S. Jaishankar: గాజా సమస్య పరిష్కారానికి తాము మద్దతునిస్తాం..
- గాజా సమస్యకు ద్విదేశ పరిష్కారానికి భారత్ మద్దతు ఇస్తుంది..
- గాజాపై చేసే ఏ తీర్మానంలోనైనా ఉగ్రవాదం, హమాస్ బందీల అంశం ప్రస్తావించాలి..
- లేకపోతే.. అది వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబించదు: విదేశాంగ మంత్రి జై శంకర్..
S. Jaishankar: పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ.. గాజా సమస్యకు ‘ద్విదేశ’ పరిష్కారానికి తాము మద్దతు ఇస్తామని తెలిపారు. గాజాపై చేసే ఏ తీర్మానంలోనైనా ఉగ్రవాదం, హమాస్ బందీల అంశం ప్రస్తావించకపోతే.. అది వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబించదన్నారు. అయితే, భారత్ స్వయంగా ఉగ్రవాద బాధిత దేశమన్నారు. అలాంటిది మనమే టెర్రరిజాన్ని విస్మరించడం, తక్కువగా చూపడం మన ప్రయోజనాలకే విరుద్ధమని వెల్లడించారు. ఎలాంటి తీర్మానాన్ని అయినా.. అందులో వాడిన పదాలతో సహా పరిపక్వతతో భారత్ చూస్తుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని, ప్రజలను బంధించడాన్ని ఢిల్లీ ఖండిస్తుందని జైశంకర్ పేర్కొన్నారు.
Read Also: Minister Sridhar Babu: తెలంగాణకు రూ.2వేల కోట్ల కొత్త పెట్టుబడులు.. పెద్ద సంఖ్యలో పరిశ్రమలు
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశానికి అయినా ప్రతి స్పందించే హక్కు ఉంటుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. ఆయా దేశాలు సాధారణ పౌరుల ప్రాణాలను కూడా దృష్టిలో పెట్టుకుని.. మానవీయ చట్టాలకు, కాల్పుల విరమణకు, హింస ముగింపునకు తాము మద్దతు ఇస్తామని తెలిపారు. ఇక, ఇజ్రాయెల్లో రక్షణ సహకారంపై కూడా ఆయన మాట్లాడుతూ.. జాతీయ భద్రతా ప్రయోజనాల విషయంలో ఇజ్రాయెల్తో బలమైన సంబంధం కొనసాగుతుందన్నారు. మన భద్రత ప్రమాదంలో పడినప్పుడు అండగా నిలిచిందన్నారు. మనం జాతీయ భద్రతా ప్రయోజనాలను బట్టి ముందుకు వెళ్తామని విదేశాంగ మంత్రి అన్నారు.
Read Also: BJP MLA Raja Singh: ఉస్మానియాను పేట్ల బురుజు కు షిఫ్ట్ చేయండి..
కాగా, ఇజ్రాయెల్లో యూఎన్ఆర్ఏడబ్ల్యూ సంస్థను నిషేదించడంపై భారత్ వైఖరి ఏంటని టీఎంసీ నేత సాకేత్ గోపాల్ ప్రశ్నించగా.. అలాగే, వెస్ట్బ్యాంక్లో అక్రమ సెటిల్మెంట్లపైనా విదేశాంగ మంత్రి రియాక్ట్ కావాలని కోరారు. దీనికి జైశంకర్ ఆన్సర్ ఇస్తూ.. UNRAWకు సపోర్టు ఇవ్వడంతో పాటు సహకరించాలని భారత్ నిర్ణయించిందని ఆయన చెప్పారు. తాజాగా ఆ సంస్థకు సహాయం కూడా పంపించాం.. ఏటా ఐదు మిలియన్ డాలర్ల సాయం పంపిస్తున్న విషయాన్ని సభలో తెలిపారు. పాలస్తీనా ప్రజలకు అవసరమైన సహాయం భారత్ నుంచి అందిస్తున్నామని.. ఇప్పటికే 70 మెట్రిక్ టన్నుల సహాయ సామగ్రి, 16.5 మెట్రిక్ టన్నుల ఔషధాలను అందించామని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!