India and Pakistan War: పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించిన జీ7 దేశాలు.. భారత్-పాక్ ఉద్రిక్తతలపై కీలక ప్రకటన
- పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించిన జీ7 దేశాలు..
- భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపు..
- రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించాలని వినతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India and Pakistan War: పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించాయి జీ7 దేశాలు, భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చాయి. క్షిపణి దాడుల ఆరోపణల నేపథ్యంలో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని జీ7 దేశాలు శనివారం కోరాయి. పహల్గామ్ ఉగ్రదాడి.. ఆ తర్వాత భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఈ రోజు ఓ ప్రకటన చేశాయి జీ7 దేశాలు.. “మేం.. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క జీ7 విదేశాంగ మంత్రులు మరియు యూరోపియన్ యూనియన్ ఉన్నత ప్రతినిధిమి.. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఇదే సమయంలో భారతదేశం, పాకిస్తాన్ రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.. సైనిక ఉధృతి ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. రెండు వైపులా పౌరుల భద్రతపై మేం తీవ్ర ఆందోళన చెందుతున్నాం అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: Rajnath Singh: పాకిస్తాన్ తాట తీయాల్సిందే.. సైన్యానికి కీలక ఆదేశాలు
Also Read
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
ఈ నేపథ్యంలో.. భారత్-పాక్ తక్షణమే ఈ ఉద్రిక్తతలను తగ్గించాలని ఆ ప్రకటన ద్వారా పిలుపునిచ్చాయి జీ7 దేశాలు.. శాంతియుత ఫలితం కోసం రెండు దేశాలు ప్రత్యక్ష సంభాషణలో పాల్గొనాలని సూచించాయి.. మేం ఈ ఘటనలను నిశితంగా పర్యవేక్షిస్తున్నాం.. వేగవంతమైన మరియు శాశ్వత దౌత్యపరమైన పరిష్కారం కోసం మా మద్దతును తెలియజేస్తున్నాం అని పేర్కొన్నారు.. కాగా, 2025.. G7 అధ్యక్ష పదవిని కెనడా చేపట్టనుంది, ఇది జూన్ 15 నుండి 17 వరకు ఆల్బెర్టాలోని కననాస్కిస్లో జీ7 సమావేశాలు జరగనున్నాయి.. అయితే, భారత రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఒక పత్రికా ప్రకటనలో పాకిస్తాన్తో అంతర్జాతీయ సరిహద్దు మరియు నియంత్రణ రేఖ (LOC) వెంబడి 26 ప్రదేశాలలో డ్రోన్లు కనిపించాయని, ఇందులో అనుమానిత సాయుధ డ్రోన్లు కూడా ఉన్నాయని తెలిపింది. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపోరా, నగ్రోటా, జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫాజిల్కా, లాల్గఢ్ జట్టా, జైసల్మేర్, బార్మర్, భుజ్, కుర్బెట్ మరియు లఖి నాలా వంటి ప్రదేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. దురదృష్టవశాత్తూ, ఫిరోజ్పూర్లోని పౌర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని సాయుధ డ్రోన్ దాడి చేయడంతో స్థానిక కుటుంబ సభ్యులు గాయపడ్డారు. వారికి వైద్య సహాయం అందించబడింది మరియు ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు శుభ్రపరిచాయని పేర్కొంది..
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!