Israel-Hamas: బందీ-ఖైదీల మార్పిడిపై కుదిరిన సయోధ్య
- బందీ-ఖైదీల మార్పిడిపై కుదిరిన సయోధ్య
- టెల్అవీవ్ వేదికగా ఒప్పందం కుదిరిందన్న హమాస్
- విడుదలకానున్న 600 మంది పాలస్తీనా ఖైదీలు
మొత్తానికి ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీలు-ఖైదీల విడుదలకు మార్గం సుగమం అయింది. తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్.. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తుండగా.. ఇజ్రాయెల్.. పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తోంది. అయితే ఇజ్రాయెల్ బందీల విడుదల సమయంలో హమాస్ క్రూరంగా ప్రవర్తిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. దీంతో పాలస్తీనా ఖైదీల విడుదల విషయంలో జాప్యం చేసింది. దీంతో కొంత సందిగ్ధం ఏర్పడింది. మొత్తానికి టెల్అవీవ్ వేదికగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య సయోధ్య కుదిరిందని హమాస్ మంగళవారం ప్రకటించింది.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో తప్పిన మరో ఘోర విమాన ప్రమాదం.. ఒకే రన్వేపైకి రెండు విమానాలు
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
తొలి ఒప్పందంలో భాగంగా ఇప్పటి వరకు హమాస్.. 33 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసింది. తాజాగా నలుగురు బందీల మృతదేహాలను కూడా అప్పగించనున్నట్లు హమాస్ ప్రకటించింది. ఇక పాలస్తీనా ఖైదీలను కూడా ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. 600 మంది పాలస్తీనా ఖైదీలు విడుదలకానున్నారు. ఇదిలా ఉంటే తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించాలని ఇజ్రాయెల్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన 63 మంది బందీలను కూడా స్వదేశానికి తీసుకురావాలని ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. అయితే దీనిపై మరోసారి చర్చించాల్సిన అవసరం ఉంటుంది.
ఇది కూడా చదవండి: Godavari River: మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి.. గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు
జనవరి 19న అమెరికా మద్దతుతో ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తుల సాయంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందం శనివారంతో ముగుస్తుంది. అనంతరం ఏం జరుగుతుందో సస్పెన్ష్గా మారింది. ఇప్పటివరకు హమాస్.. 33 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసింది. ఇజ్రాయెల్.. 2,000 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. గురువారం మరో నలుగురు బందీల మృతదేహాలను హమాస్ అప్పగించనుంది.
2023 అక్టోబర్ 7న హమాస్ నేతృత్వంలో ఇజ్రాయెల్పై దాడి చేసి 251 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. అనంతరం గాజాపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో వందలాది మంది పాలస్తీనియులు ప్రాణాలు కోల్పోయారు. గాజాను ఐడీఎఫ్ పూర్తిగా ధ్వంసం చేసింది. ఇదిలా ఉంటే గాజాను స్వాధీనం చేసుకుంటామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనను అరబ్ దేశాలు ఖండించాయి.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi Cases: వల్లభనేని వంశీపై మరో ఫిర్యాదు
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!