Titan: ఒడ్డుకు చేరిన టైటాన్ శకలాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Titan: టైటానిక్ షిప్ శిధిలాలను చూడటానికి వెళ్లిన టైటాన్ జలాంతర్గామి పేలిపోయిన విషయం తెలిసిందే. అందులో ప్రయాణించిన 5 మంది మరణించిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు టైటాన్కు చెందిన శకలాలను అట్లాంటిక్ మహాసముద్రం అడుగు భాగం నుంచి ఒడ్డుకు చేర్చారు. కెనడాలోని సెయింట్ జోన్స్లో హారిజాన్ ఆర్కిటిక్ షిప్లో ఈ లోహ శకలాలను ఒడ్డుకు చేర్చినట్టు అధికారులు చెబుతున్నారు. టైటాన్ సబ్కు చెందిన లోహ శకలాలు టార్పాలిన్లతో కప్పి ఉండగా వాటిని క్రేన్లతో ట్రక్లోకి మార్చారు. టైటాన్ సబ్కు చెందిన ల్యాండింగ్ ఫ్రేమ్, వెనుక కవర్ దొరికాయని అమెరికా కోస్ట్ గార్డ్ అధికారులు చెప్పారు. టైటాన్కి చెందిన అయిదు భాగాలు టైటానిక్ నౌక ముందు భాగానికి 487 మీటర్ల దూరంలో లభించినట్లు కోస్ట్ గార్డ్ రేర్ అడ్మిరల్ జాన్ మౌగర్ చెప్పారు.
Read also: Attack on US Consulate: యూఎస్ కాన్సులేట్పై దాడి.. కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు సహా ఇద్దరు మృతి
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలు చూడ్డానికి అయిదుగురితో అట్లాంటిక్ మహా సముద్ర అడుగు భాగానికి వెళ్లే క్రమంలో టైటాన్ సబ్మెర్సిబుల్ పేలిపోయిన విషయం తెలిసిందే. సముద్రం అడుగున్న ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు ఓషన్ గేట్ సీఈఓ 61 ఏళ్ల స్టాక్టన్ రష్, 48 ఏళ్ల బ్రిటిష్ పాకిస్తానీ వ్యాపారవేత్త షహజాదా దావూద్, 19 ఏళ్ల ఆయన కొడుకు సులేమాన్, 58 ఏళ్ల బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఫ్రాన్స్కు చెందిన 77 ఏళ్ల హెన్రీ నార్గొలెట్ ఇందులో వెళ్లారు. వెళ్లిన కొద్దిసేపటికే జలాంతర్గామీ పేలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఉలాంతర్గామిలో ప్రయాణించిన అయిదుగురూ ప్రాణాలు కోల్పోయారు. టైటాన్తో సంబంధాలు తెగిపోయిన తర్వాత దాని రెస్క్యూ ఆపరేషన్లో ఉన్న అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బందికి అది పేలిపోయినట్లు భారీ శబ్దం వినిపించింది. ఆ తరువాత టైటాన్ను కనుగొనడానికి కోస్ట్ గార్డ్ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే 5 రోజుల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం టైటాన్ జలాంతర్గామి పేలిపోయినట్టు అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించిన శకలాలను ఇప్పుడు అధికారులు గుర్తించి ఒడ్డుకు చేర్చారు.
తాజావార్తలు
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..