Iran: ఉద్రిక్తతల నడుమ.. కొత్త డ్రోన్లు, మిస్సైళ్లని ఆవిష్కరించిన ఇరాన్..
- మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తలు..
- ఉద్రిక్తతల నడుము మిస్సైళ్లు..డ్రోన్లని ఆవిష్కరించిన ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: మిడిల్ ఈస్ట్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలోనే ఇరాన్ శనివారం మిలిటరీ పెరేడ్లో తన కొత్త బాలిస్టిక్ మిసైల్స్, అప్ గ్రేడ్ చేసిన వన్-వే అటాక్ డ్రోన్లు ఆవిష్కరించింది. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు డ్రోన్లు, క్షిపణులను సరఫరా చేసినట్లు ఇరాన్ వెస్ట్రన్ దేశాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఘన-ఇంధన జిహాద్ క్షిపణిని ఇరాన్ యొక్క రివల్యూషనరీ గార్డ్స్ యొక్క ఏరోస్పేస్ విభాగం రూపొందించింది. ఇది 1000 కి.మీ దూరంలోని లక్ష్యాలను కూడా చేరుకోగలదని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. షాహెద్-136బి డ్రోన్ షాహెద్-136 యొక్క అప్గ్రేడ్ వెర్షన్, కొత్త ఫీచర్లు కలిగి ఉండటంతో పాటు 4000 కి.మీ పరిధిని కలిగి ఉంది. సద్దాం హుస్సేన్ సమయంలో ఇరాక్తో 1980-88 యుద్ధాన్ని స్మరించుకుంటూ టెహ్రాన్లో జరిగిన వార్షిక పెరేడ్కి కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ హాజరయ్యారు. ఇస్లామిక్ దేశాల మధ్య ఐక్యత, ఇజ్రాయిల్ని అడ్డుకోగలదని అన్నారు.
Read Also: Vizag: వివాహేతర సంబంధం.. ప్రియురాలిపై కత్తితో దాడి..
Also Read
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్లైన్స్పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
ఇజ్రాయిల్ ఇరాన్ మద్దతు కలిగిన హిజ్బుల్లా మిలిటెంట్లపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే లెబనాన్ వ్యాప్తంగా పేజర్లు, వాకీ-టాకీలు ఒక్కసారిగా పేలిపోవడం సంచలనంగా మారింది. ఈ పేలుళ్లలో 37 మంది మరణించారు. 3000 మందికి పైగా గాయపడ్డారు. అయితే, ఇది ఇజ్రాయిల్, దాని గూఢచార సంస్థ మొసాద్ పనే అని హిజ్బుల్లా ఆరోపిస్తోంది. ఈ దాడి తమకు పెద్ద దెబ్బగా అభివర్ణిసూ, ఇజ్రాయిల్పై తప్పకుండా ప్రతీకారం ఉంటుందని ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా హెచ్చరించాడు. ఇదిలా ఉంటే, ఈ ఘటన తర్వాత రోజే లెబనాన్ రాజధాని బీరూట్లో ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఈ దాడుల్లో 16 మంది హిజ్బుల్లా మిలిటెంట్లను హతమార్చింది. ఇందులో కీలక కమాండర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!