Iran: దేవుడిపై యుద్ధం.. మరో ముగ్గురికి మరణశిక్ష విధించిన ఇరాన్..
Iran sentences three more protesters to death: ఇరాన్ ప్రభుత్వం వరసగా మరణశిక్షలు విధించుకుంటూ పోతోంది. గత కొన్ని నెలలుగా మహ్సాఅమిని మరణంపై ఇరాన్ అట్టుడుకుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. పలు ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు ఆందోళనకారులు. ఈ ఘర్షణల్లో ప్రజలతో పాటు భద్రతా సిబ్బంది కూడా మరణించారు. ఇదిలా ఉంటే నిరసనల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తులను దయలేకుండా పలు నేరాల్లో నిందితులుగా ఆరోపిస్తూ ఖమేనీ ప్రభుత్వం మరణశిక్షలు విధిస్తోంది. ఇప్పటికే పది మంది వరకు ఉరితీసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే తాజాగా మరో ముగ్గురు నిరసనకారులకు మరణశిక్ష విధించింది ఇరాన్ ప్రభుత్వం. ‘దేవుడిపై యుద్ధం’ చేసిన ఆరోపణలపై ఈ ముగ్గురిపై నేరం మోపింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ టెహ్రాన్ లో మతాధికారులు, ప్రజల బృందంతో ఇటీవల మాట్లాడారు. దీని తర్వాత ఈ మరణశిక్ష తీర్పులు నమోదు అయ్యాయి. దీనిపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రవ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సెప్టెంబర్ 16న 22 ఏళ్ల కుర్దిష్ ఇరాన్ యువతి అయిన మహ్సఅమిని హిజాబ్ ధరించలేదని చెబుతూ అక్కడి మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉండగానే ఆమె మరణించడంతో ఇరాన్ లో ఆందోళనలు మిన్నంటాయి. ఆందోళన నిర్వహించిన వారికి ప్రభుత్వం మరణశిక్షలు విధిస్తోంది.
Also Read
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
Read Also: Ukarine War: ఉక్రెయిన్కు పాకిస్తాన్ సాయం.. భారీగా మందుగుండు సామాగ్రి సరఫరా..
శనివారం మరో ఇద్దరిని ఉరితీసింది. వీరిలో దేశవ్యాప్తంగా అనేక టైటిల్స్ సాధించిన కరాటే ఛాంపియన్ ఉండటం విషాదం. ఈ ఘటనలను ఈయూ, అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లలో బసిజ్ మిలీషియా సభ్యులను చంపిన ఆరోపణలుపై ప్రస్తుతం సలేహ్ మిర్హాషెమి, మాజిద్ కజెమీ, సయీద్ యాగౌబిలకు మరణశిక్ష విధించింది. వీరు తీర్పుకు వ్యతిరేకంగా అప్పీల్ చేసుకోవచ్చు.
1979 విప్లవం తరువాత మతాధికారులు ప్రాబల్యం ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడే సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సోమవారం తన వైఖరిని స్పష్టం చేశారు. బహిరంగ స్థలాలకు నిప్పు పెట్టిన వారు ఎటువంటి సందేహం లేకుండా దేశద్రోహానికి పాల్పడినట్లే అని హెచ్చరించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గత నెలలో ఇరాన్ అధికారులు కనీసం 26 మందికి మరణశిక్ష విధించాలని కోరింది.
తాజావార్తలు
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!