American Airlines: తోటి ప్రయాణికుడిపై మూత్రం పోసిన భారతీయుడు.. కానీ ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Man On Board New York-Delhi Flight Pees On Co-Flyer: ఈమధ్య గాల్లో ఎగురుతున్న విమానాల్లో తరచూ విచిత్ర సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేస్తున్న సందర్భాలే ఎక్కువగా తెరమీదకొస్తున్నాయి. తాజాగా అలాంటి జుగుస్పాకరమైన ఘటనే ఒకటి వెలుగు చూసింది. అమెరికన్ ఎయిర్లైన్స్లో న్యూయార్క్ నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఓ భారతీయుడు.. తోటి ప్రయాణికుడపై మూత్రం పోశాడని సమాచారం. అతడు తాగిన మత్తులో తోటి ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగాడని, ఈ క్రమంలోనే కోపంలో మూత్రం పోసినట్లు తెలిసింది. ఢిల్లీ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే అతడ్ని అరెస్ట్ చేశారు. విమానయాన సంస్థ నుంచి నివేదిక అందిన తర్వాత ఏవియేషన్ వాచ్డాగ్ తగిన చర్యలు తీసుకుందని, ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేపడుతోందని తెలిసింది.
Best Airlines: ప్రపంచంలోని టాప్-10 బెస్ట్ ఎయిర్లైన్స్
Also Read
- Putin: పుతిన్ సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటన
- Israel: అమెరికాపై ఆధారపడొద్దు.. ఇజ్రాయిల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Pakistan: ఇస్లామిక్ ఐడెంటిటీ పక్కన పెట్టి.. భారత సంస్కృతి జపం చేస్తున్న పాక్.. ఎందుకో తెలుసా?
- Trump: అణు తనిఖీలు, హార్ముజ్పై ట్రంప్ కీలక ప్రకటన.. వెంటనే ఖండించిన ఇరాన్
ఈ ఘటనపై అమెరికన్ ఎయిర్లైన్స్ ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేసింది. ‘‘జాన్ ఎఫ్. కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కి వెళ్లిన అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 292 విమానంలో అంతరాయం చోటు చేసుకుంది’’ అని పేర్కొంది. రాత్రి 9 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి విమానం చేరుకోగా.. అంతకుముందే ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందించడం జరిగింది. బాధిత ప్రయాణికుడు విమానయాన సంస్థకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడైంది. అయితే.. నిందితుడి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. మరోవైపు.. తోటి ప్రయాణికుడిపై ఓ భారతీయుడు మూత్రం పోసినట్లు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని డిప్యూటీ కమిషనర్ దేవేశ్ కుమార్ వెల్లడించారు. ‘‘తమపై తోటి ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడని తమకు ఫిర్యాదులు కానీ, ఆధారాలు కానీ అందలేదు’’ అని ఒక స్టేట్మెంట్లో చెప్పుకొచ్చారు.
Kenya Cult Deaths: జీసస్ని కలిసేందుకు.. ఆకలితో 47 మంది మృతి
కాగా.. గత కొన్ని నెలల్లో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. నవంబర్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో ఒక వృద్ధురాలిపై మూత్రం పోసిన ఘటన.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నాటకీయ పరిణామాల నేపథ్యంలో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ 30 రోజుల పాటు నిషేధం కూడా విధించింది. గతేడాది డిసెంబర్లోనూ.. ఢిల్లీ నుంచి పారిస్కు బయలుదేరిన ఫ్లైట్లో తన పక్కనున్న ఖాళీ సీటుపై మూత్ర విసర్జన చేశాడు.
తాజావార్తలు
-
IPL Player: బిగ్షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్పై పోలీస్ కేసు..
-
Vasudeva Sutham: దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తే భూమ్మీద బతికే హక్కు లేదు!
-
Ram Charan: ‘నా కూతురు క్లిం కారా నన్ను పెద్ది అంటోంది’.. ‘పెద్ది’ సక్సెస్ మీట్లో రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్!
-
Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
-
Hardik And Yashasvi: KKR కెప్టెన్గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్లోకి యశస్వి జైస్వాల్..?
ట్రెండింగ్
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!