Gaza-Israel: 15 మంది వైద్యుల హత్య.. ఉద్దేశపూర్వకంగా జరగలేదన్న ఐడీఎఫ్
- గాజాలో 15 మంది వైద్యుల హత్య
- ఇజ్రాయెల్పై అంతర్జాతీయంగా విమర్శలు
- విచారకరమని.. ఉద్దేశపూర్వకంగా జరగలేదని ఐడీఎఫ్ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజా-ఇజ్రాయెల్ మధ్య తొలి విడత ఒప్పందం ముగిశాక పరిస్థితులు అదుపు తప్పాయి. హమాస్ అంతమే లక్ష్యంగా గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే సారి బందీలను విడుదల చేసేంత వరకు యుద్ధం కొనసాగుతుందని ఐడీఎఫ్ పేర్కొంది. ఇదిలా ఉంటే మార్చి 23న ఉగ్రవాదులు అంబులెన్స్లో వెళ్తున్నారన్న అనుమానంతో ఐడీఎఫ్ దళాలు దాడి చేయడంతో 15 మంది అత్యవసర వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ అంశంపై అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అత్యవసర వైద్య సిబ్బందిపై విచక్షణారహిత దాడులు ఏంటి? అని ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచ దేశాలు తప్పుపట్టాయి. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇజ్రాయెల్ దర్యాప్తు చేపట్టింది.
ఇది కూడా చదవండి: Suriya : సూర్య కోసం దుబాయ్ లో మకాం వేసిన వెంకీ అట్లూరి
Also Read
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
అయితే ఈ దాడి ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని.. విచక్షణారహితంగా దాడులు చేయలేదని ఇజ్రాయెల్ ఆర్మీ ఆదివారం పేర్కొంది. ఎమర్జెన్సీ సిగ్నల్స్ లేకపోవడంతో ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో దాడి చేసినట్లు తెలిపింది. అయినా వైద్యులు చనిపోవడం విచారకరమని.. దీనికి చింతిస్తు్న్నట్లు తెలిపింది. పొరపాటు జరిగిందంటూ ఐడీఎఫ్ అంగీకరించింది. దళాల వైఫల్యం కనిపించడంతో ఫీల్డ్ కమాండర్ను ఇజ్రాయెల్ తొలగించింది. అయితే అంబులెన్స్లో నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: JD Vance: నేటి నుంచి 4 రోజులు భారత్లో జేడీ వాన్స్ ఫ్యామిలీ పర్యటన
అంబులెన్స్ ఘటనలో 8 మంది రెడ్ క్రాస్ సిబ్బంది, గాజా సివిల్ డిఫెన్స్ రెస్క్యూ ఏజెన్సీకి చెందిన ఆరుగురు, ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉగ్రవాదులు అంబులెన్స్లను అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అంబులెన్స్లు వెళ్లేటప్పుడు సిగ్నల్స్ ఇవ్వకుండా వెళ్తున్నాయని ఐడీఎఫ్ పేర్కొంది. అయితే వీడియో ఫుటేజ్లో మాత్రం అంబులెన్స్ హెడ్లైట్లు వేసుకుని.. ఎమర్జెన్సీ లైట్లు వేసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దృశ్యాలు కనిపించడంతో ఇజ్రాయెల్ విచారం వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : హైదరాబాద్లో ఎకో టౌన్ ఏర్పాటు కోసం జపాన్ సంస్థలతో తెలంగాణ ఒప్పందం
తాజావార్తలు
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
-
Crude Oil Price Today: బ్యారెల్కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి