EAM S Jaishankar: భారత ప్రయోజనాలే ఫస్ట్.. రష్యా నుంచి ఆయిల్ కొంటాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India has sustantial, time-tested ties with Russia, Says EAM S Jaishankar: భారత-రష్యా స్నేహం గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల పరీక్షను ఎదుర్కొని రష్యా-భారత్ సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఈ సంబంధాలను మరింతగా విస్తరించేందుకు ఇరు దేశాలు మార్గాలను అణ్వేషిస్తున్నాయని అన్నారు. మంగళవారం జైశంకర్, రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ తో రష్యా రాజధాని మాస్కోలో సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారం పెరుగుతున్న క్రమంలో పరస్పర ప్రయోజనాలు రూపొందించడమే తమ లక్ష్యం అని జై శంకర్ వెల్లడించారు.
Read Also: Bharat Jodo Yatra: మరో జోడో యాత్రకు కాంగ్రెస్ ప్లాన్.. ఈ సారి ఈస్ట్ టూ వెస్ట్
Also Read
- ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
కోవిడ్-19 మహమ్మారి, ఆర్థిక ఒత్తిళ్లు, వాణిజ్య ఇబ్బందులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనం ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలను చూస్తున్నామని.. ఇరు దేశాలు కూడా వెంటనే దౌత్యమార్గాల ద్వారా చర్చించుకోవాలని జైశంకర్ కోరారు. ఇప్పటికే ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ లో ఇది యుద్దాల యుగం కానది తెలిపారని అన్నారు. భారత్, రష్యాలు బహుళ ధృవ ప్రపంచం, సమతుల్య ప్రపంచం కోసం ప్రయత్నిస్తున్నాయని అన్నారు.
చమురు, గ్యాస్ వినియోగంలో భారత్ మూడో అతిపెద్ద వినియోగదారు అని.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై స్పందించారు. ఆదాయాలు ఎక్కువగా లేనప్పుడు తక్కవ ధరకు వచ్చే చమురు కోసం వెతకాలని ఆయన అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తామని వెల్లడించారు. భారతదేశ ప్రయోజనాలే ముఖ్యమని స్పషం చేశారు జైశంకర్. దీంతో పాటు ఆఫ్ఘనిస్తాన్, తీవ్రవాదం మొదలైన అంశాలపై ఇరు నాయకులు చర్చించుకున్నారు. ఉక్రెయిన్ పై రష్యా సైనికచర్య తరువాత రష్యాపై ప్రపంచదేశాలు ఆంక్షలు విధిస్తున్న సమయంలో విదేశాంగ మంత్రి జై శంకర్ రెండు రోజుల రష్యా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇండోనేషియా బాలిలో జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ఒక వారం ముందు జైశంకర్, రష్యా పర్యటనకు వెళ్లారు.
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!