Israel-Hamas Conflict: ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ అంగీకారం.. యుద్ధం ముగియనుందా?
- యూఎస్ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగియనుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas Conflict: హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధం నేటికీ కొనసాగుతోంది. ఈ యుద్ధం ముగింపు దశకు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గాజాలో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో హమాస్ యూఎస్ ప్రతిపాదించిన ఒప్పందాన్ని అమలు చేసేందుకు అంగీకరించిందని శనివారం వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి చర్చలు ప్రారంభించాలనే యూఎస్ ప్రతిపాదనకు హమాస్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ ఒప్పందంపై సంతకం చేయాలంటే ముందుగా ఇజ్రాయెల్ శాశ్వత కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని పాలస్తీనా సంస్థ(హమాస్) డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్ అంగీకరిస్తే ఈ ప్రతిపాదన ఓ ఒప్పందానికి దారి తీస్తుందని కాల్పుల విరమణ ప్రయత్నాలలో పాలుపంచుకున్న పాలస్తీనా అధికారి ఒకరు వెల్లడించారు. ఇది ఒప్పందంలో మొదటి దశ అని తెలిసింది. ఒప్పందంలోని రెండో దశను అమలు చేసేందుకు పరోక్ష చర్చలు కొనసాగుతాయి దీంతో గతేడాది అక్టోబర్ 7న మొదలైన గాజా యుద్ధం ముగియనుంది.
Read Also: Imran Khan: నాకు న్యాయం జరగకుంటే నిరాహార దీక్ష చేస్తా..
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
ఈ యుద్ధం వల్ల గాజాలో 38 వేలకు పైగా మరణించారు. హమాస్ మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్ నగరాలపై దాడి చేసిన తర్వాత యుద్ధం ప్రారంభమైంది. వారు దాదాపు 250 మందిని బందీలుగా పట్టుకోగా, దాదాపు 1,200 మంది ఈ దాడిలో మరణించారు. అనంతరం గాజాపై మిలిటెంట్ల ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. గాజాపై బాంబుల వర్షం కురిపించడంతో అమాయక ప్రజలు కూడా మృతి చెందారు.
ఇజ్రాయెల్ దాడిలో ఏడుగురు పాలస్తీనియన్లు మృతి
పాలస్తీనా ఉత్తర వెస్ట్ బ్యాంక్లోని జెనిన్ నగరంలోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు, కాల్పుల్లో పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా భద్రతా వర్గాలు వెల్లడించాయి. జెనిన్ క్యాంప్లోని యువకులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసిందని, పాలస్తీనా ఉగ్రవాదుల కాల్పులకు ప్రతీకారంగా జెనిన్కు పశ్చిమాన ఉన్న ఇంటిని ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టాయని పాలస్తీనా భద్రతా వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ సైన్యం ఆ ప్రాంతానికి అదనపు బలగాలను మోహరించింది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!