Chinmoy Krishna Das: హిందూ నేత చిన్మోయ్ కృష్ణ దాస్కి బంగ్లాదేశ్ కోర్ట్ బెయిల్..
- హిందూ నేత చిన్మోయ్ కృష్ణ దాస్కి బంగ్లా కోర్ట్ బెయిల్..
- గతేడాది దేశద్రోహం కేసులో అరెస్ట్..
- హిందువులపై హింసకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన దాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinmoy Krishna Das: బంగ్లాదేశ్లో దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన హిందూ నేత చిన్మోయ్ కృష్ణ దాస్కి బంగ్లాదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇస్కాన్ మాజీ నాయాకుడు, బంగ్లాదేశ్ సమ్మిలిత్ సతానత జాగ్రన్ జోట్ ప్రతినిధి అయిన దాస్ని నవంబర్ 25న ఢాకా ఎయిర్ పోర్టులో అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ జెండాను అవమానించారనే కారణంగా అతడిపై దేశద్రోహ కేసు నమోదు చేశారు. తాజాగా, ఆయనకు జస్టిస్ ఎండీ అటోర్ రెహమాన్, జస్టిస్ ఎండీ అలీ రెజాలతో కూడిన ధర్మాసనం బెయిల్ని మంజూరు చేసింది.
గతేడాది ఆగస్టులో విద్యార్థుల హింసాత్మక ఉద్యమం తర్వాత షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చారు. ఆ తర్వాత, బంగ్లాదేశ్లో మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే, షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత, బంగ్లా వ్యాప్తంగా మైనారిటీలు, ముఖ్యంగా హిందువులు టార్గెట్గా దారుణమైన హింస చెలరేగింది. హిందువుల ఇళ్లు, ఆస్తులు, వ్యాపారాలు, గుడులను మతోన్మాదులు టార్గెట్ చేసి దాడులకు పాల్పడ్డారు.
Also Read
- US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
Read Also: Hafiz Saeed: మోస్ట్ వాంటెడ్ హఫీస్ సయీద్కి పాక్ భారీ భద్రత.. లాహోర్లో నిర్భయంగా..
ఆ సమయంలో ఈ హింసకు వ్యతిరేకంగా చిన్మోయ్ కృష్ణ దాస్ మైనారిటీల హక్కుల కోసం నినదించారు. ఈ నేపథ్యంలో అతడిని సైలెంట్ చేసేందుకు యూనస్ సర్కార్ దేశద్రోహ కేసు పెట్టింది. పలు సందర్భాల్లో అతడి బెయిల్ని కింది కోర్టులు తోసిపుచ్చుతూ వచ్చాయి. అతడి తరుపున వాదించడానికి కూడా లాయర్ రాని పరిస్థితి నెలకొంది. ముస్లిం బార్ అసోసియేషన్ అతడి తరుపున వాదించవద్దని హెచ్చరికలు కూడా జారీ చేసింది. నవంబర్ 27న చట్టోగ్రామ్(చిట్టగాంగ్) కోర్టు వెలుపల దాస్ అనుచరులు, అధికారులకు మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. ఇందులో ఒక న్యాయవాది మరణించారు. అతడి అరెస్ట్పై భారత్ కూగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటన రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడానికి కారణమైంది.
తాజావార్తలు
-
Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
-
Sharvari Wagh: షూటింగ్లో అలియాను చూసి ఎన్నో నేర్చుకున్నా: శార్వరీ
-
Ruturaj Gaikwad: ముగిసిన సీఎస్కే ప్రయాణం.. ధోనీ రిటైర్మెంట్పై CSK కెప్టెన్ సంచలన ప్రకటన..
-
US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
-
Dragon: ‘డ్రాగన్’లో..తారక్ పాత్రపై ప్రశాంత్ నీల్ బిగ్ క్లారిటీ..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!