Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
- సింధు జలాల ఒప్పందంపై పాక్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ఆందోళన
- భారత్ నీటిని ‘ఆయుధంగా’ ఉపయోగించే అవకాశం ఉందని వ్యాఖ్య
- 2025 పహల్గామ్ దాడి తర్వాత ఒప్పందాన్ని నిలిపేసిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indus Waters Treaty: పాకిస్తాన్ మరోసారి ‘‘సింధు జలాల ఒప్పందం’’పై స్పందించింది. ఆ దేశ ప్రణాళికా మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ఇటీవల ఇండస్ వాటర్ ట్రీటీ, దక్షిణాసియాలో భారత్ వ్యూహాత్మక ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. సింధు నది నీటిని ఆపేయడం ద్వారా భారత్ తమ దేశానికి వ్యతిరేకంగా నీటిని ఆయుధంగా ఉపయోగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఒక నదీతీర దేశమని, అక్కడి నుంచి ప్రవహించే నదులు పాకిస్తాన్లోకి ప్రవేశిస్తాయని ఇక్బాల్ పేర్కొన్నారు. ఈ భౌగోళిక పరిస్థితిని భారత్ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటోందని, పాకిస్తాన్ నీటి సరఫరాను నియంత్రించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడులు నిర్వహించడానికి ముందు ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు తెలిపినంత కాలం ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించేది లేదని భారత్ స్పష్టం చేసింది. అయితే, ఇది ఏకపక్ష నిర్ణయమని పాక్ ఆరోపిస్తోంది. పాకిస్తాన్ వ్యవసాయం, తాగునీటికి సింధు, దాని ఉపనదులు జీవనాడిగా ఉన్నాయి. ఈ నీటిని నియంత్రిస్తే పాకిస్తాన్ కరువుతో అలమటించడం ఖామని ఆ దేశంలో ఆందోళన నెలకొంది.
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
ఇదే సమయంలో అహ్సాన్ ఇక్బార్ మరో కీలక వ్యాఖ్య చేశారు. దక్షిణాసియాలో భారత్ భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉందని, ఈ ప్రాంతం సక్రమంగా ఉండాలంటే భారత్ పాత్ర చాలా ముఖ్యమని పేర్కొన్నారు. దక్షిణాసియాలోని ఇతర దేశాలకు వివిధ మార్గాల్లో భారత్ కనెక్ట్ అయి ఉందని అన్నారు. భారతదేశ పరిమాణం, ఆర్థిక శక్తి, భౌగోళిక స్థానం కారణంగా ఈ ప్రాంత వ్యవహారాల్లో దాని ప్రాధాన్యతను విస్మరించలేమని అన్నారు. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ మధ్య ‘‘సింధు జలాల ఒప్పందం’’ కుదిరింది. రెండు దేశాల ఉద్రిక్తతల కారణంగా మరోసారి ఈ ఒప్పందం వార్తల్లో నిలిచింది.
తాజావార్తలు
-
Army Camp Arms Theft: బొల్లారం ఆర్మీ క్యాంప్లో ఆయుధాల చోరీ.. మాజీ సైనికుడి అరెస్ట్
-
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Modi-Putin: పుతిన్కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
-
Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
-
Bhatti Vikramarka : దేశానికే ఆదర్శం తెలంగాణ కులగణన మోడల్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?