Netanyahu: అమెరికా టూర్ తర్వాత నెతన్యాహు కొత్త ఎత్తుగడ! ఈ వారంలోనే ప్లాన్ అమలు
- అమెరికా టూర్ తర్వాత నెతన్యాహు కొత్త ఎత్తుగడ!
- ఈ వారంలోనే ప్లాన్ అమలు
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల అమెరికాలో పర్యటించారు. నాలుగు రోజుల పర్యటన ముగించుకుని విజయవంతంగా తిరిగి వచ్చారు. అయితే అమెరికా పర్యటనలో ఉన్న నెతన్యాహు రహస్య సమావేశాలు నిర్వహించారు. అధ్యక్షుడు ట్రంప్, అమెరికా అధికారులతో రహస్య చర్చలు చేశారు. అయితే అమెరికా టూర్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Perni Nani: “నేనెవరిని నరకమని చెప్పలేదు”.. పేర్నినాని సంచలన వ్యాఖ్యలు..
Also Read
- North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
- Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
- Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
- Donald Trump: ‘‘బిడ్డను కనడానికే వస్తారు’’.. భారతీయులపై ట్రంప్ అక్కసు..
నెతన్యాహు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సరికొత్త ఎత్తుగడ వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉండాలంటే గాజాలో మరిన్ని రోజులు యుద్ధం చేస్తేనే నిలదొక్కుకునే అవకాశాలు ఉంటాయి. సంకీర్ణ ప్రభుత్వంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే హమాస్పై యుద్ధం కొనసాగించడమే మార్గమని భావిస్తున్నారు. దీనిపై అమెరికా పెద్దలతో కీలక మంతనాలు జరిపినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Apollo : స్వస్థ్ మేళా 2025లో అపోలో డయాలసిస్ క్లినిక్స్ చొరవ
అమెరికా టూర్ తర్వాత నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల్లో హమాస్తో కాల్పుల విరమణ-బందీ ఒప్పందాన్ని పూర్తి చేయగలనని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక పర్యటనలో అమెరికా మీడియాకు మూడు ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ ఇజ్రాయెల్ మీడియాకు మాత్రం ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఇదిలా ఉంటే యుద్ధం ముగిస్తే సౌదీ అరేబియాతో చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ దిశగా వెళ్లే ఆలోచన లేనట్లు కనిపిస్తోంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యుద్ధాన్ని ముగించడం నెతన్యాహుకు వ్యక్తిగత ప్రమాదంతో కూడుకున్నదని సమాచారం. 75 ఏళ్ల నెతన్యాహు 2020 నుంచి అవినీతి కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఆ ఆరోపణలను ఆయన ఖండించారు. అయితే అధికారాన్ని కోల్పోతే నెతన్యాహు విచారణకు ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే నెతన్యాహు.. గాజాపై యుద్ధాన్ని చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. గాజాలో యూదు స్థావరాలను తిరిగి స్థాపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్.. ఇప్పటికే గాజాలోని పాలస్తీనా వాసులను ఖాళీ చేయాలని హెచ్చరించారు. అయితే నెతన్యాహు కొత్త ప్లాన్ ఈ వారంలో అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
-
Off The Record: టీడీపీలోని పరిణామాలపై కొందరు సీనియర్స్ అసహనం..
-
Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!