Gaza-Israel: గాజాలోకి ఆహారం తీసుకెళ్లేందుకు ఇజ్రాయెల్ అనుమతి
- గాజాలోకి ఆహారం తీసుకెళ్లేందుకు ఇజ్రాయెల్ అనుమతి
- కరవు తీవ్రత కారణంగా ప్రధాని నెతన్యాహు అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్-గాజా మధ్య కొన్ని నెలలుగా యుద్ధం సాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా ఐడీఎఫ్ యుద్ధం చేస్తోంది. ఇప్పటికే గాజాను ఇజ్రాయెల్ సర్వనాశనం చేసింది. అయితే మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల కారణంగా బందీలు-ఖైదీల మార్పిడి జరిగింది. అయితే తొలి విడత ఒప్పందం ముగియడంతో తిరిగి ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది.
ఇది కూడా చదవండి: Fire Accident: పాతబస్తీ ప్రమాద సమయంలోనే హైదరాబాద్లో మరో భారీ అగ్ని ప్రమాదం.. తేడా ఒక్కటే..!
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
అయితే గాజాలో పరిస్థితి దుర్భరంగా మారింది. పాలస్తీనియన్లు కరవు అంచుకు వెళ్లారు. దాదాపు మూడు నెలల నుంచి గాజాలోకి స్వచ్చంధ సంస్థలు తీసుకెళ్లే ఆహారాన్ని అనుమతించడం లేదు. దీంతో గాజాలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గాజాలో కరవు ఆసన్నమైందని ఆహార భద్రతా నిపుణులు హెచ్చరించడంతో ప్రధాని నెతన్యాహు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సిఫార్సుల మేరకు గాజాలోకి ఆహారాన్ని అనుమతించడానికి మంత్రివర్గం అంగీకరించిందని సోమవరం అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే గాజాలో కరవు తీవ్రత ఎక్కువ కావడంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే హమాస్కు ఆహారం అందకుండా చూడాలని నెతన్యాహు ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Cyclone: అరేబియా సముద్రంలో తుఫాన్.. దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ఇదిలా ఉంటే ఆదివారం ఒక్క రోజే వైమానిక దాడుల్లో 100 మందికి పైగా మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడుల కారణంగా ఉత్తర గాజాలోని కీలకమైన వైద్య సదుపాయమైన ఇండోనేషియా ఆస్పత్రి మూసివేసినట్లు పేర్కొన్నారు.
మార్చిలో హమాస్-ఇజ్రాయెల్ మధ్య తొలి విడత ఒప్పందం ముగిసిన తర్వాత ఈ మధ్య కాలంలో వరుసగా భీకరదాడులు జరుగుతున్నాయి. దీంతో గాజాలో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. 2023, అక్టోబర్7న హమాస్.. దక్షిణ ఇజ్రాయెల్పై ఆకస్మిక దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయారు. నాటి నుంచి ఇజ్రాయెల్ పగతో రగిలిపోతుంది. ఐడీఎఫ్ చేసిన దాడుల్లో గాజా నాశనమైంది.
తాజావార్తలు
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!