EAM S Jaishankar: భారత ప్రయోజనాలే ఫస్ట్.. రష్యా నుంచి ఆయిల్ కొంటాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India has sustantial, time-tested ties with Russia, Says EAM S Jaishankar: భారత-రష్యా స్నేహం గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల పరీక్షను ఎదుర్కొని రష్యా-భారత్ సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఈ సంబంధాలను మరింతగా విస్తరించేందుకు ఇరు దేశాలు మార్గాలను అణ్వేషిస్తున్నాయని అన్నారు. మంగళవారం జైశంకర్, రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ తో రష్యా రాజధాని మాస్కోలో సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారం పెరుగుతున్న క్రమంలో పరస్పర ప్రయోజనాలు రూపొందించడమే తమ లక్ష్యం అని జై శంకర్ వెల్లడించారు.
Read Also: Bharat Jodo Yatra: మరో జోడో యాత్రకు కాంగ్రెస్ ప్లాన్.. ఈ సారి ఈస్ట్ టూ వెస్ట్
Also Read
కోవిడ్-19 మహమ్మారి, ఆర్థిక ఒత్తిళ్లు, వాణిజ్య ఇబ్బందులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనం ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలను చూస్తున్నామని.. ఇరు దేశాలు కూడా వెంటనే దౌత్యమార్గాల ద్వారా చర్చించుకోవాలని జైశంకర్ కోరారు. ఇప్పటికే ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ లో ఇది యుద్దాల యుగం కానది తెలిపారని అన్నారు. భారత్, రష్యాలు బహుళ ధృవ ప్రపంచం, సమతుల్య ప్రపంచం కోసం ప్రయత్నిస్తున్నాయని అన్నారు.
చమురు, గ్యాస్ వినియోగంలో భారత్ మూడో అతిపెద్ద వినియోగదారు అని.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై స్పందించారు. ఆదాయాలు ఎక్కువగా లేనప్పుడు తక్కవ ధరకు వచ్చే చమురు కోసం వెతకాలని ఆయన అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తామని వెల్లడించారు. భారతదేశ ప్రయోజనాలే ముఖ్యమని స్పషం చేశారు జైశంకర్. దీంతో పాటు ఆఫ్ఘనిస్తాన్, తీవ్రవాదం మొదలైన అంశాలపై ఇరు నాయకులు చర్చించుకున్నారు. ఉక్రెయిన్ పై రష్యా సైనికచర్య తరువాత రష్యాపై ప్రపంచదేశాలు ఆంక్షలు విధిస్తున్న సమయంలో విదేశాంగ మంత్రి జై శంకర్ రెండు రోజుల రష్యా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇండోనేషియా బాలిలో జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ఒక వారం ముందు జైశంకర్, రష్యా పర్యటనకు వెళ్లారు.
తాజావార్తలు
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన యువతకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రూ.2 లక్షల చొప్పున సాయం..
-
Deepika: ఆ “హీరో కంటే నాకే ఎక్కువ అర్హత.. తక్కువ ఇస్తే ఊరుకోను!”.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
-
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!