India-Pak tensions: ‘‘ఆహారం, నిత్యావసరాలు నిల్వ చేసుకోండి’’.. ఉద్రిక్తతల మధ్య ప్రజలకు పీఓకే ప్రధాని పిలుపు
- ‘‘ఆహారం, నిత్యావసరాలు సిద్ధం చేసుకోండి’’..
- పీఓకే ప్రజలకు ప్రభుత్వం పిలుపు..
- భారత్ దాడి చేస్తుందనే భయంలో పాక్ ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pak tensions: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాకిస్తాన్ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పరిస్థితి తీవ్రతను మరింత పెంచారు. భారత్ తమపై దాడికి సిద్ధమవుతుందని సాక్ష్యాత్తు ఆ దేశ మంత్రులే వ్యాఖ్యానించారు. ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పాక్ సైన్యం భారత సరిహద్దుల్లో మోహరించింది. మరోవైపు, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) పై భారత్ దాడి చేస్తుందేమో అని పాక్ తెగ భయపడుతోంది. ఈ మేరకు ఇప్పటికే పీఓకేలోని మదర్సాలను, మతపరమైన కార్యకలాపాలను ఖాళీ చేయించింది.
Read Also: Sperm Count: వీర్యకణాల సమస్యతో ఇబ్బందులా..? కారణాలు ఇవేకావొచ్చు.. జాగ్రత్త సుమీ!
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
ఇదిలా ఉంటే, తాజాగా జమ్మూ కాశ్మీర్ ప్రధాని చౌదరి అన్వరుల్ హక్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. అఖిలపక్ష సమావేశం తర్వాత నియంత్రణ రేఖ (LOC) సమీపంలో నివసిస్తున్న నివాసితులు ఆహారం, అవసరమైన వస్తువులను నిల్వ చేసుకోవాలని కోరారు. నీలం లోయ, ఎల్ఓసీ పక్కనే ఉన్న ప్రాంతాల్లోకి పర్యాటకులను నిలిపేశారు.
సైనిక సంఘర్షణ జరిగితే సహాయక చర్యలకు మద్దతుగా రూ. 1 బిలియన్ విలువైన అత్యవసర ప్రతిస్పందన నిధిని ఏర్పాటు చేశారు. అదనంగా, నీలం, జీలం, పూంచ్, హవేలి, కోట్లి, భీంబర్తో సహా కీలకమైన ఎల్ఓసి నియోజకవర్గాలలో రోడ్లు తెరిచి ఉండేలా చూసుకోవడానికి అధికారిక, ప్రైవేట్ యంత్రాగాన్ని మోహరించారు. పీఓకేలోని పౌర రక్షణ దళాలను హై అలర్ట్లో ఉంచారు. స్థానిక డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు ప్రజలకు అత్యవసర రెస్క్యూ హెల్ప్ లైన్ నంబర్ 1122ని జారీ చేశారు. పీఓకే అధికారులు ఎల్ఓసీ వెంబడి సరిహద్దుల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, ప్రధాని నరేంద్రమోడీ సహా భారత నేతల ప్రకటన మధ్య కరాచీ,లాహోర్లోని ప్రధాన విమానాశ్రయాల ఎయిర్స్పేస్ ప్రతీ రోజు 8 గంటలు మూసేస్తున్నారు.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!