Covid 19: వ్యాక్సిన్ కోసం చైనీయుల పాట్లు.. హాంకాంగ్కు పరుగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinese Travellers Rushing To Hong Kong For mRNA Covid Vaccines: చైనాను కోవిడ్ మహమ్మారి హడలెత్తిస్తోంది. ఎప్పుడూ చూడని విధంగా చైనా ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ప్రభుత్వం ‘జీరో కోవిడ్’ విధానాన్ని ఎత్తేయడం, అత్యంత వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ కారణంగా అక్కడ కేసులు, మరణాల సంఖ్య పెరిగింది. రాజధాని బీజింగ్, షాంఘై ఇతర నగరాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లు కూడా ఖాళీ లేకుండా రోగులతో నిండిపోయాయి.
Read Also: Jayasudha: 64 ఏళ్ల వయస్సులో మూడో పెళ్లి చేసుకున్న జయసుధ.. ?
Also Read
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
ఇదిలా ఉంటే ఇప్పుడు చైనా ప్రజలు వ్యాక్సిన్ కోసం పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా చైనా ప్రధాన భూభాగం నుంచి ప్రజలు హాంకాంగ్ కు వెళ్తున్నారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కోసం చైనా ప్రజలు పెద్ద ఎత్తున హాంకాంగ్ వెళ్తున్నారు. చైనా ప్రధాన భూభాగంలో ఈ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. చైనాలో ఇచ్చిన కరోనా వ్యాక్సిన్లు సరిగ్గా పనిచేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది చైనా తయారీ సినోవాక్ వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ ఫైజర్-బయోఎన్ టెక్ తయారు చేసిన బైవాలెంట్ బూస్టర్ డోసును తీసుకుంటున్నారు.
2019లో చైనాలోని వూహాన్ నగరంలో మొదటిసారిగా కరోనా కేసులు బయటపడ్డాయి. ఆ తరువాత ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాధి విస్తరించింది. అయితే చైనాలో నిర్భంధంగా ‘జీరో కోవిడ్’ విధానాన్ని అనుసరించడంతో అక్కడ కేసుల సంఖ్య తక్కువగానే నమోదు అవుతూ వచ్చింది. అయితే ఈ లాక్ డౌన్లు ఎడాపెడా పెట్టడం వల్ల ప్రజల ఆదాయం దెబ్బతింది. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలై, నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వ జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తేయడంతో పాటు లాక్ డౌన్లను సడలించింది. దీంతో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగింది. చైనీస్ న్యూఇయర్ వస్తుండటంతో కనీవిని ఎరగని రీతిలో కేసులు నమోదు అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?