Iran Ex President: అతనే ఇజ్రాయెల్ గుఢచారి.. ఇరాన్లో డబుల్ ఏజెంట్లు ఉన్నారు..
- మా సీక్రెట్ సర్వీస్ అధిపతే ఇజ్రాయెల్ గూఢచారిగా మారిపోయాడు..
- దాదాపు 20 మంది ఇంటెలిజెన్స్ సిబ్బంది డబుల్ ఏజెంట్లుగా మారారు..
- ఇరాన్ రహస్యాలను మొత్తం ఇజ్రాయెల్కు చేరవేసేవాడు: మహముద్ అహ్మదిన్జాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Ex President: ఇజ్రాయెల్పై నిఘా కోసం ఏర్పాటు చేసిన ఓ ఇంటెలిజెన్స్ అధిపతే చివరికి మమల్ని మోసం చేశాడని ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహముద్ అహ్మదిన్జాద్ పేర్కొన్నారు. అతడు మా సమాచారం మొత్తం ఇజ్రాయెల్కు చేరవేసేవాడని ఆరోపణలు చేశాడు. టెహ్రాన్లో మొస్సాద్ సంస్థ ఏ స్థాయిలో వెళ్లిందో తెలియజేస్తూ.. ఈ విషయాన్ని ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
Read Also: Bullet Train Project: మోడీ కలల ప్రాజెక్ట్ “బుల్లెట్ రైలు”కు.. జపాన్ అడ్డంకి!
Also Read
కాగా, మొస్సాద్ విజయవంతంగా మా ఇంటెలిజెన్స్ యూనిట్స్ను తన వైపునకు తిప్పుకుందని ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మదిన్జాద్ తెలిపారు. వీరిలో దాదాపు 20 మంది ఇంటెలిజెన్స్ సిబ్బంది డబుల్ ఏజెంట్లుగా మారి.. ఇజ్రాయెల్కు అత్యంత కీలకమైన అణు రహస్యాలను అందించారని పేర్కొన్నాడు. ఈ కామెంట్స్ తో ఇరాన్ భద్రత, నిఘా వ్యవస్థలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయాయి. మా నిఘా సంస్థకు చెందిన ఓ అధిపతే ఇజ్రాయెల్ గూఢచారని 2021లోనే బయటకు వచ్చింది. ఇరాన్లో టెల్అవీవ్ అత్యంత కఠిన ఆపరేషన్లు నిర్వహించి తేలిగ్గా కీలక సమాచారం చేజిక్కించుకొంటదని చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో మొస్సాద్ కార్యకలాపాలు మరింత పెరిగిపోయాయని మహముద్ అహ్మదిన్జాద్ వెల్లడించారు.
Read Also: Chandrahass: సినిమా నచ్చకుంటే డబ్బు వాపస్… యాటిట్యూడ్ స్టార్ షాకింగ్ కామెంట్స్
ఇక, మొస్సాద్ ఓ ఆపరేషన్ చేసి దాదాపు 1,00,000 అణుపత్రాలను దొంగలించింది అని మహముద్ అహ్మదిన్జాద్ తెలియజేశాడు. వాటిని ఇజ్రాయెల్ ప్రధాని 2018లో బహిర్గతం చేశాడని చెప్పుకొచ్చాడు. ఇరాన్ ఏవిధంగా సీక్రెట్గా అణు కార్యక్రమాలను నిర్వహిస్తోంది అనేది అందులో స్పష్టంగా ఉందన్నారు. టెహ్రాన్లోని రహస్య స్థావరంలోకి మొస్సాద్ ఏజెంట్లు చొరబడి వాటిని ఎత్తుకెళ్లారని తెలిపారు. దాదాపు పాతిక మంది ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఇరాన్ అణు లక్ష్యాలను ఇది తీవ్రంగా దెబ్బ తీసింది అని ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఆరోపించాడు.
తాజావార్తలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!