Hamas: పాలస్తీనా కోసం ప్రత్యర్థి గ్రూపులతో చేతులు కలిపిన హమాస్.. బీజింగ్ వేదికగా ఒప్పందం..
- గాజా యుద్ధంలో కీలక పరిణామం..
- ప్రత్యర్థి గ్రూపులతో చేతులు కలిపిన హమాస్..
- యుద్ధానంతరం పాలనపై చైనా వేదికగా ఒప్పందం..
Hamas: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం సంభవించింది. ఇన్నాళ్లు ప్రత్యర్థి గ్రూపులుగా ఉన్న హమాస్, పాలస్తీనాలోని ఇతర గ్రూపులు చేతులు కలిపాయి. పాలస్తీనా కోసం ‘జాతీయ ఐక్యత’ కోసం పాలస్తీనాలోని ప్రత్యర్థులతో హమాస్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హమాస్, ఫతాతో సహా 12 ఇతర పాలస్తీనియన్ గ్రూపులకు చెందిన ప్రతినిధులతో బీజింగ్ వేదికగా ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. సీనియర్ హమాస్ అధికారి ముసా అబు మర్జుక్, ఫతా దూత మహమూద్ అల్-అలౌల్, ఇతర ప్రతినిధులకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆతిథ్యం ఇచ్చారు. యుద్ధం ముగిసిన తర్వాత పాలస్తీనాను పాలించే ఒప్పందంగా చైనా దీనిని అభివర్ణించింది.
Read Also: Mallikarjun Kharge: కుర్చీని కాపాడిన రెండు రాష్ట్రాలకే మేలు.. ఖర్గె సంచనల వ్యాఖ్యలు
Also Read
- Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
- Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
ఇజ్రాయిల్, హమాస్ పోరు ప్రారంభమైన 9 నెలల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. అక్టోబర్ 07న హమాస్ ఇజ్రాయిల్పై దాడి చేసి 1200 మందిని హతమార్చింది. 251 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెల్లింది. వీరిలో ఇప్పటికీ 116 మంది గాజాలోనే ఉన్నారు. ఈ దాడి తర్వాత గాజాతో పాటు ఇతర పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. హమాస్ పూర్తిగా అంతమయ్యే వరకు ఆపరేషన్ జరుపుతామని పలు సందర్భాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. గాజాపై జరిగిన దాడిలో ఇప్పటి వరకు 39,000 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఈ పోరాటం గాజాలో తీవ్రమైన మానవతా సంక్షోభానికి కారణమైంది.
పాలస్తీనా భూభాగాలైన గాజా స్ట్రిప్ని హమాస్ పాలిస్తుండగా, వెస్ట్ బ్యాంక్ని ఫతా పాలిస్తోంది. ఈ రెండు గ్రూపుల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. దీంతో పాలస్తీనా వివాదం మరింత సంక్లిష్టంగా మారింది. ఈ వివాదంతో చైనా మధ్యవర్తిత్వం వహించింది. మంగళవారం బీజింగ్లో ప్రకటించిన ఒప్పందం కొనసాగుతోందా లేదా అనేది అస్పష్టంగా ఉన్నప్పటికీ, పాలస్తీనా ప్రత్యర్థుల మధ్య సయోధ్యను రూపొందించడంలో చైనా విజయవంతమైంది. ‘‘బీజింగ్ డిక్లరేషన్’’ అని పిలువబడుతున్న ఈ ఒప్పందంపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాదడుతూ.. యుద్ధానంతరం ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఒప్పందమని అన్నారు. మంగళవారం జరిగిన సమావేశంలో జిప్ట్, అల్జీరియా మరియు రష్యాకు చెందిన రాయబారులు కూడా ఉన్నారు.
తాజావార్తలు
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!