Iran: ఖమేనీ జాడ మిస్సింగ్.. ఎక్కడున్నట్టు? ఆ వార్తలు నిజమేనా?
- ఇరాన్లో తీవ్రరూపం దాల్చుతున్న నిరసనలు
- ప్రభుత్వ ఆదేశాలు ఖాతర్ చేయని సైన్యం
- పరారీలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్లో నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. గత రెండు వారాలుగా ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఆందోళనలను చక్కదిద్దడంలో భద్రతా దళాలు వైఫల్యం చెందినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ (86) 20 మంది సహాయకులు, కుటుంబ సభ్యులతో మాస్కోకు పారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు నిఘా వర్గాలు పేర్కొన్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Trump: వెనిజులా భవిష్యత్ ప్రణాళిక వెల్లడించిన ట్రంప్.. ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు
Also Read
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
- Trump: ట్రంప్తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- Jammu Kashmir: పాక్కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
అల్లర్లు తీవ్ర రూపం దాల్చడంతో మరింత హింసాత్మకంగా మారకుండా ఉండేందుకు అయతుల్లా ఖమేనీ టెహ్రాన్ నుంచి రష్యాకు పారిపోవడానికి అత్యవసర ప్రణాళిక రచించుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చినట్లు సమాచారం. ఇప్పటికే భద్రతా దళాల కాల్పుల్లో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలు పాలయ్యారు. పరిస్థితులు చేదాటిపోతున్నాయన్న భావనతో అయతుల్లా ఖమేనీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు‘ సెన్సార్ పూర్తి.. రన్టైమ్ ఎంతో తెలుసా?
ఇదిలా ఉంటే నిరసనకారులను అడ్డుకోవడంలో సైన్యం, భద్రతా దళాలు ప్రభుత్వ ఆదేశాలను తిరస్కరిస్తున్నట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగా ఖాతర్ చేయట్లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖమేనీ రష్యాకు వెళ్లిపోయాక ‘ప్లాన్ బీ’ ప్రకారం కుమారుడు మోజ్తాబాను వారసుడిగా రంగంలోకి దింపాలని ప్రణాళిక వేసినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు నిరసనకారులపై జులుం ప్రదర్శిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే ఇరాన్ను అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నిరసనకారులు చనిపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. హింసాత్మకంగా మారితే అమెరికా రంగంలోకి దిగాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.
ఇదిలా ఉంటే అయతుల్లా ఖమేనీ రష్యాకు పారిపోతున్నట్లు వస్తున్న వార్తలను భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఖండించింది. అది పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేసింది. శత్రు దేశాలు వ్యాప్తి చేస్తున్న అబద్ధ ప్రచారం అని తోసిపుచ్చారు. ఇజ్రాయెల్తో 12 రోజుల పాటు యుద్ధం జరిగినప్పుడు కూడా ఖమేనీ ఎక్కడికి పారిపోలేదని.. ఇప్పుడెందుకు పారిపోతారని చెప్పుకొచ్చారు. అదంతా అబద్ధం అని కొట్టేపారేశారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!