Israel-Hamas: గాజాపై మరోసారి దాడి చేసిన ఇజ్రాయెల్.. 33 మంది మృతి
- మరోసారి గాజాపై వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్..
- ఈ దాడుల్లో 33 మంది పాలస్తీనా వాసులు మృతి చెందగా.. 85 మందికి గాయాలు..
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది: గాజా ఆరోగ్య శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఉత్తర గాజాలో జరిపిన వైమానిక దాడుల్లో సుమారు 33 మంది పాలస్తీనా ప్రజలు మృత్యి చెందారు. ఈ విషయాన్ని అక్కడి అధికారిక వార్తా సంస్థ తెలిపింది. ఉత్తర గాజాలోని జబాలియా శిబిరంపై శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఆ దాడుల్లో మరణించిన వారిలో 21 మంది మహిళలే ఉండటం గమనార్హం. ఈ దాడుల్లో మరో 85 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని సమాచారం.
Read Also: IND vs NZ: టీమిండియాకు శుభవార్త.. నేడు బ్యాటింగ్కు పంత్!
Also Read
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటి వరకు 42,500 మందికి పైగా మృతి చెందినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక, ఇజ్రాయెల్పై సిరియా వైమానిక దాడులు చేసేందుకు ప్రయత్నించింది. తమ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన వైమానిక దాడులను ఐడీఎఫ్ సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు తెలిపింది. అది తమ భూభాగంలోకి ప్రవేశించక ముందే ఆ రాకెట్లను కూల్చివేసినట్లు వెల్లడించింది. ఇరాన్ మద్దతుతోనే సిరియా ఈ డ్రోన్లతో దాడి చేసేందుకు యత్నించిందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం