ఇరాన్లో మరో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ, కుమార్తె, అల్లుడు, మనవరాలు సహా పలువురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఇరాన్ మీడియా అధికారికంగా ధృవీకరించింది. ఇక రెండు రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమేనీ భార్య మన్సౌరే ఖోజాస్తే కూడా సోమవారం మరణించినట్లుగా ఇరాన్ వెల్లడించింది. దీంతో ఇరానీయులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
శనివారం ఉదయం హఠాత్తుగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ అధ్యక్ష కార్యాలయం దగ్గర ఎనిమిది క్షిపణులను ప్రయోగించింది. ఖమేనీ అత్యవసర సమావేశం జరిపిస్తుండగా పక్కా సమాచారం అందడంతో ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. దీంతో ఖమేనీ సహా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు.
అనంతరం ప్రతీకారంగా ఇరాన్ దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై కూడా దాడులు చేసింది. ప్రస్తుతం మధ్యప్రాచ్యం తీవ్ర ఉద్రిక్తతలతో గజగజలాడుతోంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏ బాంబ్ వచ్చి పడుతుందోనని భయంతో వణికిపోతున్నారు. ఇక పశ్చిమాసియాలో గగనతలం మూసేయడంతో గల్ఫ్ దేశాల్లో అనేక దేశాలకు చెందిన పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
