Europe: యూరప్ లో కార్చిచ్చు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heatwave in Europe: యూరప్ వ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే యూకేలో భారీగా నమోదు అవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అక్కడ ఎమర్జెన్సీ, రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో పాటు పలు దేశాల్లో నమోదు అవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా కార్చిచ్చులు ఏర్పడుతున్నాయి. తాజాగా శనివారం ఫ్రాన్స్, స్పెయిన్ అడవుల్లో మంటలు చెలరేగాయి. వేసవి కాలంలో పెరుగుతున్న హీట్ వేవ్ కారణంగానే కార్చిచ్చులు ఏర్పడుతున్నాయి. నైరుతి ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో ఏర్పడిన కార్చిచ్చును ఆపేందుకు అక్కడి ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 1200 మందికి పైగా అగ్నిమాపక సిబ్బందిని మంటలు అదుపుచేసేందుకు ఏర్పాటు చేశారు. కార్చిచ్చు కారణంగా ఫ్రాన్స్ లోని గిరోండే ప్రాంతం నుంచి 14,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
గడిచిన వారాల్లో ఫ్రాన్స్ తో పాటు పోర్చుగల్, స్పెయిన్ ఇతర యూరోపియన్ దేశాల్లో అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తాజాగా ఫ్రాన్స్ లో ఏర్పడిన కార్చిచ్చు కారణంగా గిరోండే ప్రాంతంలో 25,000 ఎకరాల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. మరోవైపు ఫ్రాన్స్ దేశంలో ఉష్ణోగ్రలు పెరిగిపోతున్నాయి. తాజాగా మొత్తం దేశంలోని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. 96 ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతోంది.
Also Read
- ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
Read Also: Rishi Sunak: యూకే ప్రధాని రేసులో రిషి దూకుడు.. రెండో రౌండ్లోనూ ముందంజ
యూరప్ వ్యాప్తంగా గత వారం వ్యవధిలో వడగాలుల కారణంగా 360 మంది మరణించారు. ఉత్తర యూరప్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న మలానా ప్రావిన్స్ లోని మిజాస్ పట్టణానికి సమీపం వరకు కార్చిచ్చు వ్యాపించింది. దీంతో 3000 మంది ప్రజలను అధికారులు ఇళ్ల నుంచి ఖాళీ చేయించారెు. ఇక స్పెయిన్ లో కూడా అధికారులు కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించారు.
ఇక బ్రిటన్ లో భారీగా ఎండలు నమోదు అవుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇంగ్లాండ్ వ్యాప్తంగా ఎమర్జెన్సీతో పాటు రెడ్ అలెర్ట్ ప్రకటించింది అక్కడి వాతావరణ శాఖ. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో.. అధికారులు వరసగా సమావేశాలు నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చివరి సారిగా బ్రిటన్ లో రికార్డు స్థాయిలో 38.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత 2019లో కేంబ్రిడ్జ్ లో నమోదు అయింది.
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!