Hassan Nasrallah: “మా నాయకుడు హసన్ నస్రల్లా చనిపోయాడు”.. ధ్రువీకరించిన హిజ్బుల్లా..
- మా నాయకుడు హసన్ నస్రల్లా మరణించాడు..
- ధ్రువీకరిస్తూ హిజ్బుల్లా ప్రకటన..
- ఇజ్రాయిల్పై దాడులు చేస్తామని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hassan Nasrallah: హిజ్బుల్లా అధినేత సయ్యద్ హసన్ నస్రల్లా చనిపోయినట్లు ఆ సంస్థ శనివారం ధ్రువీకరించింది. శుక్రవారం లెబనాన్ రాజధాని బీరూట్పై జరిగిన దాడిలో నస్రల్లాను హతమార్చామని ఇజ్రాయిల్ ఆర్మీ చెప్పిన కొన్ని గంటల తర్వాత హిజ్బుల్లా నుంచి ఈ ప్రకటన వచ్చింది. నస్రల్లా మరణం హిజ్బుల్లాకు భారీ దెబ్బగా అంతర్జాతీయ రాజకీయ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇరాన్ మద్దతు కలిగిన ‘‘ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’’లో నస్రల్లా అత్యంత కీలకం, ఇప్పుడు అతని మరణం ఇరాన్కి కూడా పెద్ద దెబ్బగా చెబుతున్నారు.
Read Also: HYDRA Commissioner Ranganath: హైడ్రా అంటే ఒక భరోసా.. హైడ్రాను భూచి, రాక్షసిగా చూపించొద్దు..
Also Read
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
తమ చీఫ్ మరణించాడని చెబుతూనే..‘‘గాజా మరియు పాలస్తీనాకు మద్దతుగా లెబనాన్ మరియు దాని దృఢమైన మరియు గౌరవప్రదమైన ప్రజలకు రక్షణగా’’గా ఇజ్రాయిల్పై తన పోరాటాన్ని కొనసాగిస్తామని హిజ్బుల్లా చెప్పింది. అయితే, నస్రల్లా ఎలా చంపబడ్డాడనే విషయాన్ని చెప్పలేదు. బీరూట్ దక్షిణ శివారులోని దహియేహ్లోని నివాసం భవనం కింద ఉన్న భూగర్భంలోని ప్రధాన కార్యాలయంపై శుక్రవారం ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసి, చంపేసినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ తెలిపింది. మరొక హిజ్బుల్లా కమాండర్ అలీ కరాకి కూడా ఇతర కమాండర్లలో హతమైనట్లు చెప్పారు.
హిజ్బుల్లా ‘‘సీనియర్ చైన్ ఆఫ్ కమాండ్’’ ప్రధాన కార్యాలయం నుంచి ఇజ్రాయిల్పై దాడులకు ప్లాన్ చేస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగినట్లు తెలిపింది. దాదాపుగా టన్ను బరువు ఉన్న 80కి పైగా బాంబుల్ని ఇజ్రాయిల్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీని వల్ల ఏకంగా 25 మీటర్ల లోతు బిలం ఏర్పడింది. ప్రస్తుతం హిజ్బుల్లాకు చెందిన నస్రల్లాతో పాటు కీలకమైన 9 మంది కమాండర్లు హతమయ్యారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?