Earthquake: నేపాల్లో మళ్లీ భూకంపం.. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: నేపాల్లో మళ్లీ భూకంపం. ఈరోజు (ఆదివారం) ఉదయం 7.24 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. నేపాల్ రాజధాని ఖాట్మండు సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఏదైనా ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగిందా? లేక నష్టం లేదా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ నెల మొదటి వారంలోనూ నేపాల్లో వరుస భూకంపాలు సంభవించాయి. కేవలం అరగంటలో ఐదుసార్లు భూమి కంపించి నేపాల్లో విషాదాన్ని నింపింది. నేపాల్లో తీవ్ర భూకంపాల కారణంగా పలు భవనాలు కుప్పకూలాయి. కూలిన భవనం శిథిలాలు తొలగిస్తుండగా కుప్పలు తెప్పలుగా మృతదేహాలు కనిపించాయి. మొత్తం మరణాల సంఖ్య 3,600 దాటింది. వేలమంది గాయపడ్డారు. విషాద ఛాయలు వీడకముందే మరో భూకంపం వస్తుందని నేపాలీలు ఆందోళన చెందుతున్నారు.
నేపాల్లో నాలుగు సార్లు బలమైన భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే.. ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలో కూడా దీని ప్రభావం కనిపించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం బలమైన భూకంపం వచ్చింది. ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నో, హాపూర్, అమ్రోహా, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. నేపాల్లో మధ్యాహ్నం మొదటి భూకంపాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ గుర్తించింది. NCS దీనిని 5.3 తీవ్రతతో గుర్తించింది మరియు అనేక పదుల కిలోమీటర్ల భూగర్భంలో కేంద్రీకృతమై ఉంది. దీనిని గుర్తించిన అరగంట లోపే భూమి 3.06 వద్ద 6.3 తీవ్రతతో మళ్లీ కంపించింది.
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
ఇది భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్సీఎస్ గుర్తించింది. దీని కేంద్రం బజాంగ్ జిల్లాలో ఉంది. ఆ తర్వాత భూమి స్వల్పంగా కంపించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ భూకంపం కారణంగా ఒక విద్యార్థితో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు మరియు అనేక ఇళ్ళు దెబ్బతిన్నాయి. విద్యార్థి భయంతో రెండంతస్తుల భవనంపై నుంచి దూకినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. బజాంగ్లో జిల్లా పోలీసు కార్యాలయ భవనంతో పాటు పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఖాట్మండుతో పాటు అచ్చం, దోటి, బజురా, బైతాడి జిల్లాల్లో భూకంపం ప్రభావం కనిపించింది. నేపాల్లో రెండోసారి భూకంపం సంభవించిన తర్వాత ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లు, కార్యాలయాల్లోని లైట్లు, ఫ్యాన్లు ఊగిపోయాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ తతంగంపై ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో స్పందించారు. ప్రజలు భయాందోళన చెందవద్దని, సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.
Mahesh Babu: మావా… మాట తప్పారుగా?
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!