Imran Khan: 85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్.. వైద్య కారణాలతో విడుదల కోరుతూ కోర్టుకు అప్పీల్
- 85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్
- ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసు లో శిక్షలు అనుభవిస్తున్నారు
- వైద్య కారణాలతో విడుదల కోరుతూ కోర్టుకు అప్పీల్
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నారు. తన ఆరోగ్యం క్షీణిస్తోందని, జైలు పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని పేర్కొంటూ, వైద్య, మానవతా కారణాలతో తన విడుదలను కోరుతూ ఇస్లామాబాద్ హైకోర్టును అభ్యర్థించారు. ఇమ్రాన్ ఖాన్ తరఫు న్యాయవాది సల్మాన్ సఫ్దర్ కోర్టుకు తెలిపారు.. “ఇమ్రాన్ ఖాన్ కంటిచూపు కేవలం 15 శాతం మాత్రమే మిగిలి ఉంది. అంటే ఆయన దృష్టిలో 85 శాతం కోల్పోయారు.” ఈ సమస్య శాశ్వతమైనదని, వైద్యులు కూడా దీన్ని కోలుకోలేని పరిస్థితిగా అభివర్ణించారని న్యాయవాది వాదించారు. ఇస్లామాబాద్ హైకోర్టులో జరిగిన విచారణలో, జైలులో సుదీర్ఘకాలం ఏకాంత నిర్బంధం కంటి సమస్యల కారణంగా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని న్యాయవాది తెలిపారు.
ఆదియాలా జైలులో తగిన వైద్య సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆయనను అనేకసార్లు ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని కూడా పేర్కొన్నారు. న్యాయవాది సల్మాన్ సఫ్దర్ మరిన్ని అంశాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీను ఎందుకు ఏకాంత నిర్బంధంలో ఉంచుతున్నారో వివరణ కోరారు. పంజాబ్ జైళ్ల ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, ఆదియాలా జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్లను కోర్టు ముందు హాజరుపరచాలని అభ్యర్థించారు. ఇమ్రాన్ ఖాన్ పూర్తి వైద్య రికార్డులను ఆసుపత్రి నుంచి కోర్టుకు సమర్పించాలని డిమాండ్ చేశారు.
Also Read
- Mojtaba Khamenei: "సముద్ర గర్భంలో పాతిపెడతాం".. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..
- Iran War: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
- Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
విచారణ సందర్భంగా, ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్దార్ ముహమ్మద్ సర్ఫరాజ్ డోగర్ ప్రధాన అప్పీల్పై దృష్టి పెట్టాలని సూచించారు. అయితే, శిక్ష నిలుపుదల పిటిషన్పై ముందుగా నిర్ణయం తీసుకోవాలని ఇమ్రాన్ తరఫు న్యాయవాది పట్టుబట్టారు. దీంతో కోర్టు విచారణను వాయిదా వేసింది. ఇమ్రాన్ ఖాన్ ఆయన భార్య బుష్రా బీబీ అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసు (190 మిలియన్ పౌండ్ల అవినీతి కేసు)లో శిక్షలు అనుభవిస్తున్నారు. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) ఆరోపణల ప్రకారం, బ్రిటన్ నుంచి వచ్చిన డబ్బును ప్రభుత్వ ఖజానాలో జమ చేయకుండా, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త జరిమానాలు చెల్లించడానికి ఉపయోగించి, ప్రతిఫలంగా ఖాన్ ట్రస్ట్కు విలువైన భూములు బహుమతిగా అందుకున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Imran Khan: 85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్.. వైద్య కారణాలతో విడుదల కోరుతూ కోర్టుకు అప్పీల్
-
Rajat Patidar: పాయింట్ల పట్టికను పట్టించుకోవడం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
-
Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
-
Shruti Haasan : హీరోయిన్గా కంటే ఐటంగర్ల్గా ఎక్కువ సంపాదిస్తున్న శృతి
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!