్కు రూబియో సూచన
-
Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!