Sri Lanka: శ్రీలంకలో ఘోర విషాదం.. లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి
- శ్రీలంకలో ఘోర విషాదం
- లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎల్లా-వెల్లవాయ ప్రధాన రహదారి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ బస్సు లోయలో పడి పోయింది. 250 అడుగుల పైనుంచి బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మున్సిపల్ కార్మికులు మృతి చెందారు. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సెలవుల నేపథ్యంలో రావణా ఎల్లా దగ్గరకు మున్సిపల్ కార్మికులు మినీ బస్సులో వెళ్తున్నారు. కొండపైకి వెళ్తున్న సమయంలో ఘాట్ రోడ్డులో బస్సు అదుపు తప్పి లోయలో పడి పోయింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. 15 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. మరో 18 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని బదుల్లా టీచింగ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mirai : సెన్సార్ పనులు ముగించుకున్న ‘మిరాయ్’.. రన్టైమ్ ఎంతంటే ?
Also Read
- US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
- Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
- Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
- UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు తెలిపారు. ఎల్లా-వెల్లవాయ ప్రధాన రహదారిపై 24వ కిలోమీటర్ పోస్ట్ సమీపంలో గురాత్రి రాత్రి మినీ బస్సు కొండచరియలో పడిపోయిందని పేర్కొన్నారు. ప్రమాద స్థలంలో భద్రతా దళాలు, పోలీస్ సిబ్బంది సహాయ చర్యలు పాల్గొన్నట్లు చెప్పారు. అయితే చీకటి కారణంగా సహాయ చర్యలు ముందుకు సాగడం లేదని వెల్లడించారు. టంగల్లె మున్సిపల్ కౌన్సిల్ ఉద్యోగుల బృందం విహారయాత్రకు వెళ్లినట్లుగా చెప్పారు. ఈ బృందం ఎల్లా నుంచి తంగల్లెకు తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగిందని వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ఉన్నట్లు సమాచారం. దాదాపు 500 మీటర్ల దూరంలో బోల్తా పడి ఆగిపోయినట్లుగా వివరించారు. ప్రస్తుతం ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నట్లుగా వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Digital Arrest : వృద్ధ దంపతులను బెదిరించి రూ.40 లక్షలు దోచుకున్న సైబర్ నేరగాళ్లు
తాజావార్తలు
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
-
Chairmans Desk : ఏపీ ప్రజల జాతకంలో రాజధాని యోగం లేదా..?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!