Gabon: సైన్యం గుప్పిట్లోకి మరో ఆఫ్రికా దేశం.. గాబన్లో సంక్షోభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gabon: ఆఫ్రికా దేశాల్లో వరసగా సైనిక తిరుగుబాటులు జరుగుతున్నాయి. ఇప్పటికే నైగర్ దేశంలో సైనిక తిరుగుబాటు ప్రపంచాన్ని మరోసారి యుద్ధం వైపు నడిపించే విధంగా ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలని ఫ్రాన్స్ తో పాటు అమెరికా, ఇతర యూరోపియన్ దేశాలు భావిస్తుంటే మరోవైపు రష్యా ఉంది.
నైగర్ సమస్య ముగియకముందే మరో ఆఫ్రికా దేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది. గాబన్ దేశాన్ని ఆ దేశ ఆర్మీ స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. ఎన్నికల ఫలితాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ దేశానికి చెందిన అన్ని అధికార సంస్థల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత పాలనకు ముగింపు పలుకతున్నామని గాబనీస్ ఆర్మీ తెలిపింది.
Also Read
- Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
- Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
- Kyiv Air Strike: దద్దరిల్లిన ఉక్రెయిన్ రాజధాని.. యుద్ధ రంగంలోకి ‘ఒరేశ్నిక్’ హైపర్సోనిక్ మిస్సైల్!
- Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్! హోర్ముజ్ జలసంధిపై బిగ్ అనౌన్స్మెంట్..
ఒక డజన్ మంది గాబనీస్ సైనికులు బుధవారం ఆ దేశ టెలివిజన్ లో కనిపించి ప్రస్తుత పాలనకు ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. అధ్యక్షుడు అలీ బొంగో ఒండింబా గెలిచిన ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. ప్రస్తుతం రాజధాని లిబ్రేవిల్లేలో ఉద్రిక్తతల నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో కాల్పుల మోత వినిపించినట్లు సమాచారం.
Read Also: China: ప్రజల దృష్టిని మళ్లించే పనిలో డ్రాగన్ కంట్రీ.. అరుణాచల్, తైవాన్పై దాడికి ప్లాన్ చేస్తుందా..?
ప్రస్తుత పాలనను అంతం చేయడం ద్వారా శాంతిని కాపాడాలని మేము నిర్ణయించుకున్నామని సైన్యానికి చెందిన ఓ అధికారి గాబన్ 24 ఛానెల్ లో చెప్పారు. ఆగస్టు 26, 2023 సాధారణ ఎన్నికలు రద్దు చేయబడ్డట్లు అతను ప్రకటించాడు. గాబన్ దేశ ప్రభుత్వం, సెనెట్, జాతీయ అసెంబ్లీ, రాజ్యంగా న్యాయస్థానం రద్దు చేయబడుతున్నట్లు తెలిపాడు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దేశ సరిహద్దుల్ని మూసేస్తున్నట్లు ప్రకటించాడు.
14 ఏళ్లుగా అధ్యక్షుడు బొంగో అధికారంలో ఉన్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి 64.27 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చాడు. అతను గెలిచినట్లు జాతీయ ఎన్నికల అథారిటీ ప్రకటించిన వెంటనే సైన్యం దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. బొంగో ప్రత్యర్థిగా ఉన్న ఆల్బర్ట్ ఓండో ఒస్సా కేవలం 30.77 శాతం ఓట్లను సాధించాడు. ఇతను బొంగో మోసంతో గెలిచాడని ఆరోపిస్తున్నాడు. బొంగో ప్రభుత్వం తప్పుడు వార్తలను ప్రచారం చేయకుండా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ షట్డౌన్ చేశారు.
తాజావార్తలు
-
EV Subsidy: మీరు ఈవీ వెహికిల్ ఇంకా తీసుకోలేదా..? ఇదే కరెక్ట్ సమయం.. మరోసారి సబ్సిడీ పెంపు..!
-
Nirmala Sitharaman: దేశానికి కీలకమైన 3Fలపై.. భారత దేశీయ ఆర్థిక వ్యవస్థపై మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
-
Bhagyashree: “వయసు కాదు.. పాత్ర గొప్పది”.. రితేష్కు తల్లిగా నటించడంపై భాగ్యశ్రీ క్లారిటీ
-
Keerthy Suresh: దసరా బరిలోకి కీర్తి సురేశ్.. ‘రఫ్తార్’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Delhi Capitals: భారీ మూల్యం చెల్లించుకున్నాం.. గుజరాత్, పంజాబ్ మ్యాచ్లను మర్చిపోలేము: డీసీ హెడ్ కోచ్
ట్రెండింగ్
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!