Israel-Turkey: ఇజ్రాయిల్ ఆక్రమణదారు అని టర్కీ విమర్శలు.. ఇరు దేశాల మధ్య దౌత్యవివాదం..
Israel-Turkey: టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా వేల మంది జనాలతో అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ పాలస్తీనా అనుకూల ర్యాలీ నిర్వహించారు. వేల మంది సాక్షిగా ఇజ్రాయిల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయిల్ గత 22 రోజులుగా బహిరంగ యుద్ద నేరాలకు పాల్పడుతోందని, అయితే పాశ్చాత్య నాయకులు కాల్పుల విరమణ కోసం పిలుపునివ్వలేదని ఎర్డోగాన్ అన్నారు.
ఇజ్రాయిల్ యుద్ధ నేరస్తుడిగా ప్రపంచమంతా చెబుతామని, ఇందుకు సన్నాహాలు చేస్తున్నామని, యుద్ధ నేరస్తుడిగా ప్రకటిస్తామని వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్ ని ఓ ఆక్రమణదారుగాగా అభివర్ణిస్తూనే, హమాస్ ఉగ్రవాద సంస్థ కాదని మరోసారి చెప్పాడు. అంతకుముందు పాలస్తీనా మిలిటెంట్ గ్రూస్ హమాస్ ను స్వాతంత్ర సమరయోధులుగా పిలిచాడు. ఈ సమస్యకు కారణం వెస్ట్రన్ దేశాలే అని నిందించాడు.
Also Read
- Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
Read Also: Bhatti Vikramarka: ఈసారి రాబోయేది ప్రజాప్రభుత్వం.. ప్రజలందరి సంక్షేమ ప్రభుత్వం
ఇదిలా ఉంటే ఎర్డోగాన్ వ్యాఖ్యలకు ఇజ్రాయిల్ కూడా తీవ్రంగానే స్పందించింది. ఇస్తాంబుల్ లో భారీ ప్రదర్శన తర్వాత ఇజ్రాయిల్ టర్కీలోని తన దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించింది. టర్కీ నుంచి తిరిగి రావాలని తమ పౌరులను కోరింది. టర్కీ నుంచి వస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఇజ్రాయిల్-టర్కీల మధ్య సంబంధాలను పున:పరిశీలించడానికి నేను మా దౌత్యవేత్తలను తిరిగి రమ్మని ఆదేశించినట్లు ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి కోహెన్ ఎక్స్(ట్విట్టర్)లో తెలిపారు.
ఇజ్రాయిల్- హమాస్ యుద్ధంలో ఇరాన్ తర్వాత హమాస్ కి టర్కీ నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. టర్కీ దేశాధ్యక్షుడు ఎర్డోగాన్ బహిరంగంగానే హమాస్ కి మద్దతు తెలుపుతున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు 1400 మందిని చంపేశారు. 200 మందిని బందీలుగా తీసుకున్నారు. దీంతో ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై వరసగా దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఉగ్రవాదులతో పాటు సాధారణ పాలస్తీనా ప్రజలు మరణిస్తున్నారు. గాజాలో 7000కు పైగా ప్రజలు మరణించారు.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?