SriLankan Crisis: ఆర్థిక సంక్షోభం తీవ్రం.. దుర్భర పరిస్థితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. గత ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా శ్రీలంక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వంటగ్యాస్, నిత్యావసరాలు కొండెక్కి కూర్చున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇంధనం కోసం ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద క్యూలైన్లో గంటలకొద్దీ నిల్చోలేక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు ఆందోళనకు దిగుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నాయి. దీంతో శ్రీలంక సర్కారు పెట్రోలు బంకుల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులకు తోడుగా సైనిక బలగాలను మోహరింపజేసింది. శ్రీలంకలో నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగిశాయి. ఆర్థిక సంక్షోభం ప్రభావం ఆహార సంక్షోభానికి దారితీసింది. ప్రస్తుతం లంకలో కిలో చికెన్ ధర వెయ్యి కాగా.. ఒక గుడ్డు ధర 35 రూపాయలు దాటిపోయింది. ఏదీ కొనే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో లంకేయులు ఆకలితో అలమటించాల్సిన దుర్భర పరిస్థితులు దాపురించాయి. ఇలాంటి పరిస్థితుల్లో లంకలోని తమిళులు.. శరణార్థులుగా మారి భారత్లోకి ప్రవేశిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు సుమారు 20 మంది శ్రీలంక నుంచి సముద్ర మార్గం ద్వారా తమిళనాడుకు చేరారని తెలుస్తోంది. వీరిలో పలువురు చిన్నారులు ఉన్నారు.
Read Also: High Court: ప్రమాణం చేసిన 10 మంది కొత్త న్యాయమూర్తులు
Also Read
- US War Cost in Iran: 108 రోజుల భీకర యుద్ధం.. అమెరికా ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిందో తెలుసా?
- US-Iran Peace Agreement: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆ ‘15 కీలక షరుతులు’ ఇవే!
- US Iran deal 2026: అమెరికా-ఇరాన్ వివాదానికి ముగింపు.. అవగాహన ఒప్పందంపై సంతకాలు
- India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
కోవిడ్ వైరస్ విజృంభణ మొదలైనప్పటి నుంచి శ్రీలంకను కష్టాలు చుట్టుముట్టాయి. కరోనా కారణంగా దేశానికి పర్యాటకుల రాక తగ్గింది. విదేశాల్లో పనిచేసే శ్రీలంక పౌరుల సంఖ్య కూడా క్రమేపీ తగ్గడంతో విదేశీ కరెన్సీ నిల్వలపై ప్రభావం పడింది. ద్రవ్యోల్బణంతో ప్రజల కొనుగోలు సామర్థ్యం చాలా తగ్గిపోయింది. ఇలా పరిస్థితులు నానాటికీ తీసికట్టుగా మారడంతో లంక తమిళులు భారత్ వైపు మల్లుతున్నారు. తమిళనాడు తీరం రామేశ్వరం, ధనుష్కోటిలకు లంక తమిళులు వస్తున్నారు. ఇప్పటికే ఇలా వచ్చిన 16 మందిని కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకుంది. శ్రీలంకలో ఆర్థిక, ఆహార సంక్షోభం ఇలాగే కొనసాగితే.. మరింత మంది లంక తమిళులు.. భారత్కు శరణార్థులుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
- Tags
తాజావార్తలు
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
PF Withdrawal Via UPI-ATM: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం..
-
Anandita Surgery Rumours : అలాంటి సర్జరీలు చేయించుకోలేదు… ట్రోలర్స్ పై మండిపడ్డ ఖుష్బూ కూతురు
-
Gill-Gambhir: టీమిండియాకు తలనొప్పులు తప్పవు.. గిల్, గంభీర్ నిర్ణయంపై విమర్శలు!
-
US War Cost in Iran: 108 రోజుల భీకర యుద్ధం.. అమెరికా ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిందో తెలుసా?
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!