Israel-Hamas Conflict: ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ అంగీకారం.. యుద్ధం ముగియనుందా?
- యూఎస్ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగియనుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas Conflict: హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధం నేటికీ కొనసాగుతోంది. ఈ యుద్ధం ముగింపు దశకు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గాజాలో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో హమాస్ యూఎస్ ప్రతిపాదించిన ఒప్పందాన్ని అమలు చేసేందుకు అంగీకరించిందని శనివారం వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి చర్చలు ప్రారంభించాలనే యూఎస్ ప్రతిపాదనకు హమాస్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ ఒప్పందంపై సంతకం చేయాలంటే ముందుగా ఇజ్రాయెల్ శాశ్వత కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని పాలస్తీనా సంస్థ(హమాస్) డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్ అంగీకరిస్తే ఈ ప్రతిపాదన ఓ ఒప్పందానికి దారి తీస్తుందని కాల్పుల విరమణ ప్రయత్నాలలో పాలుపంచుకున్న పాలస్తీనా అధికారి ఒకరు వెల్లడించారు. ఇది ఒప్పందంలో మొదటి దశ అని తెలిసింది. ఒప్పందంలోని రెండో దశను అమలు చేసేందుకు పరోక్ష చర్చలు కొనసాగుతాయి దీంతో గతేడాది అక్టోబర్ 7న మొదలైన గాజా యుద్ధం ముగియనుంది.
Read Also: Imran Khan: నాకు న్యాయం జరగకుంటే నిరాహార దీక్ష చేస్తా..
Also Read
ఈ యుద్ధం వల్ల గాజాలో 38 వేలకు పైగా మరణించారు. హమాస్ మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్ నగరాలపై దాడి చేసిన తర్వాత యుద్ధం ప్రారంభమైంది. వారు దాదాపు 250 మందిని బందీలుగా పట్టుకోగా, దాదాపు 1,200 మంది ఈ దాడిలో మరణించారు. అనంతరం గాజాపై మిలిటెంట్ల ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. గాజాపై బాంబుల వర్షం కురిపించడంతో అమాయక ప్రజలు కూడా మృతి చెందారు.
ఇజ్రాయెల్ దాడిలో ఏడుగురు పాలస్తీనియన్లు మృతి
పాలస్తీనా ఉత్తర వెస్ట్ బ్యాంక్లోని జెనిన్ నగరంలోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు, కాల్పుల్లో పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా భద్రతా వర్గాలు వెల్లడించాయి. జెనిన్ క్యాంప్లోని యువకులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసిందని, పాలస్తీనా ఉగ్రవాదుల కాల్పులకు ప్రతీకారంగా జెనిన్కు పశ్చిమాన ఉన్న ఇంటిని ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టాయని పాలస్తీనా భద్రతా వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ సైన్యం ఆ ప్రాంతానికి అదనపు బలగాలను మోహరించింది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!