Titan: ఒడ్డుకు చేరిన టైటాన్ శకలాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Titan: టైటానిక్ షిప్ శిధిలాలను చూడటానికి వెళ్లిన టైటాన్ జలాంతర్గామి పేలిపోయిన విషయం తెలిసిందే. అందులో ప్రయాణించిన 5 మంది మరణించిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు టైటాన్కు చెందిన శకలాలను అట్లాంటిక్ మహాసముద్రం అడుగు భాగం నుంచి ఒడ్డుకు చేర్చారు. కెనడాలోని సెయింట్ జోన్స్లో హారిజాన్ ఆర్కిటిక్ షిప్లో ఈ లోహ శకలాలను ఒడ్డుకు చేర్చినట్టు అధికారులు చెబుతున్నారు. టైటాన్ సబ్కు చెందిన లోహ శకలాలు టార్పాలిన్లతో కప్పి ఉండగా వాటిని క్రేన్లతో ట్రక్లోకి మార్చారు. టైటాన్ సబ్కు చెందిన ల్యాండింగ్ ఫ్రేమ్, వెనుక కవర్ దొరికాయని అమెరికా కోస్ట్ గార్డ్ అధికారులు చెప్పారు. టైటాన్కి చెందిన అయిదు భాగాలు టైటానిక్ నౌక ముందు భాగానికి 487 మీటర్ల దూరంలో లభించినట్లు కోస్ట్ గార్డ్ రేర్ అడ్మిరల్ జాన్ మౌగర్ చెప్పారు.
Read also: Attack on US Consulate: యూఎస్ కాన్సులేట్పై దాడి.. కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు సహా ఇద్దరు మృతి
Also Read
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
- Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలు చూడ్డానికి అయిదుగురితో అట్లాంటిక్ మహా సముద్ర అడుగు భాగానికి వెళ్లే క్రమంలో టైటాన్ సబ్మెర్సిబుల్ పేలిపోయిన విషయం తెలిసిందే. సముద్రం అడుగున్న ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు ఓషన్ గేట్ సీఈఓ 61 ఏళ్ల స్టాక్టన్ రష్, 48 ఏళ్ల బ్రిటిష్ పాకిస్తానీ వ్యాపారవేత్త షహజాదా దావూద్, 19 ఏళ్ల ఆయన కొడుకు సులేమాన్, 58 ఏళ్ల బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఫ్రాన్స్కు చెందిన 77 ఏళ్ల హెన్రీ నార్గొలెట్ ఇందులో వెళ్లారు. వెళ్లిన కొద్దిసేపటికే జలాంతర్గామీ పేలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఉలాంతర్గామిలో ప్రయాణించిన అయిదుగురూ ప్రాణాలు కోల్పోయారు. టైటాన్తో సంబంధాలు తెగిపోయిన తర్వాత దాని రెస్క్యూ ఆపరేషన్లో ఉన్న అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బందికి అది పేలిపోయినట్లు భారీ శబ్దం వినిపించింది. ఆ తరువాత టైటాన్ను కనుగొనడానికి కోస్ట్ గార్డ్ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే 5 రోజుల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం టైటాన్ జలాంతర్గామి పేలిపోయినట్టు అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించిన శకలాలను ఇప్పుడు అధికారులు గుర్తించి ఒడ్డుకు చేర్చారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!