American Airlines: తోటి ప్రయాణికుడిపై మూత్రం పోసిన భారతీయుడు.. కానీ ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Man On Board New York-Delhi Flight Pees On Co-Flyer: ఈమధ్య గాల్లో ఎగురుతున్న విమానాల్లో తరచూ విచిత్ర సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేస్తున్న సందర్భాలే ఎక్కువగా తెరమీదకొస్తున్నాయి. తాజాగా అలాంటి జుగుస్పాకరమైన ఘటనే ఒకటి వెలుగు చూసింది. అమెరికన్ ఎయిర్లైన్స్లో న్యూయార్క్ నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఓ భారతీయుడు.. తోటి ప్రయాణికుడపై మూత్రం పోశాడని సమాచారం. అతడు తాగిన మత్తులో తోటి ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగాడని, ఈ క్రమంలోనే కోపంలో మూత్రం పోసినట్లు తెలిసింది. ఢిల్లీ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే అతడ్ని అరెస్ట్ చేశారు. విమానయాన సంస్థ నుంచి నివేదిక అందిన తర్వాత ఏవియేషన్ వాచ్డాగ్ తగిన చర్యలు తీసుకుందని, ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేపడుతోందని తెలిసింది.
Best Airlines: ప్రపంచంలోని టాప్-10 బెస్ట్ ఎయిర్లైన్స్
Also Read
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
ఈ ఘటనపై అమెరికన్ ఎయిర్లైన్స్ ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేసింది. ‘‘జాన్ ఎఫ్. కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కి వెళ్లిన అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 292 విమానంలో అంతరాయం చోటు చేసుకుంది’’ అని పేర్కొంది. రాత్రి 9 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి విమానం చేరుకోగా.. అంతకుముందే ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందించడం జరిగింది. బాధిత ప్రయాణికుడు విమానయాన సంస్థకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడైంది. అయితే.. నిందితుడి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. మరోవైపు.. తోటి ప్రయాణికుడిపై ఓ భారతీయుడు మూత్రం పోసినట్లు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని డిప్యూటీ కమిషనర్ దేవేశ్ కుమార్ వెల్లడించారు. ‘‘తమపై తోటి ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడని తమకు ఫిర్యాదులు కానీ, ఆధారాలు కానీ అందలేదు’’ అని ఒక స్టేట్మెంట్లో చెప్పుకొచ్చారు.
Kenya Cult Deaths: జీసస్ని కలిసేందుకు.. ఆకలితో 47 మంది మృతి
కాగా.. గత కొన్ని నెలల్లో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. నవంబర్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో ఒక వృద్ధురాలిపై మూత్రం పోసిన ఘటన.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నాటకీయ పరిణామాల నేపథ్యంలో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ 30 రోజుల పాటు నిషేధం కూడా విధించింది. గతేడాది డిసెంబర్లోనూ.. ఢిల్లీ నుంచి పారిస్కు బయలుదేరిన ఫ్లైట్లో తన పక్కనున్న ఖాళీ సీటుపై మూత్ర విసర్జన చేశాడు.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?