Site icon NTV Telugu

Iran War: ఇరాన్ యుద్ధంపై మొసాద్ సంచలన రిపోర్ట్..!

Israel Pm

Israel Pm

Iran War: మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. అయితే, ఇదే విషయాన్ని ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ ముందుగానే చెప్పనట్లు తెలుస్తోంది. మొసాద్ ముందుగానే ఇజ్రాయిల్ ప్రభుత్వానికి, ప్రధాని నెతన్యాహూకు చెప్పినట్లు సమాచారం. ఈ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు మొసాద్ అధిపతి డేవిడ్ బార్నియా.. ఇరాన్‌లో పాలనా మార్పు సాధ్యమేనని కానీ దానికి సమయం పడుతుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ మొత్తం ప్రక్రియ, యుద్ధం వారాలు నెలలు కాకుండా ఏడాది పాటు సాగొచ్చని ఆయన అంచనా వేశారు.

Read Also: Chicken Shops Closed: మాంస ప్రియులకు బిగ్ షాక్.. చికెన్ షాపులు బంద్‌.. ఎప్పటినంచంటే..

బార్నియా ఇజ్రాయిల్ క్యాబినెట్ ముందు యుద్ధానికి సంబంధించిన నివేదికను సమర్పించారు. దీంట్లోనే యుద్ధం ఒక ఏడాది పాటు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. యుద్ధానికి ముందు ఇరాన్‌లో కొన్ని రోజుల్లోనే ప్రజా తిరుగుబాటు జరిగి ఖమేనీ మత పాలన పడిపోతుందని అంతా భావించారు. కానీ ఇరాన్ తిరిగి దాడులు చేస్తుండటంతో ఇజ్రాయిల్, యూఎస్‌కు పాలుపోవడం లేదు. మూడు వారాల్లో ఇరాన్ బలహీనపడినప్పటికీ, ఇప్పటికీ గట్టి నియంత్రణలో దాడి చేసే స్థితిలో ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.

నిజానికి ఇరాన్‌లో పాలనా మార్పు అంత సులభం కాదని అగ్రరాజ్యానికి తెలిసొచ్చింది. అమెరికా గూఢచార అధిపతి తులసి గబ్బార్డ్ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రభుత్వం బలహీనపడింది కానీ ఇంకా ఉందని అన్నారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రభుత్వం కూలిపోతుందని ఖచ్చితంగా చెప్పలేమని, పరిస్థితిని మార్చడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. మొసాద్ చెప్పినట్లు యుద్ధం ఏడాది పాటు కొనసాగితే, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, చమురు సంక్షోభాలు తప్పవు.

Exit mobile version