భారత దేశంతో పాటు వివిధ దేశాలలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. కాశ్మీర్, నోయిడాలో భూప్రకంపనలు సంభవించాయి. ఈ భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైంది. ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి వుంది.
ఇటు ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూడా 3.6 తీవ్రతతో భూమి కంపించింది. మనదేశంతో పాటు అఫ్గానిస్థాన్- తజికిస్థాన్ సరిహద్దులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని ప్రభావం భారత్లోని కశ్మీర్, నోయిడా సహా ఇతర ప్రాంతాలపై పడింది. ఈ ఉదయం 9.45 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. అటు పాక్లోని వివిధ ప్రాంతాల్లో భూమి కంపించింది. పాకిస్థాన్ ఇస్లామాబాద్లో 7.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.