Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- కేతన్ అగర్వాల్ హత్య కేసులో బ్లాక్మెయిల్ కోణంపై దర్యాప్తు.
- ప్రియుడు చేతన్ బెదిరింపులతోనే సియా హత్య చేసిందా అనే అనుమానం.
- డబ్బు లావాదేవీలు, బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ketan Agarwal Case: పూణేలో కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాపంగా సంచలనంగా మారింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి ప్లాన్ చేసి, లోయలోకి తోసి చంపారు. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. నిందితురాలు సియా, తన ప్రియుడు చేతన్ ఒత్తిడి, బ్లాక్మెయిల్ కారణంగా ఈ హత్యకు పాల్పడిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సియా-చేతన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, పర్సనల్ మెసేజ్లు బయటపెడుతానని బెదిరించి, హత్యకు కుట్ర పన్నాడా అనే దిశగా పోలీసులు పరిశీలిస్తున్నారు. దీంతో పాటు అంతకుముందు జరిగిన హత్యాయత్నం కేసులో సియా పాత్రను బయటపెడుతానని బెదిరించి, కుట్ర కొనసాగించాడా అనే కోణంలో కూడా డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తున్నారు.
ఇదే కాకుండా, మొదట సియాతో పారిపోదామనుకున్న చేతన్, ఆ తర్వాత గోయల్, అగర్వాల్ కుటుంబాల ఆర్థిక సంపద, సామాజిక పలుకుబడిని దృష్టిలో పెట్టుకుని కేతన్ను పూర్తిగా అడ్డుతొలగించాలని నిర్ణయించుకున్నాడా అనే అంశంలో కూడా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. సియా బ్యాంక్ అకౌంట్స్ నుంచి చేతన్కు బారీ మొత్తంలో డబ్బు బదిలీ చేశారా అని పరిశోధిస్తున్నారు. నిఘా కోసం చేతన్కు సియా భారీ మొత్తంలో డబ్బులు పంపిందా.? తొలి హత్యాయత్నం తెలిసిన చేతన్ డబ్బు కోసం సియాను బ్లాక్మెయిల్ చేశాడా?, పెళ్లి అడ్డంకి తొలిగిన తర్వాత కుటుంబ ఆస్తుల నుంచి నెలవారీగా డబ్బు లేదా ఒకే మొత్తంలో ఇస్తానని సియా ఒప్పుకుందా? అనే కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
జూన్ 18న జరిగిన హత్యకు ముందు సియా నగదు విత్ డ్రా చేసిందా అనే విషయాన్ని ఫోరెన్సిక్ టీమ్స్ విశ్లేషిస్తున్నాయి. దీనికి ముందు జూన్ 14న లోహ్గఢ్ కోటలో చేతన్ను సియా తోసి చంపే ప్లాన్ విఫలమైంది. ఇదిలా ఉంటే, హత్యకు ఒక రోజు ముందు పూణేలోని కేఫేలో ఇద్దరు గంట పాటు చర్చించుకోవడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అక్కడే మర్డర్ కోసం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, నేరానికి అసలు సూత్రధారి ఎదుటివారేనని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!