ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. క్షిపణులు, రాకెట్లు, డ్రోన్ దాడులతో దద్దరిల్లుతోంది. అయితే ఇరాన్ ప్రతీకార దాడులు అల్లకల్లోలం చేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ మిత్ర దేశాలపై గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఎక్కుపెట్టింది. పెద్ద ఎత్తున క్షిపణులతో విరుచుకుపడుతోంది. దీంతో సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్ అలాంటి దేశాలు బాంబ్లతో హడలెత్తిపోతుంది.

ఇదిలా ఉంటే ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియాలో గగనతలం మూసుకుపోయాయి. దీంతో అన్ని ఎయిర్పోర్టులు బంద్ అయ్యాయి. అయితే అకస్మాత్తు దాడులతో విమానాశ్రయాల్లోనే ప్రయాణికులు చిక్కుపోయారు. దీంతో గత మూడు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆయా పనుల నిమిత్తం దుబాయ్ వెళ్లిన భారతీయులంతా అల్లాడిపోతున్నారు. ఏం జరుగుతుందో తెలియక గందరగోళానికి గురవుతున్నారు.
ప్రీ-వెడ్డింగ్ కోసం ఉత్తరప్రదేశ్ నుంచి దుబాయ్ వెళ్లిన జంట అర్ధాంతరంగా చిక్కుకున్నారు. దీంతో తమను రక్షించాలంటూ వీడియో కాల్లో అధికారులను వేడుకుంటున్నారు. పూర్తిగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రస్తుతం బుర్జ్ ఖలీఫా సమీపంలోని ఒక హోటల్కు పరిమితం అయ్యారు. వాస్తవంగా మార్చి 2న భారత్కు రావాల్సి ఉండగా విమానాల రద్దుతో ఆగిపోయారు. ఇలా అనేక మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను రక్షించాలంటూ భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దీంతో ఢిల్లీ కేంద్రంగా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.