Hamas: పాలస్తీనా కోసం ప్రత్యర్థి గ్రూపులతో చేతులు కలిపిన హమాస్.. బీజింగ్ వేదికగా ఒప్పందం..
- గాజా యుద్ధంలో కీలక పరిణామం..
- ప్రత్యర్థి గ్రూపులతో చేతులు కలిపిన హమాస్..
- యుద్ధానంతరం పాలనపై చైనా వేదికగా ఒప్పందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hamas: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం సంభవించింది. ఇన్నాళ్లు ప్రత్యర్థి గ్రూపులుగా ఉన్న హమాస్, పాలస్తీనాలోని ఇతర గ్రూపులు చేతులు కలిపాయి. పాలస్తీనా కోసం ‘జాతీయ ఐక్యత’ కోసం పాలస్తీనాలోని ప్రత్యర్థులతో హమాస్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హమాస్, ఫతాతో సహా 12 ఇతర పాలస్తీనియన్ గ్రూపులకు చెందిన ప్రతినిధులతో బీజింగ్ వేదికగా ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. సీనియర్ హమాస్ అధికారి ముసా అబు మర్జుక్, ఫతా దూత మహమూద్ అల్-అలౌల్, ఇతర ప్రతినిధులకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆతిథ్యం ఇచ్చారు. యుద్ధం ముగిసిన తర్వాత పాలస్తీనాను పాలించే ఒప్పందంగా చైనా దీనిని అభివర్ణించింది.
Read Also: Mallikarjun Kharge: కుర్చీని కాపాడిన రెండు రాష్ట్రాలకే మేలు.. ఖర్గె సంచనల వ్యాఖ్యలు
Also Read
- Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
- Iran and US Tensions: ఇరాన్పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
ఇజ్రాయిల్, హమాస్ పోరు ప్రారంభమైన 9 నెలల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. అక్టోబర్ 07న హమాస్ ఇజ్రాయిల్పై దాడి చేసి 1200 మందిని హతమార్చింది. 251 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెల్లింది. వీరిలో ఇప్పటికీ 116 మంది గాజాలోనే ఉన్నారు. ఈ దాడి తర్వాత గాజాతో పాటు ఇతర పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. హమాస్ పూర్తిగా అంతమయ్యే వరకు ఆపరేషన్ జరుపుతామని పలు సందర్భాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. గాజాపై జరిగిన దాడిలో ఇప్పటి వరకు 39,000 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఈ పోరాటం గాజాలో తీవ్రమైన మానవతా సంక్షోభానికి కారణమైంది.
పాలస్తీనా భూభాగాలైన గాజా స్ట్రిప్ని హమాస్ పాలిస్తుండగా, వెస్ట్ బ్యాంక్ని ఫతా పాలిస్తోంది. ఈ రెండు గ్రూపుల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. దీంతో పాలస్తీనా వివాదం మరింత సంక్లిష్టంగా మారింది. ఈ వివాదంతో చైనా మధ్యవర్తిత్వం వహించింది. మంగళవారం బీజింగ్లో ప్రకటించిన ఒప్పందం కొనసాగుతోందా లేదా అనేది అస్పష్టంగా ఉన్నప్పటికీ, పాలస్తీనా ప్రత్యర్థుల మధ్య సయోధ్యను రూపొందించడంలో చైనా విజయవంతమైంది. ‘‘బీజింగ్ డిక్లరేషన్’’ అని పిలువబడుతున్న ఈ ఒప్పందంపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాదడుతూ.. యుద్ధానంతరం ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఒప్పందమని అన్నారు. మంగళవారం జరిగిన సమావేశంలో జిప్ట్, అల్జీరియా మరియు రష్యాకు చెందిన రాయబారులు కూడా ఉన్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!