Gill-Gambhir: టీమిండియాకు తలనొప్పులు తప్పవు.. గిల్, గంభీర్ నిర్ణయంపై విమర్శలు!
- మూడో స్థానంలో శుభ్మన్ గిల్ బ్యాటింగ్
- ఓపెనర్గా యశస్వి జైస్వాల్
- గిల్, గంభీర్ నిర్ణయంపై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ప్రయోగాత్మకంగా తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ స్థానాన్ని వదిలి మూడో స్థానంలో బ్యాటింగ్కు రావడం, యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ను రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్గా పంపించడం పట్ల మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారి తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఈ నిర్ణయం భవిష్యత్తులో జట్టు యాజమాన్యానికి తలనొప్పిగా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు.
లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు. అయితే మూడో స్థానంలో వచ్చిన శుభ్మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 110 బంతుల్లో 154 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు ప్రధాన కారణమయ్యాడు. మరోవైపు రోహిత్ శర్మ 48 పరుగులతో రాణించాడు. ఈ నేపథ్యంలో క్రిక్బజ్ కార్యక్రమంలో మాట్లాడిన మనోజ్ తివారీ.. జట్టు మేనేజ్మెంట్ వ్యూహంపై ప్రశ్నలు లేవనెత్తాడు. ‘రోహిత్ శర్మ, జైస్వాల్తో ఓపెనింగ్ చేయించారు. గిల్ను మూడో స్థానానికి పంపడం వల్ల భవిష్యత్తులో గందరగోళం ఏర్పడుతుంది. ఇప్పుడు గిల్ ఆ స్థానంలో పరుగులు చేస్తే.. మళ్లీ ఓపెనర్గా వెళ్లాలా లేదా అనే సందేహం అతనిలో కలుగుతుంది. ఇది అవసరం లేని తలనొప్పిని సృష్టిస్తుంది’ అని వ్యాఖ్యానించాడు.
Also Read
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
- Haryana: అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ హఠాన్మరణం
- India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- India vs Sri Lanka 2nd Test: భారత్తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
అంతేకాకుండా జట్టు మేనేజ్మెంట్ నిర్ణయాల్లో స్పష్టత కనిపించడం లేదని మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు. ‘మేనేజ్మెంట్ అసలు ఏం చేయాలనుకుంటుందో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ స్పష్టత లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే జైస్వాల్ అన్ని ఫార్మాట్లలో ఆడే అర్హత కలిగిన ఆటగాడు. అతనికి అవకాశాలు రావడం సంతోషకరం. కానీ రోహిత్ శర్మ విఫలమైతే బయట నుంచి మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది’ అని తెలిపాడు. భారత్ బ్యాటింగ్లో గిల్తో పాటు ఇషాన్ కిషన్ కూడా శతకంతో చెలరేగాడు. వీరి అద్భుత ప్రదర్శనతో భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం 403 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది.
తాజావార్తలు
-
Venkatesh VP : “కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా తెలుగు సినిమా
-
Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
-
Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
-
Khelo India : ఖేలో ఇండియాకి భారీ నిధులు.. భారత క్రీడారంగానికి సరికొత్త వెలుగులు..
-
YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!