China Spy Ship: భారత్పై నిఘా కోసం చైనా గూఢచారి నౌక .. క్షిపణి ప్రయోగానికి ముందు ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India “Tracking” China Spy Ship Ahead Of Missile Launch: భారతదేశంపై చైనా తీరు మార్చుకోవడం లేదు. భారత్ పై నిఘాను పెంచేందుకు చైనా గూఢాచర నౌకలు తరుచుగా హిందూ మహాసముద్రానికి వస్తున్నాయి. మూడు నెలల క్రితం ఇలాగే చైనాకు చెందిన గూఢాచారి నౌక యువాన్ వాంగ్ 5ని శ్రీలంకకు పంపింది చైనా. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం చెప్పినా.. శ్రీలంక పట్టించుకోలేదు. హంబన్ టోటా ఓడరేవులో ఈ నౌకకు డాకింగ్ సదుపాయాన్ని కల్పించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మరో గూఢాచారి నౌక యవాన్ వాంగ్ 6ను గుర్తించింది భారత్. భారత నౌకాదళం గత కొన్ని రోజులుగా ఈ నౌక గమనాన్ని ట్రాక్ చేస్తోంది. యువాన్ వాంగ్ 6 ఇప్పటికే హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించినట్లు భారత్ తెలిపింది. మెరైన్ ట్రాఫిక్ ప్రకారం ప్రస్తుతం ఈ నౌక ఇండోనేషియా బాలి సమీపంలో ఉంది.
Read Also: K P Sharma Oli: తీరు మార్చుకోని నేపాల్.. భారత భూభాగాలు స్వాధీనం చేసుకుంటారంటా…
Also Read
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
భారతదేశంలో కీలకమైన క్షిపణి ప్రయోగానికి సన్నద్ధం అవుతున్న వేళ ఈ నౌక వస్తోంది. నవంబర్ 10-11 మధ్య ఓడిశాలోని అబ్దుల్ కలాం దీవి నుంచి క్షిపణి ప్రయోగం జరగనుంది. 2,200 రేంజ్ కలిగిన ఈ క్షిపణిని పరీక్షించనుంది భారత్. ఈ సమయంలోనే చైనా గూఢాచారి నౌక భారత్ కు సమీపంగా వస్తోంది. యువాన్ వాంగ్ 6 క్షిపణులు, శాటిలైట్లపై నిఘా పెట్టే అవకాశం ఉంది. క్షిపణికి సంబంధించిన మార్గాన్ని, వేగం, పరిధి, కచ్చితత్వ వంటి సామర్థ్యాలను ఈ నౌక ట్రాక్ చేసే అవకాశం ఉందని భారత్ ఆందోళన చెందుతోంది.
శ్రీలంకలో హంబన్ టోటా పోర్టును 99 ఏళ్ల లీజుకు తీసుకుంది చైనా. అక్కడి నుంచి భారత్ పై నిఘా పెట్టే అవకాశం ఏర్పడింది. దీంతోనే భారత్ పదేపదే శ్రీలంకకు తమ అభ్యంతరాన్ని తెలియజేస్తోంది. శ్రీలంక అప్పుల్లో కూరుకుపోవడానికి పరోక్షంగా కారణం అయిన చైనాకు ఇంకా మద్దతు ఇస్తూనే ఉంది శ్రీలంక. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను అన్ని రకాలుగా ఆదుకున్న భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. అక్కడి ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో మనదేశం పెట్రోల్, మెడిసిన్, ఆహారాన్ని అందించింది.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
-
IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!