Iran: దేవుడిపై యుద్ధం.. మరో ముగ్గురికి మరణశిక్ష విధించిన ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran sentences three more protesters to death: ఇరాన్ ప్రభుత్వం వరసగా మరణశిక్షలు విధించుకుంటూ పోతోంది. గత కొన్ని నెలలుగా మహ్సాఅమిని మరణంపై ఇరాన్ అట్టుడుకుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. పలు ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు ఆందోళనకారులు. ఈ ఘర్షణల్లో ప్రజలతో పాటు భద్రతా సిబ్బంది కూడా మరణించారు. ఇదిలా ఉంటే నిరసనల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తులను దయలేకుండా పలు నేరాల్లో నిందితులుగా ఆరోపిస్తూ ఖమేనీ ప్రభుత్వం మరణశిక్షలు విధిస్తోంది. ఇప్పటికే పది మంది వరకు ఉరితీసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే తాజాగా మరో ముగ్గురు నిరసనకారులకు మరణశిక్ష విధించింది ఇరాన్ ప్రభుత్వం. ‘దేవుడిపై యుద్ధం’ చేసిన ఆరోపణలపై ఈ ముగ్గురిపై నేరం మోపింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ టెహ్రాన్ లో మతాధికారులు, ప్రజల బృందంతో ఇటీవల మాట్లాడారు. దీని తర్వాత ఈ మరణశిక్ష తీర్పులు నమోదు అయ్యాయి. దీనిపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రవ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సెప్టెంబర్ 16న 22 ఏళ్ల కుర్దిష్ ఇరాన్ యువతి అయిన మహ్సఅమిని హిజాబ్ ధరించలేదని చెబుతూ అక్కడి మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉండగానే ఆమె మరణించడంతో ఇరాన్ లో ఆందోళనలు మిన్నంటాయి. ఆందోళన నిర్వహించిన వారికి ప్రభుత్వం మరణశిక్షలు విధిస్తోంది.
Also Read
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా 'రెంట్ ఫ్రీ' సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
- DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్ను నిండా ముంచేసిన ఇరాన్!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
Read Also: Ukarine War: ఉక్రెయిన్కు పాకిస్తాన్ సాయం.. భారీగా మందుగుండు సామాగ్రి సరఫరా..
శనివారం మరో ఇద్దరిని ఉరితీసింది. వీరిలో దేశవ్యాప్తంగా అనేక టైటిల్స్ సాధించిన కరాటే ఛాంపియన్ ఉండటం విషాదం. ఈ ఘటనలను ఈయూ, అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లలో బసిజ్ మిలీషియా సభ్యులను చంపిన ఆరోపణలుపై ప్రస్తుతం సలేహ్ మిర్హాషెమి, మాజిద్ కజెమీ, సయీద్ యాగౌబిలకు మరణశిక్ష విధించింది. వీరు తీర్పుకు వ్యతిరేకంగా అప్పీల్ చేసుకోవచ్చు.
1979 విప్లవం తరువాత మతాధికారులు ప్రాబల్యం ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడే సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సోమవారం తన వైఖరిని స్పష్టం చేశారు. బహిరంగ స్థలాలకు నిప్పు పెట్టిన వారు ఎటువంటి సందేహం లేకుండా దేశద్రోహానికి పాల్పడినట్లే అని హెచ్చరించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గత నెలలో ఇరాన్ అధికారులు కనీసం 26 మందికి మరణశిక్ష విధించాలని కోరింది.
తాజావార్తలు
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!