Chicken Shops Closed: మాంస ప్రియులకు బిగ్ షాక్.. చికెన్ షాపులు బంద్.. ఎప్పటినంచంటే..
- ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్..
- పిలుపునిచ్చిన రాష్ట్ర చికెన్ షాపుల యజమానుల సంఘం..
- ధర్నాలు చేపడతామని హెచ్చరిక..
తెలంగాణలోని మాంసం ప్రియులకు షాక్ ఇచ్చేలా రాష్ట్ర చికెన్ షాపుల యజమానుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పౌల్ట్రీ కంపెనీల తీరుకు నిరసనగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ విక్రయాలను నిలిపివేస్తూ బంద్ పాటించాలని నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చికెన్ వ్యాపారులు పౌల్ట్రీ కంపెనీల విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమకు ఇచ్చే కమీషన్ (మార్జిన్) విషయంలో కంపెనీలు అనుసరిస్తున్న తీరు వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ‘తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్’ ఆరోపిస్తోంది. గతంలో ఇచ్చే కమీషన్ కంటే ప్రస్తుతం కిలోకు రూ. 20 వరకు తగ్గించడం తమకు పెను భారంగా మారిందని వారు పేర్కొంటున్నారు.
Also Read
- MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
- Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
- TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. భవానీపూర్లో ఘోర పరాజయం
ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ ధర రూ. 360 నుంచి రూ. 370 వరకు పలుకుతోంది. సాధారణంగా ధరలు పెరిగినప్పుడు వ్యాపారులకు వచ్చే లాభం కూడా పెరగాలి.. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. ఒకవైపు వినియోగదారులపై భారం పెరుగుతున్నా, మరోవైపు కంపెనీలు తమ మార్జిన్ను తగ్గించడంతో షాపుల నిర్వహణ కష్టతరమవుతోందని విక్రయదారులు వాపోతున్నారు. వేసవి కాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని, ఆ భారాన్ని అంతా తమపైనే వేస్తున్నారని వారు మండిపడుతున్నారు.
Also Read:Jr NTR : ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ.. డ్రాగన్కు స్పెషల్ ట్రీట్!
ఈ సమస్యపై ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఏప్రిల్ 1 నుంచి దుకాణాలు మూసివేయడమే కాకుండా, పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని అసోసియేషన్ హెచ్చరించింది. మార్జిన్ పెంచే వరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసింది. చికెన్ షాపులు నిరవధికంగా బంద్ అయితే సామాన్య ప్రజలకు మాంసం దొరకడం కష్టమవుతుంది. ఇది పరోక్షంగా ఇతర మాంసాహార ఉత్పత్తుల ధరలు పెరగడానికి దారితీయవచ్చు. ప్రభుత్వం , పౌల్ట్రీ కంపెనీలు వెంటనే స్పందించి ఈ గొడవను పరిష్కరించాలని సామాన్యులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
Indigo: టేకాఫ్ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
-
TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!