India-Iran: 48 గంటల పాటు ఇళ్లల్లోంచి బయటకు రావొద్దు.. ఇరాన్లోని భారతీయులకు కేంద్రం హెచ్చరిక
- 48 గంటల పాటు ఇళ్లల్లోంచి బయటకు రావొద్దు
- ఇరాన్లోని భారతీయులకు కేంద్రం హెచ్చరిక
- రాయబార కార్యాలయంతో టచ్లో ఉండాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతం అవుతుందని ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో ఇరాన్లో ఉన్న భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 48 గంటల పాటు ఉన్నచోటనే ఉండాలని.. సైనిక స్థావరాలకు దూరంగా ఉండాలని ఇరాన్లోని పౌరులకు భారత్ విజ్ఞప్తి చేసింది. భారతీయులంతా ఇంట్లోనే ఉండాలని… ముఖ్యంగా అధికారిక ఆదేశాలతో మాత్రమే రహదారి ప్రయాణాలు చేపట్టాలని.. రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని సలహా ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Trump: ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమైపోతుంది.. ట్రంప్ చివరి హెచ్చరిక
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
ఇరాన్ విషయంలో ట్రంప్ విధించిన గడువు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం సాయంత్రం ఒక సలహా జారీ చేసింది. భారత పౌరులు కనీసం 48 గంటల పాటు తాము ఉన్న ప్రదేశాలలోనే ఉండాలని కోరింది. ముఖ్యంగా సైనిక, విద్యుత్ కేంద్రాల వంటి సున్నితమైన ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది.
ఇది కూడా చదవండి: JD Vance: బంతి ఇరాన్లో కోర్టులో ఉంది.. చర్చలపై జేడీ వాన్స్ కీలక ప్రకటన
బహుళ అంతస్తుల భవనాలపై ఉండొద్దని తెలిపింది. ఇంట్లో ఉంటేనే క్షేమం అని పేర్కొంది. రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హోటళ్లలో బస చేస్తున్న వారు లోపలే ఉండాలని.. రాయబార కార్యాలయ సిబ్బందితో నిరంతరం సంప్రదింపులు జరపాలని ప్రత్యేకంగా ఆదేశించింది. భారత పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని.. పరిస్థితిలో ఏవైనా మార్పులు ఉంటే అధికారిక సమాచారాన్ని నిశితంగా గమనించాలని రాయబార కార్యాలయం కోరింది.

తాజావార్తలు
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
-
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!