Pilots Strike: పైలట్ల సమ్మె.. 800 విమానాలను రద్దు చేసిన జర్మనీ విమానయాన సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pilots Strike: జర్మనీ విమానయాన సంస్థ లుఫ్తాన్సా శుక్రవారం నాడు 800 విమానాలను ప్యాసింజర్, కార్గో విమానాలను రద్దు చేసింది. పైలట్ల సమ్మె కారణంగా ఈ రోజు ఫ్రాంక్ఫర్ట్, మ్యూనిచ్ విమానాశ్రయాలకు వెళ్లే, బయలుదేరే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్లైన్ తెలిపింది. ఇది 130,000 మంది ప్రయాణికులపై ప్రభావం చూపుతుందని గురువారం లుఫ్తాన్సా గ్రూప్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. జీతాల పెంపును డిమాండ్ చేస్తూ పైలెట్ల యూనియన్ శుక్రవారం విధులు బహిష్కరించాలని నిర్ణయించింది. లుఫ్తాన్సా పైలెట్లు ఈ ఏడాది 5.5 శాతం మేర జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు యాజమాన్యం ఒప్పుకోలేదు. సీనియర్ పైలెట్లకు 900 యూరోలు అంటే 5 శాతం, కొత్త ఉద్యోగులకు 18 శాతం మేర జీతాలు పెంచుతామని తెలిపింది. ఈ ఆఫర్ను పైలెట్ల యూనియన్ నిరాకరించడంతో సమ్మె అనివార్యమైంది.
India’s Good News to World: ప్రపంచానికి ఇండియా ‘తీపి’ కబురు
Also Read
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
- Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
- China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్, మ్యూనిచ్కు వెళ్లాల్సిన రెండు లుఫ్తాన్సా విమానాలను సంస్థ రద్దు చేసింది. దీంతో సుమారు 150 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వారి తరఫున వచ్చిన బంధువులు.. శుక్రవారం తెల్లవారుజామున 12 గంటల ప్రాంతంలో డిపార్చర్ గేట్ నం.1, టెర్మినల్ 3, ఎయిర్పోర్టు ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళనలు చేపట్టారు. టికెట్ల డబ్బును వాపసు చేయాలని, లేదా తమ బంధువులకు ప్రత్యామ్నాయ విమానాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఒక్కసారిగా ప్రజలు ఆందోళనకు దిగడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రయాణికుల బంధువులను అక్కడి నుంచి పంపేశారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!