Los Angeles Wildfires: హాలీవుడ్ హిల్స్లో కార్చిచ్చు.. ఆస్కార్ వేదికకు పొంచి ఉన్న ముప్పు!
- లాస్ ఏంజెలెస్లోని హాలీవుడ్లోని ఐకానిక్ నిర్మాణాలను కాల్చేస్తున్న కార్చిచ్చు..
- ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే డాల్బీ థియేటర్ను ఖాళీ చేయించిన అధికారులు..
- కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తుండటంతో ఆస్కార్ నామినేషన్ ప్రక్రియ ఆలస్యం అయ్యే ఛాన్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Los Angeles Wildfires: లాస్ ఏంజెలెస్లో గల హాలీవుడ్లోని ఐకానిక్ నిర్మాణాలను కార్చిచ్చు కాల్చి బూడిద చేసే ప్రమాదం ఉంది. ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే ప్రఖ్యాత డాల్బీ థియేటర్ను కూడా అగ్నిమాపక శాఖ అధికారులు ఖాళీ చేయించారు. దీంతో ప్రస్తుతం పరిస్థితితో ఆస్కార్ నామినేషన్ ప్రక్రియ ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. నేడు (జనవరి 9) హాలీవుడ్లో సరికొత్త కార్చిచ్చు పుట్టిందని పేర్కొన్నారు. ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో హాలీవుడ్ హిల్స్ మొత్తాన్నీ ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీతారల ఇళ్లు, సంపదను కోల్పోయారు. మొత్తంగా 1100 నిర్మాణాలు దగ్ధమైనట్లు తేలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 1.3 లక్షల ఇళ్లు ఖాళీ చేయించారు.
Read Also: Bhumana Karunakara Reddy: తొక్కిసలాట ఘటనపై టీటీడీ మజీ ఛైర్మన్ రియాక్షన్..
Also Read
అయితే, ఇప్పటి వరకు మొత్తం ఆరు చోట్ల ఈ కార్చిచ్చులు వ్యాపించినట్లు ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రకటించారు. ఈ మంటల్లో 15,800 ఎకరాలు కాలిబూడిద కాగా, పాలిసాడ్స్ ఫైర్ అతి పెద్దది అన్నారు. దీని తర్వాత ఈటన్లో 10 వేల ఎకరాలు దగ్ధం అయింది. ఆల్టడేన, పసాడెనా ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఇక, సన్సెట్ ఫైర్ వేగంగా హాలీవుడ్ హిల్స్ను చుట్టుముట్టింది. సైల్మర్ ప్రాంతంలో 700 ఎకరాలను హురెస్ట్ ఫైర్ కాల్చి బూడిద చేసింది. మరో 340 ఎకరాలను లిడియా ఫైర్ కాల్చేసింది. ఇక, ఉడ్లీ ఫైర్ను అధికారులు క్రమంగా నియంత్రించారు.
Read Also: Tirupati Collector: అన్ని ఏర్పాట్లు చేశాం.. కానీ..
కాగా, లాస్ ఎంజెలెస్ సంపన్న ప్రాంతం కావడంతో భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు వచ్చిన ప్రాథమిక అంచనాల ప్రకారమే 50 బిలియన్ డాలర్ల సంపద నాశనం అయింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని టాక్. అయితే, ఇప్పటి వరకు అగ్ని కీలలను తాము అదుపు చేయలేకపోయామని అగ్నిమాపక శాఖ చీఫ్ క్రిస్టన్ క్రౌలీ తెలిపారు. 1700 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మరో 7,500 మంది సిబ్బందిని కాలిఫోర్నియా రెడీ చేస్తుందన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటలీ, రోమ్లలో టూరు ఉంది. తన పదవీకాలంలో చివరిదైన ఈ విదేశీ పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఆయన లాస్ఏంజెలెస్లో ఈ కార్చిచ్చు పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షిస్తున్నారని వెల్లడించింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!