Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
- సింధు జలాల ఒప్పందంపై పాక్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ఆందోళన
- భారత్ నీటిని ‘ఆయుధంగా’ ఉపయోగించే అవకాశం ఉందని వ్యాఖ్య
- 2025 పహల్గామ్ దాడి తర్వాత ఒప్పందాన్ని నిలిపేసిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indus Waters Treaty: పాకిస్తాన్ మరోసారి ‘‘సింధు జలాల ఒప్పందం’’పై స్పందించింది. ఆ దేశ ప్రణాళికా మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ఇటీవల ఇండస్ వాటర్ ట్రీటీ, దక్షిణాసియాలో భారత్ వ్యూహాత్మక ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. సింధు నది నీటిని ఆపేయడం ద్వారా భారత్ తమ దేశానికి వ్యతిరేకంగా నీటిని ఆయుధంగా ఉపయోగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఒక నదీతీర దేశమని, అక్కడి నుంచి ప్రవహించే నదులు పాకిస్తాన్లోకి ప్రవేశిస్తాయని ఇక్బాల్ పేర్కొన్నారు. ఈ భౌగోళిక పరిస్థితిని భారత్ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటోందని, పాకిస్తాన్ నీటి సరఫరాను నియంత్రించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడులు నిర్వహించడానికి ముందు ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు తెలిపినంత కాలం ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించేది లేదని భారత్ స్పష్టం చేసింది. అయితే, ఇది ఏకపక్ష నిర్ణయమని పాక్ ఆరోపిస్తోంది. పాకిస్తాన్ వ్యవసాయం, తాగునీటికి సింధు, దాని ఉపనదులు జీవనాడిగా ఉన్నాయి. ఈ నీటిని నియంత్రిస్తే పాకిస్తాన్ కరువుతో అలమటించడం ఖామని ఆ దేశంలో ఆందోళన నెలకొంది.
Also Read
- Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
- France: ఫ్రాన్స్లో కండోమ్ల కలకలం.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని సలహా..
- Giorgia Meloni: 3% ఓట్ల పార్టీ నుంచి ప్రధాని వరకు.. జార్జియా మెలోని సరికొత్త రికార్డుకు చేరువ
- Canada-US Trade Talks Collapse: కెనడా-అమెరికా మధ్య మళ్లీ ట్రేడ్ వార్?.. కెనడాపై 50% టారిఫ్ల ముప్పు
ఇదే సమయంలో అహ్సాన్ ఇక్బార్ మరో కీలక వ్యాఖ్య చేశారు. దక్షిణాసియాలో భారత్ భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉందని, ఈ ప్రాంతం సక్రమంగా ఉండాలంటే భారత్ పాత్ర చాలా ముఖ్యమని పేర్కొన్నారు. దక్షిణాసియాలోని ఇతర దేశాలకు వివిధ మార్గాల్లో భారత్ కనెక్ట్ అయి ఉందని అన్నారు. భారతదేశ పరిమాణం, ఆర్థిక శక్తి, భౌగోళిక స్థానం కారణంగా ఈ ప్రాంత వ్యవహారాల్లో దాని ప్రాధాన్యతను విస్మరించలేమని అన్నారు. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ మధ్య ‘‘సింధు జలాల ఒప్పందం’’ కుదిరింది. రెండు దేశాల ఉద్రిక్తతల కారణంగా మరోసారి ఈ ఒప్పందం వార్తల్లో నిలిచింది.
తాజావార్తలు
-
Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
-
Manchu Lakshmi: ‘రాకా’ విజువల్స్కు ఫిదా అయిన మంచు లక్ష్మి.. అంచనాలు పెంచేసిన కామెంట్స్! వీడియో వైరల్..
-
Ranganath: ఇక చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం.. హైడ్రా కమిషనర్ బిగ్ వార్నింగ్
-
1984 Anti-Sikh Riots: “సజ్జన్ కుమార్ హీరోనా.?” రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని సిక్కుల ఆందోళన..
-
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా?.. షమీ, పృథ్వీ, సర్ఫరాజ్లకు కీలక పరీక్ష..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!