US: టారిఫ్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం.. జైశంకర్-మార్కో రూబియో భేటీ
- టారిఫ్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం
- జైశంకర్-మార్కో రూబియో భేటీ
- ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టారిఫ్ ఉద్రిక్తతల వేళ భారత్-అమెరికా మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. సుంకాలు కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ సమావేశం శుభపరిణామంగా భావించొచ్చు.
ఇది కూడా చదవండి: Siddaramaiah: దసరా వేడుకల్లో సిద్ధరామయ్య రుసరుసలు.. ప్రేక్షకులపై ఆగ్రహం
Also Read
- Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్కు డ్రాగన్ కంట్రీ సాయం..
- Petrol-Diesel Price Hike: ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ. 434, డీజిల్ రూ. 407.
- Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
- Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) 80వ సెషన్ జరుగుతోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా వెళ్లారు. పర్యటనలో భాగంగా జైశంకర్ను మార్కో రూబియో కలిశారు. ఈ సందర్భంగా వాణిజ్యం, రక్షణ, ఇంధనం, ఔషధాలు, కీలకమైన ఖనిజాలు వంటి కీలక రంగాలు, ముఖ్యంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: ఈరోజు మళ్లీ జుబీన్ గార్గ్కు పోస్టుమార్టం.. అనంతరం అంత్యక్రియలు
ఇక జైశంకర్ను కలవడంపై మార్కో రూబియో ఎక్స్లో పోస్ట్ చేశారు. రెండు దేశాల మధ్య శ్రేయస్సును పెంపొందించే లక్ష్యంతో ద్వైపాక్షిక భాగస్వామ్యంతో పాటు వివిధ అంశాలపై చర్చలు జరిగాయని పేర్కొన్నారు. రెండు దేశాలు కలిసి పని చేయడానికి అంగీకరించినట్లు ప్రకటనలో తెలిపింది.
అలాగే జైశంకర్ కూడా ఎక్స్లో కీలక పోస్ట్ చేశారు. సోమవారం ఉదయం న్యూయార్క్లో విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను కలవడం ఆనందంగా ఉంది. మా సంభాషణలో ప్రస్తుత ఆందోళన కలిగించే అనేక ద్వైపాక్షిక, అంతర్జాతీయ సమస్యలు ఉన్నాయి.’’ అని జైశంకర్ పేర్కొన్నారు.
భారత్పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం మరో బాంబ్ పేల్చారు. రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు భారత్పై మరో 25 శాతం సుంకం విధించినట్లు ప్రకటించారు. దీంతో భారత్పై 50 శాతం సుంకం విధించినట్లైంది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే రైతుల కోసం ఎంత భారమైనా ప్రకటిస్తామని ప్రధాని మోడీ స్పష్టంచేశారు.
Met with Indian External Affairs Minister @DrSJaishankar at UNGA. We discussed key areas of our bilateral relationship, including trade, energy, pharmaceuticals, and critical minerals and more to generate prosperity for India and the United States. pic.twitter.com/5dZJAd85Za
— Secretary Marco Rubio (@SecRubio) September 22, 2025
తాజావార్తలు
-
RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్కు చేరిన ఓపెనర్స్..
-
LIC: ఎల్ఐసీ కొత్త వ్యూహం.. ఫిన్టెక్ రంగంలోకి ఎంట్రీ? ఫోన్పే, పేటీఎంకు పోటీగా సేవలు!
-
RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
-
Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!