K P Sharma Oli: తీరు మార్చుకోని నేపాల్.. భారత భూభాగాలు స్వాధీనం చేసుకుంటారంటా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ex-Prime Minister of Nepal’s Controversial Comments on India: భారత్ సన్నిహిత దేశం నేపాల్. ఇరు దేశాల మధ్య శతాబ్ధాల సంబంధాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో నేపాల్ కు అండగా నిలుస్తోంది భారత్. అయితే నేపాల్ మాజీ ప్రధాని మాత్రం భారతదేశంపై ఎప్పుడూ తన అక్కసు వెళ్లగక్కతుంటాడు. నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ మరోసారి భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. నేపాల్ తమవిగా చెబుతున్న భారత భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని శుక్రవారం అన్నారు. నేపాల్-భారత సరిహద్దుల్లోని పశ్చిమ నేపాల్ దర్చులా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీ అధికారంలో వస్తే భారత్ లోని కాలాపానీ, లిపియాధురా, లిపులేక్ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటామని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అధ్యక్షుడు కేపీ శర్మ ఓలీ అన్నారు.
Read Also: Police Statement: పవన్ కళ్యాణ్పై ఎలాంటి రెక్కీ చేయలేదు… కుట్ర జరగలేదు..!!
Also Read
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
- Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
నేపాల్ భూభాగాన్ని అంగుళం కూడా వదలబోమని..దౌత్యం కార్యక్రమాల ద్వారా, పరస్పర సంబంధాల ద్వారా నేపాల్ ఆక్రమిత భూభాగాలను స్వాధీనం చేసుకుంటామని నేపాల్ ప్రధాని, నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా అన్నారు. పశ్చిమ నేపాల్ లోని దదేల్ ధురా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో నేపాల్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. కేపీ శర్మ ఓలీ వ్యాఖ్యలు చేసిన తర్వాత ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ సమగ్రతను ఎన్నికల ఎజెండాగా చేసుకోవద్దని మాజీ ప్రధాని బాబూరామ్ భట్టారామ్, ఓలీని కోరారు.
గతంలో ప్రధానిగా కేపీ శర్మ ఓలీ సందర్భంలో కూడా భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కరోనాను భారత్ తో లింక్ పెట్టడంతో పాటు రాముడి జన్మస్థలంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా చైనాకు అనుకూలంగా ఉంటూ, డ్రాగన్ దేశం చెప్పిన విధంగా భారత్ ను ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేశారు. 2020లో ఉత్తరాఖండ్ లోని దార్ఛులాను లిపులేఖ్ పాస్ ను కలిపే 80 కిలోమీటర్ల వ్యూహాత్మక రహదారిని ప్రారంభించింది. ఈ సమయంలో నేపాల్, భారత్ లోని మూడు ప్రాంతాలు తమవిగా ఆరోపణలు చేస్తోంది. నేపాల్ తమ అసెంబ్లీలో కూడా ఈ మూడు ప్రాంతాలపై తీర్మానం చేసింది. ఈ భూభాగాలను తమవిగా చూపుతూ.. నేపాల్ కొత్త మ్యాపులను కూడా రిలీజ్ చేసింది. ఈ చర్యపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇది ఏకపక్ష చర్య అని భారత్ స్పందించింది. దీంతో పాటు కేపీ ఓలీ హిమాలయాల్లోని కాళీ నది ప్రవాహ మార్గాన్ని భారత్ మారుస్తోందని విమర్శించారు. నవంబర్ 20,2022న నేపాల్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అక్కడి ప్రాంతాలు జాతీయ భావాలను రెచ్చగొట్టేందుకు భారత్ పై విమర్శలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..