Hamas-Israel: బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ చివరి హెచ్చరిక.. నెక్ట్స్ ప్లాన్ వెల్లడి
- బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ చివరి హెచ్చరిక
- నెక్ట్స్ ప్లాన్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బందీలను వెంటనే విడుదల చేయాలని.. లేదంటే భారీ వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హమాస్కు ఇజ్రాయెల్ చివరి హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా అదే కోవలో ఇజ్రాయెల్ కూడా చివరి హెచ్చరిలు ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ రాకతో యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్లో గందరగోళం.. అభిమానుల ఆగ్రహం
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆదివారం హమాస్కు చివరి హెచ్చరిక జారీ చేశారు. బందీలను విడిచిపెట్టాలి.. అలాగే ఆయుధాలను విడిచిపెట్టాలని ఆదేశించారు. లేదంటే తీవ్ర వినాశనాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అత్యంత శక్తివంతమైన హరికేన్ గాజాను తాకుతుందని ఎక్స్లో పోస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Loan: రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించేందుకు ముందడుగేసిన ఆర్ బీఐ….
మరోసారి గాజా-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరగబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తోంది. గాజా లోపల.. విదేశాల్లో లగ్జరీ హోటళ్లలో ఉన్న హమాస్ హంతకులు.. రేపిస్టులకు ఇదే చివరి హెచ్చరిక అంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. బందీలను, ఆయుధాలను విడిచిపెడితే మంచిదని హమాస్కు సూచించింది.
ఉత్తర స్ట్రిప్లోని గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇజ్రాయెల్ పెద్ద దాడికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ 10 లక్షల మంది నివాసితులు ఉన్నారు. ఇప్పటికే చాలా మంది వెళ్లిపోయారు. మరికొంత మందిని ఖాళీ చేయిపిస్తోంది. భీకరదాడులకు ఇజ్రాయెల్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ హఠాత్తుగా దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయారు. అనంతరం ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. అప్పటినుంచి యుద్ధం చేస్తూనే ఉంది. ఇప్పటికే వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక మధ్యలో ఒప్పందం ప్రకారం కొంత మంది బందీలను హమాస్ విడుదల చేసింది. మిగతా బందీలను కూడా విడుదల చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. అయితే సైన్యం వెనక్కి వెళ్తేనే బందీలను విడుదల చేస్తామంటూ హమాస్ షరతులు పెడుతోంది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!