India and Pakistan War: పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించిన జీ7 దేశాలు.. భారత్-పాక్ ఉద్రిక్తతలపై కీలక ప్రకటన
- పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించిన జీ7 దేశాలు..
- భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపు..
- రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించాలని వినతి..
India and Pakistan War: పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించాయి జీ7 దేశాలు, భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చాయి. క్షిపణి దాడుల ఆరోపణల నేపథ్యంలో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని జీ7 దేశాలు శనివారం కోరాయి. పహల్గామ్ ఉగ్రదాడి.. ఆ తర్వాత భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఈ రోజు ఓ ప్రకటన చేశాయి జీ7 దేశాలు.. “మేం.. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క జీ7 విదేశాంగ మంత్రులు మరియు యూరోపియన్ యూనియన్ ఉన్నత ప్రతినిధిమి.. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఇదే సమయంలో భారతదేశం, పాకిస్తాన్ రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.. సైనిక ఉధృతి ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. రెండు వైపులా పౌరుల భద్రతపై మేం తీవ్ర ఆందోళన చెందుతున్నాం అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: Rajnath Singh: పాకిస్తాన్ తాట తీయాల్సిందే.. సైన్యానికి కీలక ఆదేశాలు
Also Read
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
ఈ నేపథ్యంలో.. భారత్-పాక్ తక్షణమే ఈ ఉద్రిక్తతలను తగ్గించాలని ఆ ప్రకటన ద్వారా పిలుపునిచ్చాయి జీ7 దేశాలు.. శాంతియుత ఫలితం కోసం రెండు దేశాలు ప్రత్యక్ష సంభాషణలో పాల్గొనాలని సూచించాయి.. మేం ఈ ఘటనలను నిశితంగా పర్యవేక్షిస్తున్నాం.. వేగవంతమైన మరియు శాశ్వత దౌత్యపరమైన పరిష్కారం కోసం మా మద్దతును తెలియజేస్తున్నాం అని పేర్కొన్నారు.. కాగా, 2025.. G7 అధ్యక్ష పదవిని కెనడా చేపట్టనుంది, ఇది జూన్ 15 నుండి 17 వరకు ఆల్బెర్టాలోని కననాస్కిస్లో జీ7 సమావేశాలు జరగనున్నాయి.. అయితే, భారత రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఒక పత్రికా ప్రకటనలో పాకిస్తాన్తో అంతర్జాతీయ సరిహద్దు మరియు నియంత్రణ రేఖ (LOC) వెంబడి 26 ప్రదేశాలలో డ్రోన్లు కనిపించాయని, ఇందులో అనుమానిత సాయుధ డ్రోన్లు కూడా ఉన్నాయని తెలిపింది. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపోరా, నగ్రోటా, జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫాజిల్కా, లాల్గఢ్ జట్టా, జైసల్మేర్, బార్మర్, భుజ్, కుర్బెట్ మరియు లఖి నాలా వంటి ప్రదేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. దురదృష్టవశాత్తూ, ఫిరోజ్పూర్లోని పౌర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని సాయుధ డ్రోన్ దాడి చేయడంతో స్థానిక కుటుంబ సభ్యులు గాయపడ్డారు. వారికి వైద్య సహాయం అందించబడింది మరియు ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు శుభ్రపరిచాయని పేర్కొంది..
తాజావార్తలు
-
Egg Pickle Recipe : నాలుకపై నర్తించే రుచి.. ఇంట్లోనే కోడిగుడ్డు పచ్చడి.. తయారీ విధానం ఇలా..!
-
Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?
-
Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
-
Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
-
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!