Hamas Atrocities: “గన్తో బెదిరించి అత్యాచారం చేసేవారు”.. ఇజ్రాయిల్ బందీలపై హమాస్ అకృత్యాలు..
Hamas Atrocities: హమాస్ ఉగ్రవాదులు అక్టోబర్ 7న ఇజ్రాయిల్పై దాడికి తెగబడ్డారు. 1200 మందిని చంపడంతో పాటు పలువురు ఇజ్రాయిలీలను బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. అయితే, వీరు ఇజ్రాయిలీలపై బలవంతంగా జరిపిన అఘాయిత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కిబ్బట్జ్ క్ఫర్ అజా నుంచి బందీగా చిక్కిన అమిత్ సౌసానా అనే 40 ఏళ్ల యువతి తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను వెల్లడించింది. బందీల మార్పిడిలో వారి నుంచి విముక్తి పొందిని వృత్తిరీత్యా నాయవాది అయిన సౌసానా హమాస్ మిలిటెంట్లు ఎలా ప్రవర్తించేవారో వెల్లడించింది. దాడి సమయంలో తప్పించుకునేందుకు ప్రయత్నించిన సమయంలో హమాస్ మిలిటెంట్లు సౌసాను తీవ్రంగా కొట్టిన వీడియో వైరల్ అయింది.
లైంగిక వేధింపులపై బహిరంగంగా మాట్లాడిన తొలి ఇజ్రాయిలీ బందీ అని న్యూయార్క్ టైమ్స్ నివేదిక పేర్కొంది. తనను బందీగా తీసుకున్న కొద్దిసేపటికే తమపై వేధింపులు ప్రారంభమైనట్లు అమిత్ సౌసానా వెల్లడించారు. 55 రోజుల పాటు హమాస్ చెరలో ఉన్న ఈమె, బందీల విడుదలలో బయటపడింది. మహ్మద్ అనే వ్యక్తి తనపై తరుచుగా లైంగిక వేధింపులకు పాల్పడే వాడని చెప్పింది. తన డ్రెస్ ఎత్తి, గట్టిగా హత్తుకునే వాడని, తన ఇంటిలో బంధించి తనను వేధించడం ప్రారంభించాడని ఆమె చెప్పింది.
Also Read
- Iran-US: మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కాబోతుందా? ఇరాన్ సైన్యం హై అలర్ట్!
- Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
- Trump: ఇరాన్తో యుద్ధం ముగిసింది.. వైట్హౌస్ కీలక ప్రకటన
- EU Car Import Duties: ఈయూ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ.. కార్లు, ట్రక్కులపై 25% సుంకం విధించిన ట్రంప్
Read Also: Jio World Garden: ముకేశ్ అంబానీ సంపన్నుల కోసం కట్టించిన పెళ్లి వేదిక అద్దె ఎంతో తెలుసా?
స్నానం చేయడానికి కట్లు విడిచిన తర్వాత తనపై దాడికి పాల్పడ్డాడని, తన ముఖానికి తుపాకీ గురిపెట్టి, బెడ్రూంలోకి ఈడ్చుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు ఆమె తన వేధింపులను వెల్లడించింది. అతను లైంగిక వేధింపులకు పాల్పడుతూనే ఉండేవాడని, తనకు మసాజ్ చేయవచ్చా అని అడుగుతుండే వాడని, పీరియడ్స్ ఎప్పుడు వస్తాయని రోజూ అడుగుతుండే వాడని ఆమె వెల్లడించింది.
అయితే, తన చర్యలపై పశ్చాత్తాపం వ్యక్తి చేస్తూ.. ఈ విషయాన్ని ఇజ్రాయిల్కి తెలియజేయవద్దని చివరకు వేడుకున్నాడని సౌసానా చెప్పారు. తనను వేరే ప్రాంతానికి మార్చిన తర్వాత కూడా తనపై వేధింపులు ఆగలేదని తరుచూ కొట్టేవారని చెప్పింది. 240 మంది బందీల్లో ఇప్పటికీ 130 మంది బందీలు ఇంకా హమాస్ కస్టడీలోనే ఉన్నారు. కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం చర్చలు జరుగుతున్నాయి. అక్టోబర్ 7న జరిగిన దాడితో ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఇప్పటికే 32,000 మంది పాలస్తీనియన్లు మరణించారు.
https://twitter.com/OliLondonTV/status/1772748448200020440
తాజావార్తలు
-
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలుడు..ముగ్గురు జవాన్లు మృతి..
-
Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ పోరు!
-
Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
-
Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!