Pakistan: పాకిస్తాన్లో హిందూ మంత్రిపై దాడి.. కారణం ఇదే..
- పాకిస్తాన్లో హిందూ మంత్రిపై దాడి..
- సింధ్ ప్రావిన్స్ గుండా వెళ్తున్నప్పుడు దాడి చేసిన నిరసనకారులు..
- కాలువ నిర్మాణానికి వ్యతిరేకంగా సింధ్లో నిరసనలు..
- పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంత్రి కోహిస్తానీపై దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో హిందూ మంత్రి ఖీల్ దాస్ కోహిస్తానీపై దాడి జరిగింది. సింధ్ ప్రావిన్సులో పాక్ ప్రభుత్వం చేపడుతున్న కాలువ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్న నిరసనకారులు అతడిపై దాడి చేశారు. ఈ ప్రాజెక్టు నదుల దిగువ ప్రవాహాన్ని తగ్గిస్తాయని, ఫలితంగా సింధ్ ప్రాంతంపై ప్రభావం పడుతుందని అక్కడి ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, సింధ్ ప్రావిన్సు గుండా ప్రయాణిస్తున్న సమయంలో కోహిస్తానీపై దాడి జరిగింది.
ఈ దాడిని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. దాడికి పాల్పడినవారిని శిక్షిస్తామని చెప్పారు. పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం ఇటీవల ఓ భారీ కాలువ నిర్మాణాన్ని ప్రారంభించింది. దీని వల్ల దిగువ ప్రాంతమైన సింధ్కి రావాల్సిన నీటిని పంజాబ్ ప్రాంతానికి మళ్లిస్తున్నారని అక్కడి ప్రజలు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే, పీఎం షెహబాజ్ షరీఫ్ మంత్రివర్గంలో మత వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్న కోహిస్తానీపై దాడి జరిగింది. ఆయన శనివారం సింధ్ ప్రావిన్స్ తట్టా జిల్లా గుండా వెళ్తున్నప్పుడు టమోటోలు, బంగాళాదుంపలతో నిరసనకారులు దాడి చేశారు. ఈ దాడిలో కోహిస్తానీ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- Marco Rubio: ఇరాన్ అణు చర్చలపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు.. పశ్చిమాసియా శాంతించేనా?
- US: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్గా విలియం జె.పుల్టే నియామకం.. ట్రంప్ అభినందనలు
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
Read Also: UP News: భార్యపై మిస్సింగ్ ఫిర్యాదు.. కట్ చేస్తే, లవర్తో తాజ్మహల్ వద్ద ఎంజాయ్..
కోహిస్తానీ అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N)లో కీలక నేత. ఈ దాడిపై సింధ్ ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ (ఐజీపీ) గులాం నబీ మెమన్ నుండి సంఘటన వివరాలను ప్రభుత్వం కోరింది. సింధ్ సీఎం సయ్యద్ మురాద్ అలీ షా కూడా ఈ దాడిని ఖండించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికి లేదని అన్నారు. దాడిలో పాల్గొన్న దుండగులను వెంటనే అరెస్ట్ చేసి నివేదిక సమర్పించాలని హైదరాబాద్ ప్రాంత డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ను ఆయన ఆదేశించారు.
గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ కింద పంజాబ్ ప్రావిన్స్లో ఆరు కాలువలను నిర్మించే ప్రతిపాదనను పాక్ ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు పాక్ సైన్యం, ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వాల మద్దతు ఉంది. అయితే, ఈ ప్రాజెక్టు చేపడితే సింధ్ పూర్తిగా ఎడారిగా మారుతుందని, అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
-
Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
-
CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!