Israel-Hamas: హమాస్తో యుద్ధం వేళ ఇజ్రాయెల్ కీలక నిర్ణయం!
- హమాస్తో యుద్ధం వేళ ఇజ్రాయెల్ కీలక నిర్ణయం!
- ప్రతి పురుషుడు మిలటరీలో 3ఏళ్లు పని చేసేలా నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమాస్తో భీకరమైన యుద్ధం వేళ ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్లో ఇప్పటివరకు అమల్లో ఉన్న 34 నెలల నిర్బంధ సైనిక సేవ పరిమితిని మూడేళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Maharashtra: అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ కూటమికి భారీ విజయం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వీప్..
Also Read
- China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!
- Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..
- China: జిన్పింగ్ పీఠానికే ఎసరు? చైనా మాజీ రక్షణ మంత్రుల మరణశిక్ష వెనుక 'అసలు' మిస్టరీ ఇదేనా!
- Bangladesh: ‘‘మమతా బెనర్జీ వెంట 17 కోట్ల మంది ముస్లింలు’’.. బంగ్లాదేశ్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..
గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ అమాంతంగా దాడులకు తెగబడి ఇజ్రాయెల్ పౌరులను అపహరించుకునిపోయారు. దీంతో అప్పటి నుంచి పగతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ సైన్యం.. ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. హమాస్ లక్ష్యంగా గాజాపై భీకరమైన యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికే గాజా పట్టణం సర్వనాశం అయింది. ఇదిలా ఉంటే ఉగ్రవాదులతో యుద్ధం కొనసాగుతున్న వేళ ప్రతి పురుషుడు 34 నెలల పాటు తప్పనిసరిగా మిలటరీలో పని చేయాలన్న నిబంధన ఉండగా.. దీన్ని మూడేళ్ల పెంచుతూ ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు సెక్యూరిటీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయెల్కు చెందిన వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. తాజా నిబంధనలు మరో ఎనిమిదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉంది. సెక్యూరిటీ కేబినెట్ నిర్ణయాలను ఆదివారం నిర్వహించబోయే పూర్తిస్థాయి కేబినెట్ సమావేశంలో ఓటింగ్కు పెట్టనున్నారు.
ఇది కూడా చదవండి: Vijay Devarakond: గొప్ప మనుసు చాటుకున్న విజయ్ దేవరకొండ
ఓ వైపు హమాస్, ఇంకోవైపు హెబ్బొల్లాతో ఒకేసారి యుద్ధం చేయాల్సి వస్తున్నందునే ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ పూర్తి మద్దతు ఉంది. వారిని ఎదుర్కోవాలంటే సైనిక సంపత్తిని కచ్చితంగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఇజ్రాయెల్ మిలటరీ కమాండర్లు తెగేసి చెప్పడంతోనే అక్కడి ప్రభుత్వం ఈ దిశగా చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!