Hamas Atrocities: “గన్తో బెదిరించి అత్యాచారం చేసేవారు”.. ఇజ్రాయిల్ బందీలపై హమాస్ అకృత్యాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hamas Atrocities: హమాస్ ఉగ్రవాదులు అక్టోబర్ 7న ఇజ్రాయిల్పై దాడికి తెగబడ్డారు. 1200 మందిని చంపడంతో పాటు పలువురు ఇజ్రాయిలీలను బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. అయితే, వీరు ఇజ్రాయిలీలపై బలవంతంగా జరిపిన అఘాయిత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కిబ్బట్జ్ క్ఫర్ అజా నుంచి బందీగా చిక్కిన అమిత్ సౌసానా అనే 40 ఏళ్ల యువతి తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను వెల్లడించింది. బందీల మార్పిడిలో వారి నుంచి విముక్తి పొందిని వృత్తిరీత్యా నాయవాది అయిన సౌసానా హమాస్ మిలిటెంట్లు ఎలా ప్రవర్తించేవారో వెల్లడించింది. దాడి సమయంలో తప్పించుకునేందుకు ప్రయత్నించిన సమయంలో హమాస్ మిలిటెంట్లు సౌసాను తీవ్రంగా కొట్టిన వీడియో వైరల్ అయింది.
లైంగిక వేధింపులపై బహిరంగంగా మాట్లాడిన తొలి ఇజ్రాయిలీ బందీ అని న్యూయార్క్ టైమ్స్ నివేదిక పేర్కొంది. తనను బందీగా తీసుకున్న కొద్దిసేపటికే తమపై వేధింపులు ప్రారంభమైనట్లు అమిత్ సౌసానా వెల్లడించారు. 55 రోజుల పాటు హమాస్ చెరలో ఉన్న ఈమె, బందీల విడుదలలో బయటపడింది. మహ్మద్ అనే వ్యక్తి తనపై తరుచుగా లైంగిక వేధింపులకు పాల్పడే వాడని చెప్పింది. తన డ్రెస్ ఎత్తి, గట్టిగా హత్తుకునే వాడని, తన ఇంటిలో బంధించి తనను వేధించడం ప్రారంభించాడని ఆమె చెప్పింది.
Also Read
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- Hamas Crypto Funding: హమాస్కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్వర్క్పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
- US Iran Conflict: మిడిల్ ఈస్ట్లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
Read Also: Jio World Garden: ముకేశ్ అంబానీ సంపన్నుల కోసం కట్టించిన పెళ్లి వేదిక అద్దె ఎంతో తెలుసా?
స్నానం చేయడానికి కట్లు విడిచిన తర్వాత తనపై దాడికి పాల్పడ్డాడని, తన ముఖానికి తుపాకీ గురిపెట్టి, బెడ్రూంలోకి ఈడ్చుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు ఆమె తన వేధింపులను వెల్లడించింది. అతను లైంగిక వేధింపులకు పాల్పడుతూనే ఉండేవాడని, తనకు మసాజ్ చేయవచ్చా అని అడుగుతుండే వాడని, పీరియడ్స్ ఎప్పుడు వస్తాయని రోజూ అడుగుతుండే వాడని ఆమె వెల్లడించింది.
అయితే, తన చర్యలపై పశ్చాత్తాపం వ్యక్తి చేస్తూ.. ఈ విషయాన్ని ఇజ్రాయిల్కి తెలియజేయవద్దని చివరకు వేడుకున్నాడని సౌసానా చెప్పారు. తనను వేరే ప్రాంతానికి మార్చిన తర్వాత కూడా తనపై వేధింపులు ఆగలేదని తరుచూ కొట్టేవారని చెప్పింది. 240 మంది బందీల్లో ఇప్పటికీ 130 మంది బందీలు ఇంకా హమాస్ కస్టడీలోనే ఉన్నారు. కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం చర్చలు జరుగుతున్నాయి. అక్టోబర్ 7న జరిగిన దాడితో ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఇప్పటికే 32,000 మంది పాలస్తీనియన్లు మరణించారు.
https://twitter.com/OliLondonTV/status/1772748448200020440
తాజావార్తలు
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
-
Konda Surkha : సీఎం రేవంత్కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
AP Cabinet Meeting: అమరావతిలో అభివృద్ధి పనులకు వేగం.. రేపటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!