HYDRA Commissioner Ranganath: హైడ్రా అంటే ఒక భరోసా.. హైడ్రాను భూచి, రాక్షసిగా చూపించొద్దు..
- చెరువులు..నాలాలు కాపాడడమే హైడ్రా లక్ష్యం
- సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది
- దేశంలో ఎక్కడా హైడ్రా లాంటి వ్యవస్థ లేదు
- హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA Commissioner Ranganath: ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. చెరువులు, నాలాలు కాపాడడమే హైడ్రా లక్ష్యమని వెల్లడించారు. ఆర్టికల్ 21 ప్రకారం.. పరిశుభ్రమైన వాతావరణం రైట్ టూ లైఫ్ ఉద్దేశమన్నారు. హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎసెట్ ప్రొటెస్ట్ ఉద్దేశ్యం.. వాటి పరిరక్షణ మా బాధ్యత అని పేర్కొన్నారు. నదులు, చెరువులు, నాలాలు ప్రజల ఆస్తులేనన్నారు. సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన తెలిపారు. అమీన్పూర్లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. అమీన్పూర్లో ఓ భవనాన్ని కూల్చినా మళ్లీ కట్టారని రంగనాథ్ తెలిపారు. భవనంలో ఆస్పత్రి లేకపోయినా ఆస్పత్రి ఉన్నట్లు ప్రచారం చేశారన్నారు. కొందరు బలవంతులు అక్రమ కట్టడాల వెనుక ఉన్నారన్నారు. అనధికార ఆస్తులను కూల్చివేశామన్న ఆయన.. ఇప్పటి వరకు 21, 22 ప్రాంతాల్లో కూల్చివేతలు చేశామన్నారు. కొంతమంది దుండిగల్, అమీన్పూర్ ప్రాంతంలో నకిలీ పర్మిషన్లు ఇచ్చారు. అలా పర్మిషన్లు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేశామని.. పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేశామన్నారు. ఎక్కడ హాస్పిటల్ను హైడ్రా కూల్చలేదన్నారు.
Read Also: Dana Kishore : గతంలో మూసీకి భారీగా వరదలు వచ్చాయి.. గతంలోనూ నిర్వాసితులను తరలించారు.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
కొంతమంది ఆస్తులు కొనుగోలు చేసే ముందు సరైన విచారణ చేయకుండా కొనుగోలు చేస్తున్నారని.. పంచాయతీ పర్మిషన్లు క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా కొందరు నిర్మాణాలు చేపట్టారన్నారు. తప్పులు చేసిన బిల్డర్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నామన్నారు.సున్నం చెరువులో వెంకటేష్ అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకున్న వ్యక్తి ట్యాంకర్ల బిజినెస్ చేస్తాడని.. ఒకరోజు ఆదాయం లక్షకు పైనే ఉంటుందన్నారు. ఎఫ్టీఎల్లో ప్రజలు నివాసం ఉండే సముదాయాల జోలికి వెళ్లడం లేదన్నారు. కూల్చివేతలకు సంబంధించి సంబంధిత ఇంటి యజమానులకు సమాచారం ఇస్తున్నామన్నారు. బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకోవడం వెనుక వేరే కారణం ఉందన్నారు. హైడ్రా అంటే ఒక భరోసా… హైడ్రాను భూచి, రాక్షసిగా చూపించొద్దని రంగనాథ్ సూచించారు. దేశంలో ఎక్కడా హైడ్రా లాంటి వ్యవస్థ లేదన్నారు. హైడ్రాను భయంగా చూపొద్దు.. హైడ్రా అంటే బాధ్యత, భరోసా అని పేర్కొన్నారు. పర్మిషన్ ఉందని చెబుతోంది తప్పు.. ఒకవేళ పర్మిషన్ చూపినా అవన్నీ తప్పు.. వాటి సమయం ముగిసి ఎంతో కాలం అవుతుందన్నారు. చాలా కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయని.. అకడమిక్ ఇయర్ మధ్యలో ఉందని, విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత వాటిని చూస్తామన్నారు. 111 జీవో మా పరిధి కాదని వ్యాఖ్యానించారు. చిన్న వాళ్ల ఇండ్లు కూల్చుతున్నాం అంటున్నారు.. వాళ్ళ వెనుక పెద్ద వాళ్ళు ఉన్నారన్నారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!