సుఖాంతం కాని ఎవర్ గివెన్ నౌక కథ.. భారీ నష్టపరిహారం చెల్లిస్తే కానీ వదలరా ?
ఎవర్ గివెన్ నౌక కథ సుఖాంతం కాలేదా ? సూయజ్ నుంచి నౌకను కదిలించినా..యజమానులను వచ్చిన కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవా ? నౌక అక్కడి నుంచి కదలకుండా ఈజిప్ట్ కొర్రీలు పెడుతోందా ? ప్రస్తుతం ఎవర్ గివెన్ నౌక పరిస్థితేంటి ? అసలు విషయానికి వెళ్తే ఎవర్ గివెన్ నౌకకు కొత్త కష్టాలు వచ్చాయి. అయితే ఈ సారి సూయజ్ కాలువ నుంచి కాదు.. ఈజిప్ట్ ప్రభుత్వం నుంచి. అక్కడి నుంచి నౌక కదలాలంటే.. వందల కోట్ల జరిమానా కట్టాలని ఈజిప్ట్ స్పష్టం చేసింది. ప్రస్తుతం దాన్ని గ్రేట్ బిట్టెర్ లేక్లో లంగరు వేసి ఉంచింది. ఎవర్ గివెన్ నౌక.. సూయజ్ కాలువకు అడ్డంగా వారం పాటు నిలిచిపోవడంతో తమకు నష్టాలు వచ్చాయని, ఒక బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించే వరకు దానిని వదిలేది లేదని తేల్చి చెప్పింది. నౌక ఇరుక్కోవడం పై విచారణ పూర్తై, నష్టపరిహారం చెల్లించే వరకు అది ఇక్కడే ఉంటుందని సూయజ్ కెనాల్ అథారిటీ చెప్పింది.
సూయజ్ కాలువ లో ఎవర్ గివెన్ నౌక మళ్లీ కదలగానే కథ సుఖాంతమైందని అందరూ భావించారు. కీలకమైన అంతర్జాతీయ వాణిజ్య జల మార్గాల్లో ఒకటైన సూయజ్ కాలువ నుంచి నౌకను మార్చి చివరిలో విజయవంతంగా కదిలించారు. అయితే ఆ నౌక యజమానులను వచ్చిన కష్టాలు మాత్రం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. కాలువలో రాకపోకలు ఆగడం వల్ల నష్టపోయిన రుసుములు, నౌకను మళ్లీ తేలేలా చేయడానికి జరిగిన తవ్వకాల వల్ల కాలువకు జరిగిన నష్టం, ఆ పనులు చేసిన మెషిన్లు, పరికరాలకు అయిన ఖర్చు అన్నింటికీ ఈజిప్ట్ లెక్కలు వేసింది. నౌక వారం పాటు నిలిచిపోవడంతో తమకు నష్టాలు వచ్చాయని, ఒక బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించే వరకు దానిని వదిలేది లేదని ఈజిప్ట్ చెబుతోంది.
Also Read
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
వాళ్లు పరిహారానికి ఒప్పుకున్న మరుక్షణమే ఆ నౌక కదలడానికి అనుమతిస్తామని చెబుతోంది. అయితే పరిహారం చెల్లించాలని తమకు ఎలాంటి అధికారిక క్లెయిమ్ లేదా లీగల్ డిమాండ్ రాలేదని ఎవర్ గివెన్ నౌక యజమాని, జపాన్కు చెందిన షోయీ కిసెన్ సంస్థ చెప్పింది. కానీ జరిగిన నష్టాన్ని తాము గుర్తించామని, కాలువ అధికారులతో చర్చలు జరుపుతున్నామని తెలిపింది. సూయజ్ కాలువలో సముద్రాల ద్వారా జరిగే మొత్తం వాణిజ్యంలో 12 శాతం జరుగుతుంది.
ప్రతి రోజూ దాదాపు 20 లక్షల బ్యారెళ్ల చమురు, దాదాపు 8శాతం ఎల్పీజీ రవాణా అవుతుంది. అయితే ఎవర్ గివెన్ చిక్కుకు పోవడం వల్ల ఆ ఉత్పత్తుల ధరల పై తీవ్ర ప్రభావం పడింది. దీనికితోడు ఎవర్ గివెన్ కాలువలో ఉన్నప్పుడు అటూ ఇటూ 360 కి పైగా నౌకలు నిలిచిపోయాయని ఒక అంచనా. వాటిలో సరకు రవాణా నౌకలు, చమురు, నేచురల్ గ్యాస్ ట్యాంకర్లు ఉన్నాయి. దీంతో ఈ మార్గం పై తీవ్ర ప్రభావం పడింది. కాలువకు ప్రతిరోజూ 15 మిలియన్ డాలర్ల నష్టం తెచ్చిపెట్టిందని ఈజిప్ట్ చెబుతోంది. ఈ నౌకకు వచ్చిన కొత్త కష్టాలు ఎప్పుడు తీరతాయో చూడాలి మరి.
తాజావార్తలు
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
-
Redmi Pad 2: రెడ్మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
-
JMI VC Mazhar Asif: “భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Raw Mango Chutney Recipe: సింపుల్గా మామిడి చట్నీ… 5 నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన రెసిపీ
-
Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో