India-Pak tensions: ‘‘ఆహారం, నిత్యావసరాలు నిల్వ చేసుకోండి’’.. ఉద్రిక్తతల మధ్య ప్రజలకు పీఓకే ప్రధాని పిలుపు
- ‘‘ఆహారం, నిత్యావసరాలు సిద్ధం చేసుకోండి’’..
- పీఓకే ప్రజలకు ప్రభుత్వం పిలుపు..
- భారత్ దాడి చేస్తుందనే భయంలో పాక్ ప్రభుత్వం..
India-Pak tensions: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాకిస్తాన్ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పరిస్థితి తీవ్రతను మరింత పెంచారు. భారత్ తమపై దాడికి సిద్ధమవుతుందని సాక్ష్యాత్తు ఆ దేశ మంత్రులే వ్యాఖ్యానించారు. ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పాక్ సైన్యం భారత సరిహద్దుల్లో మోహరించింది. మరోవైపు, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) పై భారత్ దాడి చేస్తుందేమో అని పాక్ తెగ భయపడుతోంది. ఈ మేరకు ఇప్పటికే పీఓకేలోని మదర్సాలను, మతపరమైన కార్యకలాపాలను ఖాళీ చేయించింది.
Read Also: Sperm Count: వీర్యకణాల సమస్యతో ఇబ్బందులా..? కారణాలు ఇవేకావొచ్చు.. జాగ్రత్త సుమీ!
Also Read
- Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
ఇదిలా ఉంటే, తాజాగా జమ్మూ కాశ్మీర్ ప్రధాని చౌదరి అన్వరుల్ హక్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. అఖిలపక్ష సమావేశం తర్వాత నియంత్రణ రేఖ (LOC) సమీపంలో నివసిస్తున్న నివాసితులు ఆహారం, అవసరమైన వస్తువులను నిల్వ చేసుకోవాలని కోరారు. నీలం లోయ, ఎల్ఓసీ పక్కనే ఉన్న ప్రాంతాల్లోకి పర్యాటకులను నిలిపేశారు.
సైనిక సంఘర్షణ జరిగితే సహాయక చర్యలకు మద్దతుగా రూ. 1 బిలియన్ విలువైన అత్యవసర ప్రతిస్పందన నిధిని ఏర్పాటు చేశారు. అదనంగా, నీలం, జీలం, పూంచ్, హవేలి, కోట్లి, భీంబర్తో సహా కీలకమైన ఎల్ఓసి నియోజకవర్గాలలో రోడ్లు తెరిచి ఉండేలా చూసుకోవడానికి అధికారిక, ప్రైవేట్ యంత్రాగాన్ని మోహరించారు. పీఓకేలోని పౌర రక్షణ దళాలను హై అలర్ట్లో ఉంచారు. స్థానిక డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు ప్రజలకు అత్యవసర రెస్క్యూ హెల్ప్ లైన్ నంబర్ 1122ని జారీ చేశారు. పీఓకే అధికారులు ఎల్ఓసీ వెంబడి సరిహద్దుల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, ప్రధాని నరేంద్రమోడీ సహా భారత నేతల ప్రకటన మధ్య కరాచీ,లాహోర్లోని ప్రధాన విమానాశ్రయాల ఎయిర్స్పేస్ ప్రతీ రోజు 8 గంటలు మూసేస్తున్నారు.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?