Netanyahu: అమెరికా టూర్ తర్వాత నెతన్యాహు కొత్త ఎత్తుగడ! ఈ వారంలోనే ప్లాన్ అమలు
- అమెరికా టూర్ తర్వాత నెతన్యాహు కొత్త ఎత్తుగడ!
- ఈ వారంలోనే ప్లాన్ అమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల అమెరికాలో పర్యటించారు. నాలుగు రోజుల పర్యటన ముగించుకుని విజయవంతంగా తిరిగి వచ్చారు. అయితే అమెరికా పర్యటనలో ఉన్న నెతన్యాహు రహస్య సమావేశాలు నిర్వహించారు. అధ్యక్షుడు ట్రంప్, అమెరికా అధికారులతో రహస్య చర్చలు చేశారు. అయితే అమెరికా టూర్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Perni Nani: “నేనెవరిని నరకమని చెప్పలేదు”.. పేర్నినాని సంచలన వ్యాఖ్యలు..
Also Read
- OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
- Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
నెతన్యాహు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సరికొత్త ఎత్తుగడ వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉండాలంటే గాజాలో మరిన్ని రోజులు యుద్ధం చేస్తేనే నిలదొక్కుకునే అవకాశాలు ఉంటాయి. సంకీర్ణ ప్రభుత్వంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే హమాస్పై యుద్ధం కొనసాగించడమే మార్గమని భావిస్తున్నారు. దీనిపై అమెరికా పెద్దలతో కీలక మంతనాలు జరిపినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Apollo : స్వస్థ్ మేళా 2025లో అపోలో డయాలసిస్ క్లినిక్స్ చొరవ
అమెరికా టూర్ తర్వాత నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల్లో హమాస్తో కాల్పుల విరమణ-బందీ ఒప్పందాన్ని పూర్తి చేయగలనని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక పర్యటనలో అమెరికా మీడియాకు మూడు ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ ఇజ్రాయెల్ మీడియాకు మాత్రం ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఇదిలా ఉంటే యుద్ధం ముగిస్తే సౌదీ అరేబియాతో చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ దిశగా వెళ్లే ఆలోచన లేనట్లు కనిపిస్తోంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యుద్ధాన్ని ముగించడం నెతన్యాహుకు వ్యక్తిగత ప్రమాదంతో కూడుకున్నదని సమాచారం. 75 ఏళ్ల నెతన్యాహు 2020 నుంచి అవినీతి కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఆ ఆరోపణలను ఆయన ఖండించారు. అయితే అధికారాన్ని కోల్పోతే నెతన్యాహు విచారణకు ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే నెతన్యాహు.. గాజాపై యుద్ధాన్ని చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. గాజాలో యూదు స్థావరాలను తిరిగి స్థాపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్.. ఇప్పటికే గాజాలోని పాలస్తీనా వాసులను ఖాళీ చేయాలని హెచ్చరించారు. అయితే నెతన్యాహు కొత్త ప్లాన్ ఈ వారంలో అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే… వైద్యుల హెచ్చరిక
-
Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
-
Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!