Gabon: సైన్యం గుప్పిట్లోకి మరో ఆఫ్రికా దేశం.. గాబన్లో సంక్షోభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gabon: ఆఫ్రికా దేశాల్లో వరసగా సైనిక తిరుగుబాటులు జరుగుతున్నాయి. ఇప్పటికే నైగర్ దేశంలో సైనిక తిరుగుబాటు ప్రపంచాన్ని మరోసారి యుద్ధం వైపు నడిపించే విధంగా ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలని ఫ్రాన్స్ తో పాటు అమెరికా, ఇతర యూరోపియన్ దేశాలు భావిస్తుంటే మరోవైపు రష్యా ఉంది.
నైగర్ సమస్య ముగియకముందే మరో ఆఫ్రికా దేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది. గాబన్ దేశాన్ని ఆ దేశ ఆర్మీ స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. ఎన్నికల ఫలితాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ దేశానికి చెందిన అన్ని అధికార సంస్థల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత పాలనకు ముగింపు పలుకతున్నామని గాబనీస్ ఆర్మీ తెలిపింది.
Also Read
- Indonesia Earthquake: ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Italy: ఇటలీలో భారీ ప్రమాదం.. డెలివరీ చేసిన 4 రోజులకే మునిగిన లగ్జరీ నౌక
- August 15 Independence Day: భారత్తో పాటు, ఆగస్టు 15న ఈ నాలుగు దేశాలకు స్వాతంత్య్రం..
- Modi-Rahman: బ్రిక్స్కు ముందే ఢిల్లీకి రెహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
ఒక డజన్ మంది గాబనీస్ సైనికులు బుధవారం ఆ దేశ టెలివిజన్ లో కనిపించి ప్రస్తుత పాలనకు ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. అధ్యక్షుడు అలీ బొంగో ఒండింబా గెలిచిన ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. ప్రస్తుతం రాజధాని లిబ్రేవిల్లేలో ఉద్రిక్తతల నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో కాల్పుల మోత వినిపించినట్లు సమాచారం.
Read Also: China: ప్రజల దృష్టిని మళ్లించే పనిలో డ్రాగన్ కంట్రీ.. అరుణాచల్, తైవాన్పై దాడికి ప్లాన్ చేస్తుందా..?
ప్రస్తుత పాలనను అంతం చేయడం ద్వారా శాంతిని కాపాడాలని మేము నిర్ణయించుకున్నామని సైన్యానికి చెందిన ఓ అధికారి గాబన్ 24 ఛానెల్ లో చెప్పారు. ఆగస్టు 26, 2023 సాధారణ ఎన్నికలు రద్దు చేయబడ్డట్లు అతను ప్రకటించాడు. గాబన్ దేశ ప్రభుత్వం, సెనెట్, జాతీయ అసెంబ్లీ, రాజ్యంగా న్యాయస్థానం రద్దు చేయబడుతున్నట్లు తెలిపాడు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దేశ సరిహద్దుల్ని మూసేస్తున్నట్లు ప్రకటించాడు.
14 ఏళ్లుగా అధ్యక్షుడు బొంగో అధికారంలో ఉన్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి 64.27 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చాడు. అతను గెలిచినట్లు జాతీయ ఎన్నికల అథారిటీ ప్రకటించిన వెంటనే సైన్యం దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. బొంగో ప్రత్యర్థిగా ఉన్న ఆల్బర్ట్ ఓండో ఒస్సా కేవలం 30.77 శాతం ఓట్లను సాధించాడు. ఇతను బొంగో మోసంతో గెలిచాడని ఆరోపిస్తున్నాడు. బొంగో ప్రభుత్వం తప్పుడు వార్తలను ప్రచారం చేయకుండా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ షట్డౌన్ చేశారు.
తాజావార్తలు
-
India Test Cricket History: 94 ఏళ్ల టెస్ట్ ప్రయాణం.. 600వ మ్యాచ్కు చేరుకున్న టీమిండియా చరిత్ర ఇదే..!
-
Mahindra BE 6 SPORTEQ: మహీంద్రా BE6 స్పోర్టెక్ ఎలక్ట్రిక్ SUV విడుదల.. 683KM రేంజ్, Gemini AIతో అదిరిపోయే ఫీచర్లు
-
Saira Banu First Look: ముస్లిం అమ్మాయిని ప్రేమించే యువకుడిగా ఆది.. ఆకట్టుకుంటున్న ‘సైరాబాను’ ఫస్ట్ లుక్..
-
Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు బ్రేక్..! హిట్మ్యాన్కు మరో అవకాశం
-
Team India: బ్రిటీషర్ల గడ్డపై స్వాతంత్య్ర దినోత్సవం.. లండన్లో జెండా ఎగరేసిన విరాట్ కోహ్లీ.. గుర్తుందా?
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!