American Airlines: తోటి ప్రయాణికుడిపై మూత్రం పోసిన భారతీయుడు.. కానీ ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Man On Board New York-Delhi Flight Pees On Co-Flyer: ఈమధ్య గాల్లో ఎగురుతున్న విమానాల్లో తరచూ విచిత్ర సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేస్తున్న సందర్భాలే ఎక్కువగా తెరమీదకొస్తున్నాయి. తాజాగా అలాంటి జుగుస్పాకరమైన ఘటనే ఒకటి వెలుగు చూసింది. అమెరికన్ ఎయిర్లైన్స్లో న్యూయార్క్ నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఓ భారతీయుడు.. తోటి ప్రయాణికుడపై మూత్రం పోశాడని సమాచారం. అతడు తాగిన మత్తులో తోటి ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగాడని, ఈ క్రమంలోనే కోపంలో మూత్రం పోసినట్లు తెలిసింది. ఢిల్లీ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే అతడ్ని అరెస్ట్ చేశారు. విమానయాన సంస్థ నుంచి నివేదిక అందిన తర్వాత ఏవియేషన్ వాచ్డాగ్ తగిన చర్యలు తీసుకుందని, ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేపడుతోందని తెలిసింది.
Best Airlines: ప్రపంచంలోని టాప్-10 బెస్ట్ ఎయిర్లైన్స్
Also Read
- Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
- China: స్పేస్ వార్కు చైనా సై.. ఉపగ్రహాలను సైతం బూడిద చేసే ‘సరికొత్త ఆయుధం’ సిద్ధం! ఎలా పని చేస్తుందంటే..
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
- Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
ఈ ఘటనపై అమెరికన్ ఎయిర్లైన్స్ ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేసింది. ‘‘జాన్ ఎఫ్. కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కి వెళ్లిన అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 292 విమానంలో అంతరాయం చోటు చేసుకుంది’’ అని పేర్కొంది. రాత్రి 9 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి విమానం చేరుకోగా.. అంతకుముందే ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందించడం జరిగింది. బాధిత ప్రయాణికుడు విమానయాన సంస్థకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడైంది. అయితే.. నిందితుడి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. మరోవైపు.. తోటి ప్రయాణికుడిపై ఓ భారతీయుడు మూత్రం పోసినట్లు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని డిప్యూటీ కమిషనర్ దేవేశ్ కుమార్ వెల్లడించారు. ‘‘తమపై తోటి ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడని తమకు ఫిర్యాదులు కానీ, ఆధారాలు కానీ అందలేదు’’ అని ఒక స్టేట్మెంట్లో చెప్పుకొచ్చారు.
Kenya Cult Deaths: జీసస్ని కలిసేందుకు.. ఆకలితో 47 మంది మృతి
కాగా.. గత కొన్ని నెలల్లో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. నవంబర్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో ఒక వృద్ధురాలిపై మూత్రం పోసిన ఘటన.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నాటకీయ పరిణామాల నేపథ్యంలో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ 30 రోజుల పాటు నిషేధం కూడా విధించింది. గతేడాది డిసెంబర్లోనూ.. ఢిల్లీ నుంచి పారిస్కు బయలుదేరిన ఫ్లైట్లో తన పక్కనున్న ఖాళీ సీటుపై మూత్ర విసర్జన చేశాడు.
తాజావార్తలు
-
Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
-
Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
-
Omar Abdullah: రూ.30 కోట్లతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు.. బీజేపీపై జమ్మూకాశ్మీర్ సీఎం ఆరోపణలు
-
Monsoon 2026: దేశంలోని మాయమైన వర్ష మేఘాలు..రుతుపవనాలకు ఏమైంది?..
-
BCCI: టీమిండియాలో బిగ్ ట్విస్ట్.. ఐదుగురు కోచ్లలో ఒకరిపై వేటు.. ఇంతకీ ఎవరా ఒక్కరు?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!