India and Pakistan War: పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించిన జీ7 దేశాలు.. భారత్-పాక్ ఉద్రిక్తతలపై కీలక ప్రకటన
- పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించిన జీ7 దేశాలు..
- భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపు..
- రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించాలని వినతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India and Pakistan War: పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించాయి జీ7 దేశాలు, భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చాయి. క్షిపణి దాడుల ఆరోపణల నేపథ్యంలో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని జీ7 దేశాలు శనివారం కోరాయి. పహల్గామ్ ఉగ్రదాడి.. ఆ తర్వాత భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఈ రోజు ఓ ప్రకటన చేశాయి జీ7 దేశాలు.. “మేం.. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క జీ7 విదేశాంగ మంత్రులు మరియు యూరోపియన్ యూనియన్ ఉన్నత ప్రతినిధిమి.. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఇదే సమయంలో భారతదేశం, పాకిస్తాన్ రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.. సైనిక ఉధృతి ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. రెండు వైపులా పౌరుల భద్రతపై మేం తీవ్ర ఆందోళన చెందుతున్నాం అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: Rajnath Singh: పాకిస్తాన్ తాట తీయాల్సిందే.. సైన్యానికి కీలక ఆదేశాలు
Also Read
- Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్లు.. నెట్టింట తీవ్ర వివాదం
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
ఈ నేపథ్యంలో.. భారత్-పాక్ తక్షణమే ఈ ఉద్రిక్తతలను తగ్గించాలని ఆ ప్రకటన ద్వారా పిలుపునిచ్చాయి జీ7 దేశాలు.. శాంతియుత ఫలితం కోసం రెండు దేశాలు ప్రత్యక్ష సంభాషణలో పాల్గొనాలని సూచించాయి.. మేం ఈ ఘటనలను నిశితంగా పర్యవేక్షిస్తున్నాం.. వేగవంతమైన మరియు శాశ్వత దౌత్యపరమైన పరిష్కారం కోసం మా మద్దతును తెలియజేస్తున్నాం అని పేర్కొన్నారు.. కాగా, 2025.. G7 అధ్యక్ష పదవిని కెనడా చేపట్టనుంది, ఇది జూన్ 15 నుండి 17 వరకు ఆల్బెర్టాలోని కననాస్కిస్లో జీ7 సమావేశాలు జరగనున్నాయి.. అయితే, భారత రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఒక పత్రికా ప్రకటనలో పాకిస్తాన్తో అంతర్జాతీయ సరిహద్దు మరియు నియంత్రణ రేఖ (LOC) వెంబడి 26 ప్రదేశాలలో డ్రోన్లు కనిపించాయని, ఇందులో అనుమానిత సాయుధ డ్రోన్లు కూడా ఉన్నాయని తెలిపింది. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపోరా, నగ్రోటా, జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫాజిల్కా, లాల్గఢ్ జట్టా, జైసల్మేర్, బార్మర్, భుజ్, కుర్బెట్ మరియు లఖి నాలా వంటి ప్రదేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. దురదృష్టవశాత్తూ, ఫిరోజ్పూర్లోని పౌర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని సాయుధ డ్రోన్ దాడి చేయడంతో స్థానిక కుటుంబ సభ్యులు గాయపడ్డారు. వారికి వైద్య సహాయం అందించబడింది మరియు ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు శుభ్రపరిచాయని పేర్కొంది..
తాజావార్తలు
-
Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
-
విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
-
Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్లు.. నెట్టింట తీవ్ర వివాదం
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!