HYDRA Commissioner Ranganath: హైడ్రా అంటే ఒక భరోసా.. హైడ్రాను భూచి, రాక్షసిగా చూపించొద్దు..
- చెరువులు..నాలాలు కాపాడడమే హైడ్రా లక్ష్యం
- సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది
- దేశంలో ఎక్కడా హైడ్రా లాంటి వ్యవస్థ లేదు
- హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA Commissioner Ranganath: ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. చెరువులు, నాలాలు కాపాడడమే హైడ్రా లక్ష్యమని వెల్లడించారు. ఆర్టికల్ 21 ప్రకారం.. పరిశుభ్రమైన వాతావరణం రైట్ టూ లైఫ్ ఉద్దేశమన్నారు. హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎసెట్ ప్రొటెస్ట్ ఉద్దేశ్యం.. వాటి పరిరక్షణ మా బాధ్యత అని పేర్కొన్నారు. నదులు, చెరువులు, నాలాలు ప్రజల ఆస్తులేనన్నారు. సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన తెలిపారు. అమీన్పూర్లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. అమీన్పూర్లో ఓ భవనాన్ని కూల్చినా మళ్లీ కట్టారని రంగనాథ్ తెలిపారు. భవనంలో ఆస్పత్రి లేకపోయినా ఆస్పత్రి ఉన్నట్లు ప్రచారం చేశారన్నారు. కొందరు బలవంతులు అక్రమ కట్టడాల వెనుక ఉన్నారన్నారు. అనధికార ఆస్తులను కూల్చివేశామన్న ఆయన.. ఇప్పటి వరకు 21, 22 ప్రాంతాల్లో కూల్చివేతలు చేశామన్నారు. కొంతమంది దుండిగల్, అమీన్పూర్ ప్రాంతంలో నకిలీ పర్మిషన్లు ఇచ్చారు. అలా పర్మిషన్లు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేశామని.. పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేశామన్నారు. ఎక్కడ హాస్పిటల్ను హైడ్రా కూల్చలేదన్నారు.
Read Also: Dana Kishore : గతంలో మూసీకి భారీగా వరదలు వచ్చాయి.. గతంలోనూ నిర్వాసితులను తరలించారు.
Also Read
- YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
- Karnataka: కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
- Central Cabinet: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్.. తెలంగాణలో ఆ రహదారులు ఇక 4 లైన్లుగా..
- T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
కొంతమంది ఆస్తులు కొనుగోలు చేసే ముందు సరైన విచారణ చేయకుండా కొనుగోలు చేస్తున్నారని.. పంచాయతీ పర్మిషన్లు క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా కొందరు నిర్మాణాలు చేపట్టారన్నారు. తప్పులు చేసిన బిల్డర్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నామన్నారు.సున్నం చెరువులో వెంకటేష్ అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకున్న వ్యక్తి ట్యాంకర్ల బిజినెస్ చేస్తాడని.. ఒకరోజు ఆదాయం లక్షకు పైనే ఉంటుందన్నారు. ఎఫ్టీఎల్లో ప్రజలు నివాసం ఉండే సముదాయాల జోలికి వెళ్లడం లేదన్నారు. కూల్చివేతలకు సంబంధించి సంబంధిత ఇంటి యజమానులకు సమాచారం ఇస్తున్నామన్నారు. బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకోవడం వెనుక వేరే కారణం ఉందన్నారు. హైడ్రా అంటే ఒక భరోసా… హైడ్రాను భూచి, రాక్షసిగా చూపించొద్దని రంగనాథ్ సూచించారు. దేశంలో ఎక్కడా హైడ్రా లాంటి వ్యవస్థ లేదన్నారు. హైడ్రాను భయంగా చూపొద్దు.. హైడ్రా అంటే బాధ్యత, భరోసా అని పేర్కొన్నారు. పర్మిషన్ ఉందని చెబుతోంది తప్పు.. ఒకవేళ పర్మిషన్ చూపినా అవన్నీ తప్పు.. వాటి సమయం ముగిసి ఎంతో కాలం అవుతుందన్నారు. చాలా కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయని.. అకడమిక్ ఇయర్ మధ్యలో ఉందని, విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత వాటిని చూస్తామన్నారు. 111 జీవో మా పరిధి కాదని వ్యాఖ్యానించారు. చిన్న వాళ్ల ఇండ్లు కూల్చుతున్నాం అంటున్నారు.. వాళ్ళ వెనుక పెద్ద వాళ్ళు ఉన్నారన్నారు.
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
-
Karnataka: కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
-
Mahalakshmi Rajyoga: జూన్ 11 నుంచి మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Central Cabinet: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్.. తెలంగాణలో ఆ రహదారులు ఇక 4 లైన్లుగా..
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!